📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Shubman Gill: టెస్ట్ సిరీస్ కోసం ఇంగ్లండ్‌కి చేరుకున్న టీమిండియా..

Author Icon By Anusha
Updated: June 7, 2025 • 3:43 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

భారత క్రికెట్ జట్టు ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం ఇంగ్లండ్ గడ్డపై అడుగుపెట్టింది. ఈ సిరీస్ జూన్ 20 నుండి ప్రారంభం కానుండగా, ఆటగాళ్లలోనూ, అభిమానుల్లోనూ భారీగా ఆసక్తి నెలకొంది.భారత క్రికెట్ దిగ్గజాలు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ టెస్టుల నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత టీమిండియా ఆడనున్న తొలి సిరీస్ ఇదే కావడం విశేషం. దీంతో ఈ పర్యటన భారత టెస్ట్ క్రికెట్‌లో ఒక నూతన అధ్యాయానికి నాంది పలకనుంది.భారత జట్టు ఇంగ్లండ్ చేరుకున్న విషయాన్ని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) శనివారం అధికారికంగా ప్రకటించింది. “టచ్‌డౌన్ యూకే. ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం టీమిండియా వచ్చేసింది” అంటూ బీసీసీఐ తమ ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది.భారత యువ జట్టు ప్రదర్శన ఎలా ఉండబోతుందనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

సమాచారం ప్రకారం

భారత జట్టుకు యువ ఆటగాడు శుభ్‌మన్ గిల్ నాయకత్వం వహించనుండగా, మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్(Gautam Gambhir) హెడ్ కోచ్‌గా వ్యవహరిస్తున్నారు. వీరిద్దరూ ఇప్పటికే ఇంగ్లాండ్ పర్యటనకు ముందు నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, తొలి టెస్టుకు తుది జట్టుపై కొన్ని కీలక సూచనలు చేశారు. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం, యశస్వి జైస్వాల్‌తో కలిసి కేఎల్ రాహుల్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించే అవకాశం ఉంది.ఇంగ్లాండ్ లయన్స్‌పై జరిగిన మ్యాచ్‌లో డబుల్ సెంచరీతో అద్భుతమైన ఫామ్‌లో ఉన్న కరుణ్ నాయర్‌కు కీలకమైన మూడో స్థానంలో అవకాశం దక్కవచ్చని తెలుస్తోంది. అదే జరిగితే, కెప్టెన్ శుభ్‌మన్ గిల్ నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చే సూచనలున్నాయి. వికెట్ కీపర్‌గా రిషభ్ పంత్ లేదా ధ్రువ్ జురెల్‌లలో ఒకరికి చోటు దక్కవచ్చు. మిడిల్ ఆర్డర్, లోయర్ ఆర్డర్‌లలో తెలుగు తేజం నితీశ్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్‌లు ఉండే అవకాశం ఉంది.

అనుభవజ్ఞులైన ఆటగాళ్లతో

ఇక బౌలింగ్ విభాగానికి వస్తే, స్టార్ పేసర్లు జస్‌ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్‌లు తుది జట్టులో ఖాయంగా ఉండనున్నారు. మూడో పేసర్ స్థానం కోసం ప్రసిధ్ కృష్ణ లేదా అర్ష్‌దీప్ సింగ్‌(Arshdeep Singh)ల మధ్య పోటీ నెలకొంది. అనుభవజ్ఞులైన ఆటగాళ్లతో పాటు యువ ప్రతిభతో కూడిన భారత జట్టు, ఇంగ్లాండ్ సవాల్‌ను స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నట్టు కనిపిస్తోంది. కొత్త నాయకత్వం, కొత్త ఆటగాళ్లతో కూడిన టీమిండియా ఈ సిరీస్‌లో ఎలాంటి ప్రదర్శన చేస్తుందో చూడాలి.

Read Also: Kuldeep Yadav: కుల్దీప్ యాదవ్ కి కాబోయే భార్య గురించి మీకు తెలుసా?

#EnglandTour #INDvsENG #TeamIndia #TestCricket #WTC2025 Ap News in Telugu Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.