ఐపీఎల్ 2025 సీజన్లో పంజాబ్ కింగ్స్ క్వాలిఫయర్-1కు అర్హత సాధించిన విషయం తెలిసిందే. సోమవారం జరిగిన తమ ఆఖరి లీగ్ మ్యాచ్లో పటిష్టమైన ముంబై ఇండియన్స్ను 7 వికెట్లతో చిత్తు చేసిన పంజాబ్ కింగ్స్ పాయింట్స్ టేబుల్లో అగ్రస్థానంలో నిలిచింది. ఈ మ్యాచ్ అనంతరం మాట్లాడిన శ్రేయస్ అయ్యర్(Shreyas Iyer) రికీ పాంటింగ్తో పాటు తమ ఆటగాళ్లపై ప్రశంసల జల్లు కురిపించాడు.పంజాబ్ కింగ్స్(Punjab Kings) హెడ్ కోచ్ రికీ పాంటింగ్ వల్లే తమ జట్టు క్వాలిఫయర్-1కు అర్హత సాధించిందని ఆ జట్టు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అన్నాడు. కెప్టెన్గా పాంటింగ్ తనకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చాడని, తెరవెనుక ఉండి తనను నడిపించాడని తెలిపాడు.
నమ్మకం
‘జట్టులోని ప్రతి ఒక్కరూ సరైన సమయంలో పుంజుకున్నారు. తొలి మ్యాచ్ నుంచే పరిస్థితులు ఎలా ఉన్నా గెలవాలనే కసితో ఆడాం. మేము కష్టాల్లో ఉన్నప్పుడు ఆటగాళ్లు ముందుకు వచ్చి బాధ్యత తీసుకున్నారు. సపోర్ట్ స్టాఫ్తో పాటు మేనేజ్మెంట్కు అభినందనలు. ఆటగాళ్లను రికీ పాంటింగ్(Ricky Ponting అద్భుతంగా చూసుకున్నాడు. ఆరంభంలోనే విజయాలు దక్కడంతో ఆటగాళ్లపై నమ్మకం ఏర్పడింది. జట్టులోని ప్రతీ ఆటగాడితో మాట్లాడాను. కెప్టెన్గా ఆటగాళ్లతో మంచి సంబంధం ఉండాలి. డ్రెస్సింగ్ రూమ్లో మంచి వాతావరణం ఉంది. ఆరుగురు అన్క్యాప్డ్ ప్లేయర్లతో మేం విజయాలు సాధించాం. ముఖ్యంగా ప్రియాన్ష్ ఆర్య అద్భుతమైన ఆరంభాలు అందించాడు.
ఫలితం
కుర్రాళ్లంతా ఫియర్లెస్గా ఉన్నారు. నెట్స్లో తీవ్రంగా శ్రమిస్తారు. ఆ సన్నాహకాల ఫలితం ఇప్పుడు మైదానంలో కనబడుతోంది. ఇంగ్లిస్(Englis) కు మాత్రమే స్థిరమైన బ్యాటింగ్ పొజిషన్ లేదు. అతను కొత్త బంతిని ఆడటానికి ఇష్టపడుతాడు. అతను మరిన్ని కొత్త బాల్స్ ఆడాలని భావించే, నా కంటే ముందు బ్యాటింగ్ పంపించాం. ఈ ప్రయోగం ఫలించింది. అతను విధ్వంసకరమైన ఆటగాడని, మంచి ఇంటెట్తో ఆడగలిగే బిగ్ మ్యాచ్ ప్లేయర్ అని మాకు తెలుసు. గత కొన్నేళ్లుగా రికీ పాంటింగ్తో నాకు స్నేహం ఉంది. అతను నాకు చాలా స్వేచ్ఛను ఇస్తాడు. బయటి నుంచి వ్యూహాలు అమలు చేయాలని నేను రికీకి చెబుతాను. అతను చెప్పిన చిట్కాలను మైదానంలో అమలు చేస్తాను.’అని శ్రేయస్ అయ్యర్ చెప్పుకొచ్చాడు.
Read Also : Punjab Kings: అయ్యర్ కృషి తోనే పంజాబ్ కింగ్స్ గెలిచింది: రికీ పాంటింగ్