हिन्दी | Epaper
EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Tea Coffee : కర్ణాటకలో ఈనెల 25న రాష్ట్రవ్యాప్త బంద్‌..చిరు వ్యాపారులు

Sudha
Tea Coffee : కర్ణాటకలో ఈనెల 25న రాష్ట్రవ్యాప్త బంద్‌..చిరు వ్యాపారులు

పొరుగున ఉన్న కర్ణాటక రాష్ట్రంలో జీఎస్‌టీ (GST) శాఖ చర్యలకు వ్యాపారులు తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా చిరు వ్యాపారులు, ముఖ్యంగా బేకరీలు, చాయ్‌ షాపులు నిర్వహిస్తున్నవారు జీఎస్‌టీ అధికారులు పంపిన నోటీసులను నిరసిస్తూ పాలు, టీ, కాఫీ (Tea, Coffee)అమ్మకాలను నిలిపివేశారు. వీరు తమ దుకాణాల్లో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేస్తున్నారు. వ్యాపారుల ప్రకారం, వారిపై అనవసరంగా పన్ను కట్టుబాట్లు విధిస్తున్నారని, స్వల్ప వ్యాపారాల్లో కూడా నిబంధనలను గట్టిగా అమలు చేయడాన్ని వారు నిరసిస్తున్నారు. ప్రత్యేకంగా, వారు బ్లాక్ టీ మరియు బ్లాక్ కాఫీ మాత్రమే (Tea, Coffee) విక్రయిస్తున్నారు. పాల వాడకం ఉన్న అన్ని పానీయాలు, ఐటమ్స్‌ను తాత్కాలికంగా నిలిపివేశారు. ఇది కర్ణాటకలోని పలు పట్టణాల్లో ప్రజల దైనందిన జీవితాన్ని ప్రభావితం చేస్తోంది.

 Tea Coffee : కర్ణాటకలో పాలు, టీ, కాఫీ అమ్మకాలు బంద్‌
Tea Coffee : కర్ణాటకలో పాలు, టీ, కాఫీ అమ్మకాలు బంద్‌

మ‌రింత ఉద్ధృతం

ఇప్పటికే చాలామంది స్మాల్ ట్రేడర్స్‌ యూపీఐ చెల్లింపుల‌ను కూడా నిలిపివేశారు. కేవ‌లం క్యాష్ ట్రాన్సాక్షన్స్ మాత్రమే చేస్తున్నారు. జీఎస్‌టీ అధికారులు త‌మ‌ను ల‌క్ష్యంగా చేసుకుని నోటీసులు పంపిస్తున్నారంటూ చిరు వ్యాపారులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. జీఎస్‌టీ అధికారులు తమకు ఇచ్చిన నోటీసుల‌ను వెన‌క్కి తీసుకోక‌పోతే ఆందోళ‌న‌ల‌ను మ‌రింత ఉద్ధృతం చేస్తామ‌ని వారు హెచ్చరించారు. ఈ నేప‌థ్యంలో క‌ర్ణాట‌క ప్రభుత్వం దిగొచ్చింది. చిరు వ్యాపారులకు సంబంధించిన ప్రతినిధుల‌ను చర్చలకు పిలిచింది. బుధవారం మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు సీఎం సిద్ధరామ‌య్య తన ఇంట్లోనే స్మాల్ ట్రేడర్స్‌ ప్రతినిధులతో భేటీ అయ్యారు. ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి. ఒకవేళ ఈ చర్చలు విఫలమై, జీఎస్టీ నోటీసులను వెనక్కి తీసుకోకపోతే ఈ నెల 25న రాష్ట్రవ్యాప్త బంద్‌ నిర్వహిస్తామని చిరువ్యాపారులు హెచ్చరించారు. కాగా 2021 నుంచి 2024 ఆర్థిక సంవ‌త్సరాల మ‌ధ్య జ‌రిగిన యూపీఐ, డిజిట‌ల్ పేమెంట్స్ ఆధారంగా జీఎస్‌టీ విభాగం స్పెషల్‌ డ్రైవ్ చేప‌డుతోంది. ఆ డ్రైవ్‌లో భాగంగా సేవల విభాగంలో ఆన్‌లైన్ పేమెంట్స్‌ విలువ రూ.20 ల‌క్షలలు దాటితే, వస్తువుల విభాగంలో పేమెంట్స్‌ రూ.40 ల‌క్షలు దాటితే అధికారులు చిరువ్యాపారులకు నోటీసులు జారీ చేస్తున్నారు. దాంతో స్మాల్‌ ట్రేడర్స్‌ అంతా ఒక్కటై నిరసన చేస్తున్నారు.

టీ కాఫీని ఎవరు కనుగొన్నారు?

క్రీస్తుపూర్వం 2700 ప్రాంతంలో చైనాలో టీని మొదటిసారిగా తయారు చేశారు , ఇది ప్రపంచంలోని తొలి పానీయాలలో ఒకటిగా నిలిచింది. కాఫీని మొదటిసారిగా పండించడానికి ముందు వెయ్యి సంవత్సరాలు టీని సేవించారని ఆధారాలు చూపిస్తున్నాయి. దీనిని కనుగొన్న తర్వాత, టీని మొదట చైనా చక్రవర్తి షెన్ నంగ్ మరియు అతని శిష్యులు మాత్రమే సేవించారు.

కాఫీ పితామహుడు ఎవరు?

ఇథియోపియా కాఫీ ఎక్కడ నుండి వచ్చిందో దానికి కేంద్రంగా విస్తృతంగా పరిగణించబడుతుంది. మీరు ఎప్పుడైనా “కాఫీ చరిత్ర” అని గూగుల్‌లో సెర్చ్ చేసి ఉంటే, క్రీ.శ. 800 ప్రాంతంలో ఇథియోపియాలోని మేకల కాపరి కల్డి ఇథియోపియాలో కాఫీని ఎలా కనుగొన్నాడనే ప్రసిద్ధ కథను మీరు చూసే ఉంటారు.

భారతదేశంలో కాఫీని ఎవరు ప్రారంభించారు?

భారతదేశంలో కాఫీ సాగు భారతీయ ముస్లిం సాధువు బాబా బుడాన్ తో ప్రారంభమైంది, అతను మక్కా తీర్థయాత్ర నుండి తిరిగి వస్తుండగా, ఏడు కాఫీ గింజలను (తన గడ్డంలో దాచి) యెమెన్ నుండి భారతదేశంలోని మైసూర్ కు అక్రమంగా రవాణా చేశాడు.

Read hindi news: hindi.vaartha.com

Read Also: China: చైనీయులకు వీసాల పునరుద్ధరణ

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870