📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం

RCB victory parade: ఆర్‌సీబీ విక్టరీ పరేడ్‌ రద్దు..ఎందుకంటే?

Author Icon By Anusha
Updated: June 4, 2025 • 3:04 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఐపీఎల్ 2025 ట్రోఫీని గెలుచుకున్న తర్వాత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జరపనున్న విజయోత్సవ పరేడ్ పై ఇప్పుడు అనిశ్చితి నెలకొంది.ఐపీఎల్ టైటిల్ గెలిచిన నేపథ్యంలో బెంగళూరులో ఈ రోజు సాయంత్రం విక్టరీ పరేడ్(Victory Parade) నిర్వహించాలని ఆర్‌సీబీ ఫ్రాంచైజీ నిర్ణయించింది. కానీ ఈ విక్టరీ పరేడ్‌కు బెంగళూరు పోలీసులు అనుమతి ఇవ్వలేదని తెలుస్తోంది. వర్కింగ్ డే కావడంతో నగరంలో ట్రాఫిక్ సమస్య ఏర్పడుతుందని, విక్టరీ పరేడ్‌కు బందోబస్తు కుదురదని పోలీసులు ఆర్‌సీబీ మేనేజ్‌మెంట్‌కు స్పష్టం చేసినట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా పేర్కొంది. ఈ విక్టరీ పరేడ్‌కు అనుమతి లభించకపోవడంతో చిన్నస్వామి స్టేడియం వేదికగా సన్మాన కార్యక్రమాన్ని ఆర్‌‌సీబీ(RCB) ఏర్పాటు చేసినట్లు వార్తలు వస్తున్నాయి.

ఫైనల్లో ఆర్‌సీబీ

సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల మధ్య ఈ సన్మాన కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమానికి పాసులు ఉన్నవారినే అనుమతించనున్నారు. పార్కింగ్ సమస్య(Parking problem) రాకుండా అభిమానులు ప్రజా రవాణాను ఉపయోగించుకోవాలని పోలీసులు సూచించారు. ఐపీఎల్ 2025 సీజన్‌లో భాగంగా మంగళవారం జరిగిన ఫైనల్లో ఆర్‌సీబీ 6 పరుగుల తేడాతో పంజాబ్ కింగ్స్‌ను ఓడించిన విషయం తెలిసిందే. ఈ గెలుపుతో 18 ఏళ్ల తర్వాత ఆర్‌సీబీ తొలి టైటిల్‌ను ముద్దాడింది. ఆర్‌సీబీ విజయంతో దేశవ్యాప్తంగా అభిమానులు సంబరాలు చేసుకున్నారు.

RCB

విజయాన్ని సెలెబ్రేట్

బెంగళూరు నగరంలోనే కాకుండా హైదరాబాద్, పుణె, ముంబై, అహ్మదాబాద్, కోల్‌కతా నగరాల్లో అభిమానులు భారీ సంఖ్యలో రోడ్లపైకి వచ్చి ఆర్‌సీబీ విజయాన్ని సెలెబ్రేట్ చేసుకున్నారు. ఈ క్రమంలోనే 18 ఏళ్లుగా ఆర్‌సీబీని అంటిపెట్టుకున్న అభిమానులతో కలిసి బెంగళూరులో విక్టరీ పరేడ్ నిర్వహించాలని ఫ్రాంచైజీ(Franchise) నిర్ణయించింది. మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో బెంగళూరులోని విధాన సౌధ నుంచి చిన్న స్వామి స్టేడియం వరకు ఈ విక్టరీ పరేడ్ నిర్వహించాలని భావించింది. ఈ మేరకు ఆర్‌సీబీ ఓ ప్రకటనను కూడా చేసింది.’బెంగళూరులో ఆర్‌సీబీ విక్టరీ పరేడ్ ఉంది. అభిమానుల కోసమే ఈ ర్యాలీ. మీ ప్రతీ సంబరం, కన్నీటి చుక్క కోసమే ఇది. లాయల్టీనే రాయల్టీ. నేటి ఈ టైటిల్ మీదే’అని ఆర్‌సీబీ ట్వీట్ చేసింది. ఈ విక్టరీ పరేడ్‌ను స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌(Star Sports Network)తో పాటు జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు కూడా ఏర్పాట్లు చేశారు. కానీ పోలీసులు అనుమతి నిరాకరించడంతో విక్టరీ పరేడ్‌ను రద్దు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే విక్టరీ పరేడ్‌ రద్దు చేస్తున్నట్లు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. బెంగళూరు పోలీసులపై ఆర్‌సీబీ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Read Also: Krunal Pandya : ఆర్‌సీబీ తొలి విజయంలో కృనాల్ ఘనత

#RCB2025Champions #RCBFans #RCBLoyalty #RCBVictoryParade Ap News in Telugu Breaking News in Telugu Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.