ఐపీఎల్ 2025లో భాగంగా 49వ మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్, పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య జరిగింది. ఈ మ్యాచ్లో పంజాబ్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. టాస్ సందర్భంగా ఎంఎస్ ధోని తన రిటైర్మెంట్ గురించి మౌనాన్ని వీడాడు.న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ డానీ మోరిసన్ ధోనిని తదుపరి ఐపీఎల్ సీజన్లో ఆడుతారా అని అడిగాడు.సమయంలో ఎంఎస్ ధోని నవ్వుతూ తాను తదుపరి మ్యాచ్ ఆడతానో లేదో కూడా తెలియదని మహీ నవ్వూతూ బదులిచ్చాడు. ఐపీఎల్ టాస్ ప్రెజెంటర్ డానీ మోరిసన్ ధోనిని ఉద్దేశించి ఇక్కడ(స్టేడియం) అభిమానుల ఉత్సాహాన్ని చూడు అని చెప్పాడు.
రిటైర్మెంట్
ఎంఎస్ ధోని సమాధానం అభిమానులను మళ్లీ ఊహించుకునేలా చేసింది. ఈ క్రమంలో ఎంఎస్ ధోని ఐపీఎల్ నుంచి రైటైర్మెంట్ అవుతారా అనే ఊహాగానాలు మళ్లీ ఊపందుకున్నాయి. 2020లో ధోని అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయ్యాడు. అప్పటి నుంచి ఎంఎస్ ధోని ఐపీఎల్ నుంచి రిటైర్మెంట్ తీసుకుంటాడనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కానీ ధోని ఇంకా ఆడుతున్నాడు. ప్రతి సీజన్ ధోని చివరి సీజన్ అని చెబుతారు కానీ 43 ఏళ్ల ధోని ఇప్పటికీ సీఎస్కేకు కెప్టెన్ గా ఉన్నాడు. ఈ సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ ప్రదర్శన చాలా నిరాశపరిచింది. ఆ జట్టు ఇప్పటివరకు 9 మ్యాచ్ల్లో 2 మ్యాచ్ల్లో మాత్రమే గెలిచింది. పాయింట్ల పట్టికలో ఎంఎస్ ధోని చివరి స్థానంలో ఉన్నాడు. సీఎస్కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ గాయం కారణంగా మొత్తం సీజన్ కు దూరంగా ఉన్నాడు. రుతురాజ్ స్థానంలో మహేంద్ర సింగ్ ధోని నాయకత్వం వహిస్తున్నాడు. అయితే ఎంఎస్ ధోని కెప్టెన్ అయిన తర్వాత కూడా జట్టు ప్రదర్శనలో గణనీయమైన మార్పు ఏమీ రాలేదు.
సీఎస్కే అనగానే ఫస్ట్ గుర్తొచ్చే పేరు ఎంఎస్ ధోని. ఆయన గ్రౌండ్లోకి వచ్చారంటే చాలు, అరుపులు, కేకలతో గ్రౌండ్ మొత్తం మారుమోగాల్సిందే. చాలా వరకు ఫ్యాన్స్ కూడా ధోని బ్యాటింగ్ కోసం ఎదురుచూస్తుంటారు. మ్యాచ్ గెలిచినా ఓడినా ధోని బ్యాటింగ్ ఆడితే చాలు అనుకుంటారు. ఇక ధోని కూడా వయస్సు మీద పడుతున్నా, శరీరం సహకరించక పోయినా ఫ్యాన్స్ కోసం ఇంకా ఆడుతూ వస్తున్నారు. అయితే ఐపీఎల్ సీజన్ ముగింపు దశకు వచ్చిందంటే చాలు ఇక ధోని రిటైర్మెంట్ విషయం ట్రెండింగ్లోకి వస్తుంది. అయితే ఈ సీజన్లో ప్లేఆఫ్స్ రేసులో ఉండాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో సీఎస్కే ఓటమి చవిచూసింది. చెన్నై ప్లేఆప్స్ రేసు నుంచి తప్పుకుంది. దీంతో ధోని తర్వాతి మ్యాచ్లు, తర్వాతి సీజన్ ఆడుతారా లేదా అనే చర్చ మరోసారి తెరపైకి వచ్చింది. చెపాక్ స్టేడియం వేదికగా చెన్నై -పంజామ్ మధ్య మ్యాచ్ జరిగింది.ధోని రాగానే చెపాక్ స్టేడియం ఒక్కసారిగా దద్దరిల్లింది. ధోనిని చూసి సీఎస్కే ఫ్యాన్స్ అందరూ మాహి, మాహీ అంటూ కేకలు వేశారు.
Read Also: IPL 2025: పంజాబ్ కింగ్స్ విజయం పై స్పందించిన శ్రేయస్ అయ్యర్