📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం

IPL 2025: పాకిస్థాన్ సూపర్ లీగ్‌పై రికీ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు

Author Icon By Anusha
Updated: May 2, 2025 • 11:12 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 సీజన్‌లో భాగంగా, మెరుగైన ప్రదర్శనతో ప్లే ఆఫ్స్ దిశగా సాగుతున్న పంజాబ్ కింగ్స్‌కు గాయాల రూపంలో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కీలకమైన ఇద్దరు విదేశీ ఆటగాళ్లు టోర్నమెంట్ మొత్తానికి దూరం కావడం జట్టు అవకాశాలపై ప్రభావం చూపేలా కనిపిస్తోంది. దీంతో ప్రత్యామ్నాయ ఆటగాళ్ల కోసం జట్టు అన్వేషణ ప్రారంభించింది.ఈ సీజన్‌లో ఇప్పటివరకు 10 మ్యాచ్‌లు ఆడి 13 పాయింట్లతో పంజాబ్ కింగ్స్ పటిష్ట స్థితిలో ఉంది. చెన్నై సూపర్ కింగ్స్‌పై వారి సొంత మైదానం చెపాక్‌లో విజయం సాధించి ఆత్మవిశ్వాసంతో ఉంది. అయితే, జట్టును గాయాలు తీవ్రంగా వేధిస్తున్నాయి. సీజన్ ఆరంభంలోనే న్యూజిలాండ్ పేస్ బౌలర్ లాకీ ఫెర్గ్యూసన్ తొడ కండరాల గాయం కారణంగా టోర్నీ నుంచి వైదొలిగాడు. తాజాగా, ఆస్ట్రేలియా విధ్వంసకర ఆల్‌రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ కూడా మిగిలిన మ్యాచ్‌లకు అందుబాటులో ఉండటం లేదని తేలిపోయింది. చెన్నైతో మ్యాచ్‌కు ముందు జరిగిన ప్రాక్టీస్ సెషన్‌లో మ్యాక్స్‌వెల్ వేలికి తీవ్ర గాయమైంది. దీంతో అతడు ఈ సీజన్‌కు దూరమైనట్టు జట్టు వర్గాలు తెలిపాయి.

ఆటగాళ్ల

ఇద్దరు కీలక విదేశీ ఆటగాళ్లు దూరం కావడంతో వారి స్థానాల్లో సరైన ప్రత్యామ్నాయాలను ఎంపిక చేయాల్సిన అవసరం పంజాబ్ కింగ్స్‌కు ఏర్పడింది. అయితే, ఫెర్గ్యూసన్ దూరమై రెండు వారాలు దాటినా, మ్యాక్స్‌వెల్ గాయపడి రెండు రోజులైనా ఇంకా వారి స్థానాల్లో కొత్త ఆటగాళ్లను ప్రకటించలేదు. పాకిస్థాన్‌లో జరుగుతున్న పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్) దీనికి కారణమని తెలుస్తోంది. చాలామంది నాణ్యమైన విదేశీ ఆటగాళ్లు పీఎస్‌ఎల్‌లో ఆడుతుండటంతో, ఐపీఎల్‌కు రీప్లేస్‌మెంట్ ఆటగాళ్లు అందుబాటులో ఉండటం లేదని పంజాబ్ కింగ్స్ కోచ్ రికీ పాంటింగ్ పేర్కొన్నాడు.

రీప్లేస్‌మెంట్ల

నాణ్యమైన విదేశీ ఆటగాళ్ల కొరత నేపథ్యంలో, పంజాబ్ కింగ్స్ యాజమాన్యం దేశీయ యువ ప్రతిభ వైపు దృష్టి సారించినట్లు సమాచారం. ‘రీప్లేస్‌మెంట్ల విషయంలో కొంత ఓపికగా వ్యవహరిస్తున్నాం. పీఎస్‌ఎల్ జరుగుతుండటం వల్ల అంతర్జాతీయ ఆటగాళ్ల లభ్యత తక్కువగా ఉంది. ప్రస్తుతం భారత్‌లో ఉన్న ప్రతిభావంతులైన యువ ఆటగాళ్లను పరిశీలిస్తున్నాం. జట్టుతో పాటు శిక్షణ పొందుతున్న కొందరు కుర్రాళ్లను కూడా నిశితంగా గమనిస్తున్నాం. వారిలో కొందరికి అవకాశం లభించవచ్చు. ఈ వారంలోగా రీప్లేస్‌మెంట్ల ప్రక్రియ పూర్తవుతుందని ఆశిస్తున్నాం’ అని పాంటింగ్ తెలిపాడు. కాగా, గాయాల బెడదను అధిగమించి ప్లే ఆఫ్స్ బెర్తును ఖాయం చేసుకోవాలని చూస్తున్న పంజాబ్ కింగ్స్ తమ తదుపరి మ్యాచ్‌లో మే 4న ధర్మశాల వేదికగా లక్నో సూపర్ జెయింట్స్‌తో తలపడనుంది. కీలక ఆటగాళ్ల గైర్హాజరీలో జట్టు ఎలా రాణిస్తుందో చూడాలి.

Read Also: Sports: కోహ్లీ ఫేవరెట్ సాంగ్ ఏదో తెలుసా?

#ForeignPlayersOut #InjuryUpdate #IPL2025 #PunjabKings #PunjabKingsSetback Ap News in Telugu Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.