భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) భవిష్యత్తు గురించి అనేక ఊహాగానాలు వెలువడుతున్న సమయంలో, అతని చిన్ననాటి కోచ్ దినేశ్ లాడ్ చేసిన వ్యాఖ్యలు క్రికెట్ అభిమానుల్లో ఆసక్తిని రేపుతున్నాయి. రోహిత్కు 2027 వన్డే ప్రపంచకప్ గెలవడమే తుదిలక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.

రిటైర్మెంట్ ఊహాగానాల మధ్య ఇచ్చిన మద్దతు
గత ఏడాది టీ20 వరల్డ్ కప్ గెలిచిన అనంతరం రోహిత్ శర్మ (Rohit Sharma) ఆ ఫార్మాట్కు గుడ్బై చెప్పగా, ఈ ఏడాది టెస్టు క్రికెట్ (Test cricket) నుంచి కూడా విరమణ ప్రకటించారు. ప్రస్తుతం వన్డేల్లో నుంచి కూడా రిటైర్మెంట్ ప్రకటిస్తారేమో అన్న ఊహాగానాలు చర్చనీయాంశంగా మారాయి. ప్రస్తుతం 38 ఏళ్ల వయసులో ఉన్న రోహిత్, వన్డేలకు కూడా వీడ్కోలు పలుకుతాడనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో దినేశ్ లాడ్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
“2027 వన్డే ప్రపంచకప్లో రోహిత్ శర్మ తప్పకుండా ఆడాలి. ఆ ట్రోఫీని గెలవడం (Winning a trophy) ఎప్పటినుంచో అతని కల. దురదృష్టవశాత్తు 2011లో ప్రపంచకప్ గెలిచిన జట్టులో అతనికి చోటు దక్కలేదు” అని లాడ్ గుర్తుచేశారు. ఆ లోటును భర్తీ చేసుకునేందుకు రోహిత్కు మరో అవకాశం ఇవ్వాలని ఆయన సూచించారు.
“రోహిత్ సేవలు ఇంకా అవసరమే” – లాడ్ అభిప్రాయం
“జట్టుకు నాయకత్వం వహించాలా, లేదా అనే నిర్ణయం బీసీసీఐ మరియు సెలెక్టర్లదే. కానీ రోహిత్లో ఇంకా ఆటపై ప్రేమ, గెలవాలన్న తపన, తన స్థాయిని మరోసారి చాటాలన్న దీక్ష ఉన్నాయన్నది స్పష్టంగా కనిపిస్తుంది,” అని దినేశ్ లాడ్ వ్యాఖ్యానించారు.
రోహిత్ వన్డే కెరీర్ గణాంకాలు – ఓ గొప్ప ప్రయాణం
రోహిత్ శర్మ ఇప్పటివరకు 273 వన్డేలు ఆడి, 48.76 సగటుతో 11,168 పరుగులు చేశారు. ఇందులో 32 సెంచరీలు, 58 అర్ధసెంచరీలు ఉన్నాయి. ముఖ్యంగా, వన్డే క్రికెట్లో మూడు డబుల్ సెంచరీలు చేసిన ఏకైక ఆటగాడిగా రోహిత్ చరిత్ర సృష్టించారు.
Read hindi news: hindi.vaartha.com
Read also: