T20 World Cup: చెన్నై ఆలయంలో టీమిండియా ప్లేయర్స్ పూజలు

Read Time:  1 min
T20 World Cup: చెన్నై ఆలయంలో టీమిండియా ప్లేయర్స్ పూజలు
FONT SIZE
GET APP

T20 World Cup: టీ20 వరల్డ్ కప్ 2026లో భాగంగా జింబాబ్వేతో జరగనున్న కీలక మ్యాచ్‌కు ముందు టీమిండియా ఆటగాళ్లు అభిషేక్ శర్మ (Abhishek Sharma), సీనియర్ ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ చెన్నైలోని ప్రసిద్ధ మారుండీశ్వరర్ ఆలయాన్ని సందర్శించారు. ఈ మ్యాచ్‌లో గెలిస్తేనే భారత్ సెమీఫైనల్ రేసులో బలంగా నిలిచే అవకాశం ఉండటంతో, ఆటగాళ్లు ప్రత్యేక పూజలు నిర్వహించి శివుడి ఆశీస్సులు తీసుకున్నారు.

Read Also: New Zealand vs Zimbabwe: న్యూజిలాండ్ వేదికగా కివీస్-జింబాబ్వే పోరు!

T20 World Cup: చెన్నై ఆలయంలో టీమిండియా ప్లేయర్స్ పూజలు
T20 World Cup: Team India players offer prayers at Chennai temple

మనోబలం కోసం ఆధ్యాత్మిక ప్రార్థనలు

ప్రస్తుత టోర్నీలో యువ ఓపెనర్ అభిషేక్ శర్మ ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్నారు. గత కొద్ది రోజులుగా కడుపు ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్న ఆయన శారీరకంగా, మానసిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమయంలో ఆత్మవిశ్వాసాన్ని తిరిగి పొందేందుకు, తన అనారోగ్యం నుండి కోలుకుని జట్టుకు విజయాన్ని అందించాలనే సంకల్పంతో ఆయన ఆలయాన్ని దర్శించినట్లు సమాచారం. విజయం సాధించి సెమీస్‌కు దూసుకెళ్లాలని కోట్లాది మంది భారతీయులు ప్రార్థిస్తున్న వేళ, ఆటగాళ్ల ఈ ఆలయ సందర్శన ప్రాధాన్యత సంతరించుకుంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Saritha

రచయిత గురించి

Saritha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.