తొలకరి జల్లుల సువాసనను పంచే అత్తర్
రకరకాల పెర్ఫ్యూమ్స్ వాడుతుంటాం కదా! తొలకరి జల్లులు పడినప్పుడు వచ్చే సువాసనను పోలిన అత్తర్ (Attar)గురించి విన్నారా..! అలాంటి అత్తరును మనదేశంలోని పెర్ఫ్యూమ్స్ రాజధానిగా పిలిచే ఉత్తరప్రదేశ్ కన్నాజ్ ప్రాంతం తయారు చేస్తుంది. నిజానికి ఈ మట్టివాసనను ‘పెట్టికోర్’ అంటారు. అయితే కన్నౌజ్ ప్రాంతంలో దీన్నే “మిట్టి అత్తర్”(Attar) పేరుతో ఈ పెర్ఫ్యూమ్స్ తయారు చేస్తున్నారు.

పురాతన పద్ధతిలో అత్తర్ తయారీ
దీన్ని పురాతన భారతీయ సాంప్రదాయ పద్ధతిలో చేస్తున్నారు. చెప్పాలంటే ఇది అత్యంత శ్రమ, సమయంతో కూడిన పద్ధతి. అందుకోసం వాళ్ళు ఎలాంటి కెమికల్స్ వంటి వాటిని ఉపయోగించరు. మరీ వర్షం కురిసినప్పుడు వచ్చే నేల వాసనను పోలిన అత్తరు తయారికీ ఏం ఉపయోగిస్తారంటే… గంగానది ఒడ్డున ఉండే మట్టిని, గులాబీ రేకులు లేదా మల్లెపువ్వులతో ఈ అత్తరుని తయారు చేస్తారు.
ఐదువేల ఏళ్ల సంప్రదాయం
తయారీ విధానానికి ఉపయోగించే పాత్రలు సింధులోయ నాగరికత టైంలో ఉపయోగించినవి. ఈ అత్తరు (Attarతయారీ విధానం దాదాపు ఐదువేల ఏళ్ల నాటిది. కానీ ఇప్పటికీ అదే పద్ధతిలోనే అత్తరు తయారు చేయడం కన్నాజ్ ప్రాంతవాసుల ప్రత్యేకత. అంతేగాదు తయారీ మొత్తం పర్యావరణ హితంగానే చేస్తారు.
అత్తర్ ప్యాకింగ్ విధానం
ప్రాసెసింగ్ పద్ధతుల్లో కూడా కేవలం కట్టెల పొయ్యలతో మండిస్తారు. ఇక ప్యాకింగ్ వద్దకు వస్తే చిన్న లెదర్ బాటిల్ రూపంలో ఈ అత్తర్లను మార్కెట్లోకి తీసుకువస్తారు.

ఆధునిక మార్పులు
ప్రస్తుతం ఈ అత్తరు తయారీ పద్ధతిని సవరించి.. బొగ్గులు, కట్టెల పొయ్యలకు ప్రత్యామ్నాయంగా పర్యావరణానికి మరింత అనుకూలమైన పద్ధతులు కోస్తూ అన్వేషిస్తున్నట్లు పాక్రాన్స్ అండ్ ప్లేవర్ డెవలప్మెంట్ సెంటర్ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎఫ్ఎసీ) వారు చెబుతున్నారు.