हिन्दी | Epaper
విద్యార్థినికి గర్భస్రావం భక్తులకు శుభవార్త రుద్రమ రాకెట్ రైల్వే ఉద్యోగాల్లో రిజర్వేషన్లు విద్యాకమిషన్ India vs West Indies కోర్ అర్బన్ చట్టం గోదావరి జలాలు యువతులపై అఘాయిత్యం YouTuber Anvesh Justice LisaGill విద్యార్థినికి గర్భస్రావం భక్తులకు శుభవార్త రుద్రమ రాకెట్ రైల్వే ఉద్యోగాల్లో రిజర్వేషన్లు విద్యాకమిషన్ India vs West Indies కోర్ అర్బన్ చట్టం గోదావరి జలాలు యువతులపై అఘాయిత్యం YouTuber Anvesh Justice LisaGill విద్యార్థినికి గర్భస్రావం భక్తులకు శుభవార్త రుద్రమ రాకెట్ రైల్వే ఉద్యోగాల్లో రిజర్వేషన్లు విద్యాకమిషన్ India vs West Indies కోర్ అర్బన్ చట్టం గోదావరి జలాలు యువతులపై అఘాయిత్యం YouTuber Anvesh Justice LisaGill విద్యార్థినికి గర్భస్రావం భక్తులకు శుభవార్త రుద్రమ రాకెట్ రైల్వే ఉద్యోగాల్లో రిజర్వేషన్లు విద్యాకమిషన్ India vs West Indies కోర్ అర్బన్ చట్టం గోదావరి జలాలు యువతులపై అఘాయిత్యం YouTuber Anvesh Justice LisaGill

Kanipakam Varasidhi Vinayaka: భక్తుల కోరికలు తీర్చే కాణిపాకం వరసిద్ది వినాయకుడు

Hema
Kanipakam Varasidhi Vinayaka: భక్తుల కోరికలు తీర్చే కాణిపాకం వరసిద్ది వినాయకుడు

దేశంలోని అన్ని వినాయక ఆలయాల్లో ప్రత్యేకమైనది కాణిపాక వరసిద్ధి వినాయక ఆలయం. సత్య ప్రమాణాల స్వామిగా ఇక్కడి గణనాథుడు పూజలు అందుకుంటున్నాడు. రోజు రోజుకూ పరిమాణంలో పెరుగుతూ భక్తుల కోరికలు తీర్చే స్వామిగా పేరు పొందాడు. చిత్తూరు జిల్లా ఐరాల మండలంలోని కాణిపాకం గ్రామంలో స్వయంభూగా వెలిసాడు.

ఆలయ చరిత్ర:
ఆలయ చరిత్ర గురించి ఎన్నో దశాబ్దాలుగా ఒక కథ ప్రచారంలో ఉంది. పూర్వం విహారపురి అనే గ్రామంలో ధర్మాచరణ పరాయణులైన ముగ్గురు వికలాంగ అన్నదమ్ములు వ్యవసాయం చేస్తూ జీవనం సాగించేవారు. పూర్వ జన్మ కర్మ ఫలంగా వారు గుడ్డి, మూగ, చెవిటివారిగా జన్మించారు. ఓ ఏడాది గ్రామం కరవుకాటకాలతో అల్లాడిపోయింది. తాగడానికి నీళ్లు కూడా దొరకని దుర్భర స్థితి ఏర్పడింది.

కరవును జయించడానికి ఈ ముగ్గురు సోదరులు (brothers) తమ పొలంలో ఉన్న ఏత బావిని లోతు చేయడానికి పూనుకున్నారు. బావిని తవ్వుతుంటే ఓ పెద్ద బండరాయి అడ్డుపడింది. దాన్ని పలుగు, పారల సాయంతో తొలగిస్తుండగా చేతిలో ఉన్న పార రాయికి తగిలి రక్తం చిమ్మి ఆ ముగ్గురి పై పడింది. దాంతో వారి వైకల్యం పోయి మామూలు మనుషులయ్యారు.

వాళ్లు వెంటనే ఆ గ్రామానిపాలిస్తున్న రాజుకు, (king) గ్రామస్థులకు జరిగిన విషయం వివరించారు. అక్కడికి చేరుకున్న గ్రామస్థులు బావిని పూర్తిగా తవ్వగా ‘గణనాథుని’ రూపం కనిపించింది. గ్రామస్థులు భక్తిశ్రద్ధలతో స్వామిని పూజించి, కొబ్బరికాయలు సమర్పించారు. అలా సమర్పించిన కొబ్బరికాయల నుంచి వచ్చిన తీర్థం ‘కాణి’ స్థలంలో (కాణి అంటే ఎకరం పొలం) పారింది. అప్పటినుంచి విహారపురి కాస్త ‘కాణిపాకరం’గా మారింది. కాలక్రమంలో ‘కాణిపాకం’గా స్థిరపడింది.

Kanipakam Varasidhi Vinayaka
Kanipakam Varasidhi Vinayaka

ఈ క్షేత్రం శివ, వైష్ణవ ఆలయాలకు నిలయం. ఆలయ ప్రాంగణంలో వరసిద్ధి వినాయక స్వామి ఆలయంతో పాటు మణికంఠేశ్వర స్వామి, వరదరాజ స్వామి, వీరాంజనేయ స్వామి ఆలయాలు ఉన్నాయి. బావిలో ఉద్భవించిన వినాయకుడు క్రమంగా పరిమాణంలో పెరుగుతుండటం విశేషం. సుమారు అరవై అయిదు సంవత్సరాల క్రితం ఓ భక్తురాలు స్వామివారికి బహూకరించింది.కవచాలు, 2000వ సంవత్సరం లో మరో భక్తుడు ఇచ్చిన వెండి కవచాలు ప్రస్తుతం స్వామివారికి సరిపోవడం లేదు. ఒకప్పుడు ఇవి స్వామి ఆలంకరణలో భాగంగా వుండేది. భక్తులు వీటిని చూసేందుకు వీలుగా ఆలయంలో ప్రదర్శనగా ఉంచారు. ఇక్కడి స్వామివారి ఎదుట తప్పుడు ప్రమాణాలు చేస్తే శిక్ష అనుభవిస్తారని ప్రతీతి.

స్వామివారి క్షేత్రం పక్కనే ఉన్న బాహుదా నదిని భక్తులు ఎంతో పవిత్రంగా భావిస్తారు. ఆ నది వైశిష్ట్యానికి సంబంధించిన ఓ కథ ప్రచారంలో ఉంది. శంఖుడు, లిఖితుడు అనే సోదరులు స్వామివారిని దర్శించుకునేందుకు తమ గ్రామం నుంచి బయలుదేరారు. దారి మధ్యలో తినడానికి తెచ్చుకున్న ఆహార పదార్థాలు అయిపోయాయి. అప్పటికి వాళ్లు కాణిపాకానికి చాలా దూరంలో ఉన్నారు. లిఖితుడు ఆకలికి తట్టుకోలేక పక్కనే ఉన్న మామిడితోటలో ఓ పండు కోసుకుని తింటానని అన్న శంఖుడిని అడిగాడు.

Kanipakam Varasidhi Vinayaka
Kanipakam Varasidhi Vinayaka

దొంగతనం చేయడం తప్పని శంఖుడు వారించాడు. అయినా లిఖితుడు అన్న చెప్పిన మాటలు పెడచెవిన పెట్టి తోటలోని మామిడిపండు కోసుకుని తిన్నాడు. తమ్ముడు చేసిన దొంగతనం గురించి అన్న రాజుకు వివరించి, అతని రెండు చేతులు నరికివేయించాడు. కానీ తర్వాత తమ్ముడి వైకల్యాన్ని చూసి శంఖుడు చాలా బాధపడ్డాడు. ఇద్దరూ తిరిగి కాణిపాకం చేరుకుని, వినాయకుణ్ణి దర్శించుకునే ముందు పక్కనే ఉన్న నదిలో మునగగా లిఖితునికి పోయిన చేతులు తిరిగి వచ్చాయి.

అప్పటి నుంచి ఆ నదికి బాహుదా (బాహువులు ఇచ్చింది కనుక) అని పేరు వచ్చింది.)

21 రోజులు ఉత్సవాలు:
వరసిద్ధుని ఆలయంలో వినాయక చవితి మొదలు 21 రోజుల పాటు స్వామివారికి బ్రహ్మోత్సవాలు, ప్రత్యేక ఉత్సవాలు నిర్వహిస్తారు. మొదటి తొమ్మిది రోజులు బ్రహ్మోత్సవాలు, తరువాత 12 రోజులు ప్రత్యేక ఉత్సవాలు జరుగుతాయి. రాష్ట్రంలో మరో ఆలయంలో ఇన్ని రోజుల పాటు ఉత్సవాలు నిర్వహించరు.

కాణిపాకం తిరుపతికి ఎనభై కిలోమీటర్లు, జిల్లా కేంద్రం నుంచి పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉంది.

Read also: hindi.vaartha.com

Read also:

https://vaartha.com/ganesh-chaturthi/sunday-magazine/devotional-sunday-magazine/536966/#google_vignette

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

కొండగట్టు అంజన్న దర్శనానికి భారీగా తరలివచ్చిన భక్తులు

కొండగట్టు అంజన్న దర్శనానికి భారీగా తరలివచ్చిన భక్తులు

గణనాధుని దర్శించుకున్న హైకోర్టు జడ్జి

గణనాధుని దర్శించుకున్న హైకోర్టు జడ్జి

శ్రీవారి దర్శనానికి 8–10 గంటల సమయం

శ్రీవారి దర్శనానికి 8–10 గంటల సమయం

అన్నమయ్య జిల్లా కోసువారిపల్లి బ్రహ్మోత్సవాలు 2026 – కల్యాణోత్సవం, రథోత్సవం వివరాలు

అన్నమయ్య జిల్లా కోసువారిపల్లి బ్రహ్మోత్సవాలు 2026 – కల్యాణోత్సవం, రథోత్సవం వివరాలు

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సినీ నటి ఐశ్వర్యా రాజేష్,మీనాక్షి చౌదరి.

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సినీ నటి ఐశ్వర్యా రాజేష్,మీనాక్షి చౌదరి.

ఎస్వీ అన్నప్రసాదం ట్రస్ట్ కు రూ. 10 లక్షలు విరాళం

ఎస్వీ అన్నప్రసాదం ట్రస్ట్ కు రూ. 10 లక్షలు విరాళం

టోకెన్ కలిగిన భక్తులకు అసౌకర్యం లేకుండా వైకుంఠ దర్శనాలు

టోకెన్ కలిగిన భక్తులకు అసౌకర్యం లేకుండా వైకుంఠ దర్శనాలు

వైకుంఠ ద్వార దర్శనాలపై స్పష్టత: టీటీడీ చైర్మన్

వైకుంఠ ద్వార దర్శనాలపై స్పష్టత: టీటీడీ చైర్మన్

ధనూ రాశికి అదృష్టం, ఇంకో రాశులకు ధన వర్షం

ధనూ రాశికి అదృష్టం, ఇంకో రాశులకు ధన వర్షం

దుర్గమ్మ ఆలయంలో నేటి నుంచి మూడ్రోజులు

దుర్గమ్మ ఆలయంలో నేటి నుంచి మూడ్రోజులు

శివ కేశవుల పూజకు అత్యంత పవిత్రమైన తిథి

శివ కేశవుల పూజకు అత్యంత పవిత్రమైన తిథి

ఆరురకాల పత్రాలతో పుష్పయాగం

ఆరురకాల పత్రాలతో పుష్పయాగం

📢 For Advertisement Booking: 98481 12870