📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం

IPL 2025: ప్లేయ‌ర్ ఆఫ్ ద మంత్ అవార్డును గెలుచుకున్న శ్రేయాస్ అయ్య‌ర్

Author Icon By Anusha
Updated: April 15, 2025 • 2:43 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 సీజన్‌లో టీమిండియా స్టార్ బ్యాట్స్‌మన్ శ్రేయాస్ అయ్యర్‌కు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ భారీ బహుమతిని ఇచ్చింది. గత నెలలో టీం ఇండియా ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్ గెలవడంలో శ్రేయాస్ అయ్యర్ కీలక పాత్ర పోషించాడు. టీమిండియా తరపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఇప్పుడు ఈ అద్భుతమైన ప్రదర్శనకు ఐసీసీ అతనికి బహుమతిని ఇచ్చింది.శ్రేయాస్ అయ్యర్ మార్చి 2025కి ఐసీసీ పురుషుల ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డును గెలుచుకున్నాడు. న్యూజిలాండ్‌కు చెందిన జాకబ్ డఫీ, రాచిన్ రవీంద్రలను వెనక్కునెట్టేశాడు. భారత ఛాంపియన్స్ ట్రోఫీ విజయంలో అతను కీలక పాత్ర పోషించాడు. టీమిండియా ఆటగాళ్లు వరుసగా రెండోసారి ఈ అవార్డును గెలుచుకుంది. ఫిబ్రవరి ప్రారంభంలో, శుభ్‌మాన్ గిల్ ప్లేయర్ ఆఫ్ ది మంత్‌గా ఎంపికయ్యాడు. కాగా, శ్రేయాస్ అయ్యర్ ఈ అవార్డును రెండోసారి గెలుచుకున్నాడు. దీనికి ముందు టీమిండియా నుంచి శుభ్‌మాన్ గిల్, జస్‌ప్రీత్ బుమ్రా మాత్రమే ఈ అవార్డును రెండు లేదా అంతకంటే ఎక్కువ సార్లు గెలుచుకున్నారు.

శ్రేయాస్ మాట్లాడుతూ

మార్చి నెలలో ఐసీసీ పురుషుల ప్లేయర్ ఆఫ్ ది మంత్‌గా ఎంపిక కావడం నాకు నిజంగా గౌరవంగా ఉంది. ఈ గౌరవం చాలా ప్రత్యేకమైనది. ముఖ్యంగా మేం ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకున్న క్షణం అత్యంత అద్భుతమైనది. ఇంత పెద్ద వేదికపై టీమిండియా విజయానికి తోడుగా ఉండడం ప్రతి క్రికెటర్ కల. నాపై అచంచలమైన మద్దతు, నమ్మకానికి నా సహచరులు, కోచ్‌లు, సహాయక సిబ్బందికి నేను కృతజ్ఞుడను’ అంటూ చెప్పుకొచ్చాడు.

ఇన్నింగ్స్‌

ఫిబ్ర‌వ‌రి నెల‌లో శుభ‌మ‌న్ గిల్ మిడ‌ల్ ఆర్డ‌ర్‌లో అయ్య‌ర్ ఇటీవ‌ల కీల‌క ఇన్నింగ్స్‌లు ఆడాడు. అద్భుత‌మైన స్ట్రోక్ ప్లే ప్ర‌ద‌ర్శించాడు. కీల‌క భాగ‌స్వామ్యాలు నెల‌కొల్పాడు. జ‌ట్టు ట్రోఫీ గెల‌వ‌డంతో కీల‌కంగా వ్యవహరించాడు.ఐసీసీ మెన్స్ ప్లేయ‌ర్ ఆఫ్ ద మంత్ అవార్డు వ‌శం చేసుకున్నాడు.మార్చి నెలలో శ్రేయాస్ అయ్యర్ మొత్తం 3 వన్డే మ్యాచ్‌లు ఆడి 57.33 సగటుతో 172 పరుగులు చేశాడు. ఈ కాలంలో, అతను గ్రూప్ ఏ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై 79 పరుగులు, సెమీ-ఫైనల్స్‌లో ఆస్ట్రేలియాపై 45 పరుగులు, ఫైనల్‌లో న్యూజిలాండ్‌పై 48 పరుగులు చేసి, భారతదేశాన్ని ఛాంపియన్‌గా నిలిపాడు.2025 ఛాంపియన్స్ ట్రోఫీలో శ్రేయస్ అయ్యర్ రెండో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. రచిన్ రవీంద్ర కంటే కేవలం 20 పరుగులు వెనుకబడి ఉన్నాడు.రచిన్ రవీంద్ర కంటే కేవలం 20 పరుగులు వెనుకబడి ఉన్నాడు.

Read Also: IPL 2025: పంజాబ్ కింగ్స్ జట్టును వీడనున్న లాకీ ఫెర్గూసన్

#ICCMensPlayerOfTheMonth #PlayerOfTheMonthMarch2025 #ShreyasIyer #StylishBatsman #TeamIndia Ap News in Telugu Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.