ఐపీఎల్ 2025 సీజన్లో భాగంగా గుజరాత్ టైటాన్స్తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్లో రోహిత్ శర్మ చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్లో 7 వేల పరుగుల మైలురాయి అందుకున్న రెండో బ్యాటర్గా నిలిచాడు. ఈ మ్యాచ్ ఆరంభంలోనే రోహిత్ శర్మ(Rohit Sharma)కు రెండు లైఫ్స్ లభించాయి. ప్రసిధ్ కృష్ణ వేసిన రెండో ఓవర్లోనే రోహిత్ శర్మ ఇచ్చిన సునాయస క్యాచ్ను గెరాల్డ్ కోయిట్జీ(Gerald Coetzee) నేలపాలు చేశాడు. ఆ క్యాచ్ పట్టి ఉంటే రోహిత్ 4 పరుగులకే ఔటయ్యేవాడు. సిరాజ్ వేసిన ఆ మరుసటి ఓవర్లోనే రోహిత్ శర్మ ఇచ్చిన ఈజీ క్యాచ్ను వికెట్ కీపర్ కుశాల్ మెండీస్ వదిలేసాడు. ఈ క్యాచ్ పట్టినా రోహిత్ 12 పరుగులకే వెనుదిరిగేవాడు. ఈ అవకాశంతో చెలరేగిన రోహిత్ శర్మ 28 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ క్రమంలోనే అతను ఐపీఎల్లో 7వేల పరుగుల మైలురాయి అందుకున్నాడు. రదీష్ ఖాన్ వేసిన 9వ ఓవర్ నాలుగో బంతిని సిక్సర్ తరలించడం ద్వారా రోహిత్ ఈ ఫీట్ సాధించాడు. 7వేల పరుగుల మైలురాయితో పాటు 300 సిక్స్ల క్లబ్లో చేరాడు.
అత్యధిక
ఐపీఎల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో విరాట్ కోహ్లీ(Virat Kohli)(8618) పరుగులతో అగ్రస్థానంలో ఉండగా రోహిత్ శర్మ(7000*) రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. శిఖర్ ధావన్(6769), డేవిడ్ వార్నర్(6565), సురేశ్ రైనా(5528), ధోనీ(5439) పరుగులతో తర్వాతి స్థానాల్లో నిలిచారు. ఐపీఎల్లో అత్యధిక సిక్స్లు కొట్టిన జాబితాలో క్రిస్ గేల్(357) అగ్రస్థానంలో ఉండగా రోహిత్ శర్మ(300*), విరాట్ కోహ్లీ( 291), ధోనీ(364) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.
ఒంటరిపోరాటం
ఈ సీజన్లో శుక్రవారం జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్లో ముంబై 20 పరుగుల తేడాతో గుజరాత్(Gujarat Titans)పై ఉత్కంఠ విజయం సాధించింది.తొలుత రోహిత్శర్మ(50 బంతుల్లో 81, 9ఫోర్లు, 4సిక్స్లు) అర్ధసెంచరీతో కదంతొక్కగా, బెయిర్స్టో(47), సూర్యకుమార్(33), తిలక్శర్మ(25) రాణించడంతో ముంబై 20 ఓవర్లలో 228/5 స్కోరు చేసింది. ప్రసిద్ధ్ కృష్ణ(2/53), సాయికిషోర్(2/42) రెండేసి వికెట్లు తీశారు. ఆ తర్వాత ఛేదనకు దిగిన గుజరాత్ 20 ఓవర్లలో 208/6 స్కోరుకు పరిమితమైంది. సాయి సుదర్శన్(49 బంతుల్లో 80, 10ఫోర్లు, సిక్స్) ఒంటరిపోరాటం చేయగా, సుందర్(48) ఆకట్టుకున్నాడు. బౌల్ట్ (2/56) రెండు వికెట్లు తీయగా, బుమ్రా, గ్లీసన్, సాంట్నర్, అశ్వని ఒక్కో వికెట్ తీశారు.
Read Also: French Open 2025: ప్రీక్వార్టర్స్లోకి ప్రవేశించిన సబలెంకా, స్వియాటెక్