📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం

Latest News: Rohit Sharma: గిల్‌కు వన్డే కెప్టెన్సీ పై రోహిత్ ఏమంటున్నారంటే?

Author Icon By Anusha
Updated: October 6, 2025 • 12:46 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

టీమిండియా (Team India) వన్డే క్రికెట్ జట్టులో ఇటీవల జరిగిన మార్పు అభిమానులను ఆశ్యర్యానికి గురిచేసింది.. దేశీయ,అంతర్జాతీయ క్రికెట్‌లో ఎన్నో సార్లు జట్టు కెప్టెన్‌గా రోహిత్ శర్మ చూపిన నాయకత్వ ప్రతిభను అందరికీ తెలిసిందే. అయితే, రోహిత్ శర్మ తన కెప్టెన్సీ కాలానికి ముగింపు పలికిన తర్వాత, బీసీసీఐ (BCCI) యువ ప్రతిభా ఆటగాడు శుభ్‌మన్ గిల్‌కు టీమ్ లీడర్ బాధ్యతలు అప్పగించింది.

India Women Cricket Team: పాక్ బ్యాటర్లను వణికించిన భారత్ బౌలర్లు

13 ఏళ్ల క్రితం రోహిత్ శర్మ (Rohit Sharma) చేసిన ఒక పాత సోషల్ మీడియా పోస్ట్ ఇప్పుడు నెట్టింట హ‌ల్‌చ‌ల్ చేస్తోంది.2027 ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకుని, జట్టును భవిష్యత్తు కోసం సిద్ధం చేసే ప్రణాళికలో భాగంగా గిల్‌కు ఈ అవకాశం ఇచ్చినట్లు తెలుస్తోంది.

రోహిత్ కెప్టెన్సీలో జట్టు అద్భుతంగా రాణిస్తున్నప్పటికీ, దీర్ఘకాలిక ప్రయోజనాల దృష్ట్యా ఈ మార్పు తప్పలేదని బోర్డు వర్గాలు (Board categories) పేర్కొన్నాయి.ఈ పరిణామాల మధ్య, 2012లో రోహిత్ చేసిన ఒక ట్వీట్ ఇప్పుడు వైరల్‌గా మారింది. “ఒక శకం (45) ముగిసింది.. కొత్త శకం (77) మొదలైంది..” అనేది ఆ పోస్ట్ సారాంశం.

గిల్ టెస్టు జట్టుకు కూడా నాయకత్వం వహిస్తున్నాడు

రోహిత్ జెర్సీ నంబర్ 45 కాగా, అతని వారసుడిగా వచ్చిన గిల్ (Shubman Gill) జెర్సీ నంబర్ 77. దీంతో, తన కెప్టెన్సీ ముగింపును రోహిత్ అప్పుడే ఊహించాడా? అంటూ అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.అయితే, ఈ పోస్ట్ వెనుక ఉన్న అసలు విషయం వేరే ఉంది. అప్పట్లో రోహిత్ తన జెర్సీ నంబర్‌ను 45 నుంచి 77కు మార్చుకున్న సందర్భంగా ఆ ట్వీట్ చేశారు.

అది యాదృచ్ఛికంగా ఇప్పటి పరిస్థితులకు సరిగ్గా సరిపోవడంతో చర్చనీయాంశంగా మారింది.26 ఏళ్ల శుభ్‌మన్ గిల్‌కు ఇది రెండో ఫార్మాట్‌లో కెప్టెన్సీ. గత మే నెలలో రోహిత్ టెస్టుల నుంచి వైదొలిగిన తర్వాత, గిల్ టెస్టు జట్టు (Test team) కు కూడా నాయకత్వం వహిస్తున్నాడు. అతని సారథ్యంలో ఇంగ్లండ్‌లో జరిగిన అండర్సన్-టెండూల్కర్ ట్రోఫీని భారత్ 2-2తో డ్రా చేసుకుంది.

వన్డే కెప్టెన్‌గా అతని ప్రస్థానం ఆస్ట్రేలియా పర్యటనతో ప్రారంభం

ఇప్పుడు వన్డే కెప్టెన్‌గా అతని ప్రస్థానం ఆస్ట్రేలియా పర్యటనతో ప్రారంభం కానుంది. అక్టోబర్ 19న పెర్త్‌లో తొలి వన్డే జరగనుంది. రోహిత్, కోహ్లీ వంటి సీనియర్ల అనుభవం మైదానంలో గిల్‌కు ఎంతగానో ఉపయోగపడుతుందని క్రీడా విశ్లేషకులు భావిస్తున్నారు. 2027లో దక్షిణాఫ్రికాలో జరిగే ప్రపంచకప్‌ను గెలవడమే తన ప్రధాన లక్ష్యమని గిల్ ఇప్పటికే స్పష్టం చేశాడు.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

bcci leadership change Breaking News Indian Cricket News latest news ODI Cricket Rohit Sharma Retirement Shubman Gill Captain Team India Telugu News World Cup 2027

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.