📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం

IPL 2025: ఇలాంటి మ్యాచ్‌లు ఐపీఎల్‌లో అవసరం లేదు :రికీ పాంటింగ్‌

Author Icon By Anusha
Updated: April 17, 2025 • 10:59 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఐపీఎల్ 2025 సీజన్‌లో ముల్లాన్‌పూర్‌ మహారాజా యాదవీంద్ర సింగ్ స్టేడియంలో పిచ్‌పై పంజాబ్‌ కింగ్స్‌, కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ (కేకేఆర్‌) మధ్య జరిగిన ఉత్కంఠ పోరులో పంజాబ్ బ్యాటింగ్ ఎంచుకుని 111 పరుగులు మాత్రమే చేయగలిగింది. సమాధానంగా కేకేఆర్ 95 పరుగులకు ఆలౌట్ అయ్యింది.ఇరు జట్ల స్పిన్నర్లు వికెట్ల పండుగ చేసుకున్న పోరులో కింగ్స్‌ నిర్దేశించిన 112 పరుగుల స్వల్ప ఛేదనలో కేకేఆర్‌ 15.1 ఓవర్లలో 95 పరుగులకే చేతులెత్తేయడంతో పంజాబ్‌ 16 పరుగుల తేడాతో గెలిచింది.రఘువంశీ (28 బంతుల్లో 37, 5 ఫోర్లు, 1 సిక్స్‌), ఆండ్రీ రస్సెల్‌ (17) పోరాడారు. పంజాబ్‌ స్పిన్నర్లలో యుజ్వేంద్ర చాహల్‌ (4/28), యాన్సెన్‌ (3/17) కేకేఆర్‌ను దెబ్బతీశారు. మొదట బ్యాటింగ్‌ చేసిన పంజాబ్‌ ప్రత్యర్థి బౌలర్ల ధాటికి 15.3 ఓవర్లలో 111 పరుగులకే కుప్పకూలింది. ప్రభ్‌సిమ్రన్‌ (15 బంతుల్లో 30, 2 ఫోర్లు, 3 సిక్సర్లు) టాప్‌ స్కోరర్‌. హర్షిత్‌ రాణా (3/25) ఆరంభంలోనే కింగ్స్‌ను దెబ్బతీయగా మిస్టరీ స్పిన్నర్లు సునీల్‌ నరైన్‌ (2/14), వరుణ్‌ చక్రవర్తి (2/21) కలిసి మిడిల్‌, లోయరార్డర్‌ పనిపట్టారు.

అత్యధిక

ఇది ఐపీఎల్ చరిత్రలో అతి చిన్న లక్ష్యాన్ని డిఫెండ్ చేసుకున్న మ్యాచ్. నరాలు తెగే ఉత్కంఠతో సాగిన ఈ మ్యాచ్‌లో యుజ్వేంద్ర చాహల్ అద్భుత ప్రదర్శన కీలకం. ఈ లో-స్కోరింగ్ థ్రిల్లర్ అభిమానులకు మంచి వినోదాన్నిచ్చింది.ఐపీఎల్‌లో అతి చిన్న టార్గెట్‌ను డిఫెండ్‌ చేసుకున్న టీమ్‌గా పంజాబ్‌ కింగ్స్‌ చరిత్ర సృష్టించింది. అలాగే ఐపీఎల్‌లో అత్యధిక టార్గెట్‌ను ఛేజ్‌ చేసిన రికార్డు కూడా పంజాబ్‌ కింగ్స్‌ పేరిటే ఉంది. గతేడాది ఐపీఎల్‌లో ఈ రికార్డు సాధించింది పంజాబ్‌ కింగ్స్‌. ఇప్పటి వరకు హైస్కోరింగ్‌ మ్యాచ్‌లను ఎంజాయ్‌ చేసిన క్రికెట్‌ అభిమానులు స్కోరింగ్‌ థ్రిల్లర్‌కు ఫిదా అయిపోయారు. నరాలు తెగే ఉత్కంఠ మధ్య సాగిన మ్యాచ్‌ క్రికెట్‌ ఫ్యాన్స్‌కు ఫుల్‌ మజా ఇచ్చింది. అయితే ఇలాంటి మ్యాచ్‌లు ఐపీఎల్‌లో అవసరం లేదంటూ పంజాబ్‌ కింగ్స్‌ హెడ్‌ కోచ్‌ రికీ పాంటింగ్‌ షాకింగ్స్‌ కామెంట్స్‌ చేశాడు. 50 ఏళ్ల వయసులో ఇంత టెన్షన్‌ తాను తట్టుకోలేనని అందుకే ఇలాంటి థ్రిల్లర్లు వద్దంటూ పాంటింగ్‌ సరదాగా పేర్కొన్నాడు.

బౌలర్ చాహల్

పంజాబ్‌ కింగ్స్ 112 పరుగులు మాత్రమే చేసి లక్ష్యం నిర్దేశించింది. దీంతో కేకేఆర్‌ ఈ లక్ష్యాన్ని ఉఫ్‌ అని ఊదేస్తుందని అంతా భావించారు. పంజాబ్‌ ఓటమి ఖాయమని అంతా అనుకున్నారు. కానీ అంచనాలు అనూహ్యంగా తారుమరయ్యాయి. ఛేదనలో కేకేఆర్ తడబడింది. అందుకు ముఖ్య కారణం పంబాజ్ బౌలర్ చాహల్. అతడు తన అద్భుతమైన బౌలింగ్ తో మ్యాచును తమ వైపునకు తిప్పాడు. మొదట ఇన్నింగ్స్‌ 8, 10 ఓవర్లలో రహానె, రఘువంశీలను ఔట్‌ చేసిన చాహల్ 12వ ఓవర్లో రింకూ సింగ్ (2), రమణ్‌దీప్‌ (0)ను ఔట్‌ చేసి కోల్‌కతాకు కోలుకోలేని దెబ్బ కొట్టాడు. ఇతర పంజాబ్ బౌలర్లు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని మ్యాచులో ఇతర వికెట్లు తీశారు. దీంతో కేకేఆర్ 95 పరుగులకే కుప్పకూలిపోయింది.

Read Also: IPL 2025: చెమటను ఎక్కువగా బంతికి పూసేందుకు ప్రయత్నిస్తా: మిచెల్ స్టార్క్

#HistoricWin #IPL2025 #KKRvsPBKS #LowScoringThriller #PunjabKings #YuzvendraChahal Ap News in Telugu Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.