IPL 2025 సీజన్ లో భాగంగా,మంగళవారం అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా పంజాబ్ కింగ్స్తో హోరాహోరిగా జరిగిన ఫైనల్లో ఆర్సీబీ ఆరు పరుగుల తేడాతో ఉత్కంఠ విజయం సాధించింది. బెంగళూరు నిర్దేశించిన 191 పరుగుల ఛేదనలో పంజాబ్(Punjab) 184/7 వద్దే ఆగిపోవడంతో మొదటి టైటిల్ నెగ్గాలన్న ఆ జట్టు ఆశలు అడియాసలయ్యాయి. ఛేదనలో శశాంక్ సింగ్ (30 బంతుల్లో 61 నాటౌట్, 3 ఫోర్లు, 6 సిక్సర్లు), జోష్ ఇంగ్లిస్ (23 బంతుల్లో 39, 1 ఫోర్, 4 సిక్సర్లు) పోరాడినా ఆ జట్టుకు నిరాశ తప్పలేదు. మొదట బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ(RCB) నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ (35 బంతుల్లో 43, 3 ఫోర్లు) నెమ్మదిగా ఆడినా కెప్టెన్ రజత్ పటీదార్ (16 బంతుల్లో 26, 1 ఫోర్, 2 సిక్స్ర్లు), జితేశ్ శర్మ (10 బంతుల్లో 24, 2 ఫోర్లు, 2 సిక్సర్లు), లివింగ్స్టొన్ (15 బంతుల్లో 25, 2 సిక్సర్లు) మెరుపులతో ఆ జట్టుకు పోరాడగలిగే స్కోరును అందించారు.
మయాంక్
మొదట బ్యాటింగ్ చేసిన బెంగళూరు ఇన్నింగ్స్ పడుతూ లేస్తూ సాగింది. ఒకవైపు స్కోరుబోర్డు వేగంగానే కదులుతున్నా మరోవైపు కీలక సమయంలో వికెట్లు కోల్పోవడం ఆ జట్టు భారీ స్కోరు ఆశలపై నీళ్లు చల్లింది. అర్ష్దీప్ మొదటి ఓవర్లోనే 6, 4తో ఇన్నింగ్స్ను మొదలుపెట్టిన ఫిల్ సాల్ట్ (16) జెమీసన్ వేసిన రెండో ఓవర్లో భారీ షాట్ ఆడబోయి మిడాన్ వద్ద శ్రేయాస్(Shreyas) చేతికి చిక్కాడు. మూడో స్థానంలో వచ్చిన మయాంక్ (24) రెండు బౌండరీలు ఓ సిక్సర్తో టచ్లోనే కనిపించినా ఏడో ఓవర్లో బంతినందుకున్న చాహల్ రెండో బంతికి అతడి ఇన్నింగ్స్కు తెరదించాడు. కెప్టెన్ రజత్ కూడా ఓ బౌండరీ, రెండు సిక్సర్లతో రెచ్చిపోయినా జెమీసన్ పదో ఓవర్లో వికెట్ల ముందు దొరికిపోయాడు.

స్కోరుబోర్డు
కోహ్లీ ఆరంభం నుంచే వికెట్లు కోల్పోవడంతో తన సహజశైలికి భిన్నంగా ఆడాడు. 11 ఓవర్ల వరకు అతడు ఆడిన బంతులు 22 కాగా చేసిన పరుగులు 28 మాత్రమే. అజ్మతుల్లా 15వ ఓవర్లో షార్ట్ బాల్గా వేసిన ఐదో బంతిని ఆడబోయిన కోహ్లీ(Kohli) బాల్ కాస్తా బ్యాట్ ఎడ్జ్కు తాకి అక్కడే పైకి లేవడంతో కోహ్లీ కథ ముగిసింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన జితేశ్ ఉన్నంతసేపు మెరుపులు మెరిపించడంతో ఆర్సీబీ స్కోరుబోర్డు మళ్లీ వేగం పుంజుకుంది. అర్ష్దీప్ ఓవర్లో రెండు ఫోర్లు కొట్టిన జితేశ్ జెమీసన్ మరుసటి ఓవర్లో రెండు భారీ సిక్సర్లు బాదాడు. ఇదే ఓవర్లో లివింగ్స్టొన్(Livingstone)ఓ సిక్సర్ కొట్టి ఐదో బంతికి వెనుదిరగ్గా విజయ్కుమార్ 18వ ఓవర్లో జితేశ్ క్లీన్బౌల్డ్ అయ్యాడు. షెపర్డ్ (17) క్రీజులో ఉన్నా ధాటిగా ఆడలేకపోయాడు. అర్ష్దీప్ ఆఖరి ఓవర్లో మూడు వికెట్లు పడగొట్టాడు.
Read Also: RCB: ఫైనల్ మ్యాచ్ కు ఆర్సీబీకి ఊహించని షాక్!