हिन्दी | Epaper
EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Odisha : పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న విద్యార్థిని.. ఎందుకంటే?

Divya Vani M
Odisha : పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న విద్యార్థిని.. ఎందుకంటే?

ఒడిశాలోని బాలాసోర్‌లో (In Balasore, Odisha) జరిగిన ఘటన ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఫకీర్ మోహన్ కళాశాలలో చదువుతున్న ఓ విద్యార్థిని, తన ఉపాధ్యాయుడి లైంగిక వేధింపులను భరించలేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.బాధిత విద్యార్థిని జూలై 1న కళాశాల అంతర్గత కమిటీకి ఫిర్యాదు చేసింది. విభాగాధిపతి సమీర్ కుమార్ తాను వేధిస్తున్నాడని వివరించింది. కానీ వారం రోజులు గడిచినా, ఉపాధ్యాయుడిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో ఆమె తీవ్రంగా మనస్తాపానికి గురైంది.

Odisha : పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న విద్యార్థిని.. ఎందుకంటే?
Odisha : పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న విద్యార్థిని.. ఎందుకంటే?

వేదనను ఆపే ప్రయత్నంలో శరీరానికే నిప్పంటించుకుంది

జులై 8న, ఇతర విద్యార్థులతో కలిసి కళాశాల గేటు వద్ద నిరసనలో పాల్గొంటున్న ఆమె ఒక్కసారిగా పరుగెత్తి, ప్రిన్సిపల్ కార్యాలయం వద్ద తనపై తాను పెట్రోలు పోసుకుని నిప్పంటించుకుంది (She poured gasoline on herself and set herself on fire) . ఈ సంఘటన అక్కడ ఉన్నవారిని దిగ్భ్రాంతికి గురిచేసింది.ఆమె మంటల్లో ఉన్నప్పుడు ఓ సహ విద్యార్థి ఆమెను కాపాడేందుకు ప్రయత్నించాడు. ఆ సమయంలో అతని టీషర్టుకూ మంటలు అంటుకున్నాయి. ఈ ఘటనలో విద్యార్థిని 95 శాతం, అతను 70 శాతం కాలిన గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

వైరల్ అయిన వీడియో.. అధికారులు స్పందన

విద్యార్థిని మంటల్లో పరుగు తీస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీనిపై స్పందించిన కళాశాల ప్రిన్సిపల్ దిలీప్ ఘోష్, ఆమె ఫిర్యాదు చేసిన విషయాన్ని ధృవీకరించారు. ఆమె బాధను నేను స్వయంగా విన్నాను. సమీర్ కుమార్‌ను ప్రశ్నించాను, అని వెల్లడించారు.ఈ ఘటనపై రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ మంత్రి సూర్యబన్షి సూరజ్ తీవ్రంగా స్పందించారు. బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తప్పవని అన్నారు. పోలీసులు ఇప్పటికే ఉపాధ్యాయుడిని అరెస్ట్ చేశారు. కళాశాల ప్రిన్సిపల్‌ను సస్పెండ్ చేశారు.

Read Also : TUI Airways : విమానం వాష్ రూంలో దమ్ముకొట్టిన జంట

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870