రంజీ ట్రోఫీ రెండో దశ ఎప్పుడంటే.

రంజీ ట్రోఫీ రెండో దశ ఎప్పుడంటే.

రంజీ ట్రోఫీ రెండో దశ జనవరి 23న ప్రారంభం కానుంది.ఈ టోర్నమెంట్ బీసీసీఐకు చాలా ముఖ్యమైనది, కాబట్టి ఈ రెడ్ బాల్ క్రికెట్‌పై దృష్టి సారిస్తోంది. రంజీ ట్రోఫీలో పాల్గొనే ఆటగాళ్లు ఒక మ్యాచ్ ద్వారా లక్షల రూపాయలు సంపాదించవచ్చు. మరి, రంజీ ఆటగాళ్ల జీతం ఎంత అనేది తెలుసుకుందామా 2024 చివర్లో రంజీ ట్రోఫీ ఒక దశ ముగిసింది.ఇప్పుడు రెండో దశ జానవరి 23 నుంచి మొదలవుతుంది.ఈ టోర్నమెంట్ క్రికెట్‌లో కీలకమైనది.బీసీసీఐ కూడా దీనికి ప్రాధాన్యత ఇస్తోంది.అయితే, రంజీ ఆటగాళ్లు ఒక మ్యాచ్‌లో ఎంత సంపాదిస్తారో తెలుసుకోవాలా? రంజీ ఆటగాళ్లు రోజువారీగా వారి అనుభవం ఆధారంగా జీతాలు పొందుతారు.

రంజీ ట్రోఫీ రెండో దశ ఎప్పుడంటే.
రంజీ ట్రోఫీ రెండో దశ ఎప్పుడంటే.

41 కంటే ఎక్కువ మ్యాచ్‌లు ఆడిన ప్లేయర్లు,ప్లేయింగ్ ఎలెవన్‌లో భాగమైన తర్వాత,రోజుకు ₹60,000 వరకు పొందుతారు.ఒక మ్యాచ్‌లో (నాలుగు రోజుల) ₹2.40 లక్షలు సంపాదిస్తారు.ఈ కేటగిరీలో రిజర్వ్ ఆటగాళ్లకు రోజుకు ₹30,000 లభిస్తాయి.21 నుంచి 40 మ్యాచ్‌లు ఆడిన ఆటగాళ్లకు రోజుకు ₹50,000 మరియు మొత్తం మ్యాచ్‌కు ₹2 లక్షలు. రిజర్వ్ ఆటగాళ్లకు ఈ కేటగిరీలో రోజుకు ₹25,000 లభిస్తాయి. 0 నుంచి 20 మ్యాచ్‌లు ఆడిన ఆటగాళ్లకు రోజుకు ₹40,000 మరియు మొత్తం మ్యాచ్‌కు ₹1.60 లక్షలు లభిస్తాయి. ఈ ఆటగాళ్ల రిజర్వ్ స్ధితిలో ఉన్న వారు రోజుకు ₹20,000 సంపాదిస్తారు.

రంజీ ట్రోఫీ భారత క్రికెట్‌లో ఒక గొప్ప చరిత్రను కలిగి ఉంది. స్వతంత్ర భారతదేశానికి ముందు 1934-35లో ప్రారంభమైన ఈ టోర్నమెంట్ ఇప్పటి వరకు కొనసాగుతుంది. భారతదేశం బ్రిటిష్ పాలనలో ఉండగా, నవనగర్ (ప్రస్తుతం జామ్‌నగర్) మహారాజా రంజిత్ 1896-1902 మధ్య ఇంగ్లాండ్ తరపున 15 టెస్ట్ మ్యాచ్‌లు ఆడారు. ఆయన పేరు ఈ టోర్నమెంట్‌కు పెట్టబడింది.రంజీ ట్రోఫీ ఆటగాళ్ల జీతాల వివరాలు చూస్తుంటే, ఈ టోర్నమెంట్ ఆటగాళ్లకు ఎంత గొప్ప అవకాశాలను ఇస్తుందో అర్థం అవుతుంది.

Related Posts
బాక్సింగ్ డే టెస్ట్ కు నేను కూడా వస్తా అంటోన్న వరుణ్ బ్రో!
boxing day

డిసెంబర్ 26న మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో ప్రారంభమయ్యే బాక్సింగ్ డే టెస్ట్ అభిమానులను ఉత్కంఠకు గురి చేస్తోంది. ఈ మ్యాచ్, ఇండియా మరియు ఆస్ట్రేలియా జట్ల మధ్య Read more

Border Gavaskar Trophy: వరుసగా 1, 2, 3 స్థానాలు కైవసం చేసుకున్న ఇండియా పాలిట యముడు…
border gavaskar trophy

ట్రావిస్ హెడ్ డే-నైట్ టెస్టుల్లో చరిత్ర సృష్టించిన మెరుపు ఇన్నింగ్స్ ఆస్ట్రేలియా బ్యాటర్ ట్రావిస్ హెడ్ తన దూకుడు ఆటతీరుతో డే-నైట్ టెస్టు చరిత్రలో నూతన అధ్యాయాన్ని Read more

దుబాయ్‌లో ఆడనున్న టీమ్ ఇండియా.
దుబాయ్‌లో ఆడనున్న టీమ్ ఇండియా.

ఛాంపియన్స్‌ ట్రోఫీ 2025ను పాకిస్థాన్‌ హోస్ట్‌గా నిర్వహించనున్నప్పటికీ, భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) టీమిండియాను పాకిస్థాన్‌ పంపించేందుకు అంగీకరించలేదు. దీనివల్ల అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) Read more

ఒడిదుడుకుల మధ్య సాగిన ఆట
ఈ ఏడాది విఫలమైన ఏడుగురు

ప్రతీ సంవత్సరం క్రికెట్ ప్రపంచంలో కొందరు స్టార్ ఆటగాళ్లు తమ ప్రతిభతో అభిమానులను మంత్రముగ్ధుల్ని చేస్తారు. అయితే,2024లో మాత్రం కొందరు క్రికెటర్లు తీవ్ర విమర్శలను ఎదుర్కొన్నారు.ప్రదర్శనలో గణనీయమైన Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *