Rishabh Pant: వన్డే సిరీస్‌కు పంత్ దూరం?

Read Time:  1 min
Rishabh Pant: వన్డే సిరీస్‌కు పంత్ దూరం?
FONT SIZE
GET APP

న్యూజిలాండ్‌తో స్వదేశంలో జరగనున్న మూడు వన్డేల సిరీస్ నుంచి స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్‌ను (Rishabh Pant) తప్పించనున్నట్లు సమాచారం. 2025–26 సీజన్‌లో టీమ్ ఇండియా ఆడబోయే ఆఖరి హోమ్ సిరీస్ కోసం ఫామ్, జట్టు సమతుల్యతను దృష్టిలో ఉంచుకుని సెలెక్టర్లు ఈ కఠిన నిర్ణయం తీసుకోబోతున్నట్లు సమాచారం. రిషబ్ పంత్ (Rishabh Pant)స్థానంలో ఇషాన్ కిషన్‌ను జట్టులోకి తీసుకోవాలని సెలెక్షన్ కమిటీ భావిస్తోంది.

Read Also: Mahbub Ali Zaki: ఢాకా క్యాపిటల్స్ అసిస్టెంట్ కోచ్ హఠాన్మరణం

వన్డే జట్టులోకి ఇషాన్ కిషన్‌

రెండేళ్లుగా వన్డేలకు దూరంగా ఉన్న కిషన్ ప్రస్తుతం దేశవాళీ క్రికెట్‌లో అద్భుత ఫామ్‌లో ఉన్నాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో అత్యధిక పరుగులు చేయడమే కాకుండా, విజయ్ హజారే ట్రోఫీలో కేవలం 33 బంతుల్లోనే సెంచరీ బాది సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. ఈ అద్భుత ప్రదర్శనే అతడిని తిరిగి వన్డే జట్టులోకి చేర్చేలా కనిపిస్తోంది.

Will Pant miss the ODI series?
Will Pant miss the ODI series?

రిషభ్ పంత్ చివరిసారిగా 2024 ఆగస్టులో శ్రీలంకపై వన్డే ఆడాడు. ఆ తర్వాత దక్షిణాఫ్రికా పర్యటనలో జట్టులో ఉన్నప్పటికీ ఆడే అవకాశం రాలేదు. ప్రస్తుతం విజయ్ హజారే ట్రోఫీలో ఢిల్లీ జట్టుకు నాయకత్వం వహిస్తున్న పంత్ అక్కడ కూడా ఆశించిన స్థాయిలో రాణించడం లేదు (తొలి రెండు మ్యాచుల్లో 5, 70 పరుగులు). దీంతో ప్రస్తుతానికి పంత్‌ను పక్కనపెట్టి, జోరుమీదున్న ఆటగాళ్లకు అవకాశం ఇవ్వాలని బీసీసీఐ భావిస్తోంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Aanusha

రచయిత గురించి

Aanusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.