📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం

Virat Kohli: ఆర్సీబీ జట్టులో విరాట్ కొనసాగేనా?

Author Icon By Anusha
Updated: June 11, 2025 • 5:35 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025 సీజన్ లో ఆర్సీబీ జట్టు టైటిల్‌ను కైవసం చేసుకుని సంచలనం సృష్టించింది. దీని ద్వారా 18 ఏళ్లుగా ఎదురుచూస్తున్న అభిమానులకు ఈ కప్ గొప్ప వరంగా మారింది. అయితే ఆర్సీబీ జట్టు(RCB team) కప్ గెలిచినప్పటి నుంచి దానికి కష్టాలు మొదలయ్యాయి. ఏలినాటి శని పట్టినట్లు ఆర్సీబీ జట్టుకు సమస్యల మీద సమస్యలు వెంటాడుతున్నాయి. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్ద అధిక సంఖ్యలో అభిమానులు గుమిగూడటం వల్ల జరిగిన తొక్కిసలాటలో 11 మంది మరణించారు. 50 మందికి పైగా గాయపడ్డారు. ఇది దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది.

ఐపీఎల్ టోర్నమెంట్‌

దీనికి సంబంధించి ఆర్సీబీ జట్టు నిర్వాహకుడు అరెస్ట్ అయ్యాడు. ఈ పరిస్థితుల్లో ఆర్సీబీ జట్టుకు అనేక సమస్యలు తలెత్తడంతో ఆ జట్టును మరొకరికి విక్రయించాలని జట్టు యజమాని నిర్ణయించినట్లు వార్తలు వస్తున్నాయి.అంతే కాకుండా ఐపీఎల్ టోర్నమెంట్‌(IPL tournament)లో మద్యం, మాదక ద్రవ్యాల ప్రకటనలపై నిషేధం విధించారు. ఇది కూడా ఆర్సీబీ జట్టు విక్రయానికి తొలి అడుగుగా భావిస్తున్నారు.

సంబంధిత

ఆర్సీబీ జట్టును ఒక మద్యం సంస్థ నడుపుతోంది కాబట్టి వేరే మార్గం లేక ఆర్సీబీ జట్టును విక్రయించాలని ఆ జట్టు యాజమాన్యం నిర్ణయించినట్లు తెలుస్తోంది. దీని వల్ల ఇప్పుడు వేరే యాజమాన్యం జట్టును కొనుగోలు చేస్తే మద్యం సంబంధిత పేరును మార్చాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దీని ద్వారా ఆర్సీబీ అనే శకం ముగియడానికి అవకాశం ఉంది. అంతే కాకుండా ఆర్సీబీ అభిమానులు తొక్కిసలాటలో మరణించడం పెద్ద సమస్యగా మారింది.

Virat Kohli

విశ్వాసంతో

ఈ తొక్కిసలాట నేపథ్యంలో చాలా మంది విరాట్ కోహ్లీని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇది విరాట్ కోహ్లీకి పెద్ద తలనొప్పిగా మారింది. తనను ఆర్సీబీ జట్టు మొదట ఎంపిక చేయగా అదే విశ్వాసంతో విరాట్ కోహ్లీ ఆ జట్టులో కొనసాగాడు. కానీ ఇప్పుడు ఆ జట్టే లేకపోతే విరాట్ కోహ్లీ(Virat Kohli) వేరే జట్టుకు వెళ్లడానికి అవకాశం ఏర్పడింది. 

ఆసక్తికరంగా

ఈ నేపథ్యంలో కోహ్లీ భవితవ్యం గురించి అభిమానులలో, క్రికెట్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. కొత్త యాజమాన్యం వచ్చిన తరువాత అతను ఆ జట్టులోనే కొనసాగుతాడా? లేక మరొక జట్టుకు మారుతాడా? అన్నది ఆసక్తికరంగా మారింది.అయితే,ఇప్పటివరకు,డెక్కన్ ఛార్జర్స్(Deccan Chargers) జట్టును విక్రయించినప్పుడు సన్ నెట్‌వర్క్ సంస్థ దానిని కొనుగోలు చేసి సన్‌రైజర్స్ అని పేరు మార్చిన విషయం తెలిసిందే. దీంతో ఆర్సీబీ జట్టును వేరే యాజమాన్యం కొనుగోలు చేస్తే పేరును మార్చే అవకాశం ఉందని గమనించాలి.

Read Also: Shreyas Iyer: జట్టులో శ్రేయస్ అయ్యర్‌ లేకపోవడంపై గంగూలీ ఆగ్రహం

#RCB #RCBControversy #ViratArrestDemand #ViratKohli Ap News in Telugu Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.