దేశీయ స్టాక్ మార్కెట్ (Stock market) సూచీలు ఈ వారం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9.18 సమయంలో నిఫ్టీ 71 పాయింట్లు పెరిగి 24,790 వద్ద, సెన్సెక్స్ (Sensex) 213 పాయింట్లు పెరిగి 81,332 వద్ద ట్రేడవుతున్నాయి. ఇక సన్ఫ్లాగ్ ఐరన్, షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, కల్పతరు ప్రాజెక్ట్స్, మహారాష్ట్ర స్కూటర్స్, ఎఫ్డీసీ లాభాల్లో ఉండగా.. ఇంటెలెక్ట్ డిజైన్, జూబిలియంట్ ఇన్గ్రేవియా, జీటీఎల్ ఇన్ఫ్రా, కేపీఆర్ మిల్ నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఇక ఆటో మొబైల్ మినహా అన్నిరంగాల సూచీలు సానుకూలంగా ట్రేడవుతున్నాయి.

ద్రవ్యోల్బణం తగ్గుదల
ద్రవ్యోల్బణం తగ్గడం, జూన్-సెప్టెంబరులో సాధారణానికి మించిన వర్షపాతం ఉంటుందనే అంచనాలు, అనుకున్న దానికంటే ఆర్బీఐ (RBI) రేట్ల కోత వంటివి దేశీయ ఇన్వెస్టర్లలో ఉత్సాహాన్ని నింపాయి. ఐటీ, ఫార్మా, ఎఫ్ఎంసిజి, రియల్టీ, మెటల్స్ వంటి రంగాలు సానుకూలంగా ట్రేడవుతున్నాయి. ఇది వినియోగదారుల వ్యయ శక్తిని మెరుగుపరుస్తోంది. దేశీయంగా అనుకూల ఆర్థిక సూచికలు, వాతావరణ అంచనాలు, ద్రవ్యోల్బణ తగ్గుదల మరియు ఆర్బీఐ విధానాలపై అంచనాలు మార్కెట్ను సానుకూలంగా ప్రభావితం చేస్తున్నాయి.
రూపాయి మారకం విలువ – స్వల్ప నష్టాలు
డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ స్వల్పంగా నష్టపోయి రూ.86.18 వద్ద ఉంది. ఆసియా-పసిఫిక్ మార్కెట్లలో చైనాకు చెందిన షాంఘై, జపాన్ నిక్కీ, కొరియా కోస్పి, ఆస్ట్రేలియా ఏఎస్ఎక్స్ 200 లాభాల్లో కొనసాగుతుండగా.. తైవాన్, హాంకాంగ్ సూచీలు నష్టపోతున్నాయి.
Read Also: GDP: తగ్గిన కుటుంబాల పొదుపు.. పెరిగిన రుణాలు