ఐపీఎల్ 2025 టైటిల్ కోసం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ), పంజాబ్ కింగ్స్ (పీబీకేఎస్) జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి.ఫైనల్ మ్యాచ్ ఈ రోజు సాయంత్రం 7.30 గంటలకు అహ్మదాబాద్(Ahmedabad)లోని నరేంద్ర మోడీ స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య జరగనుంది.రెండు జట్లు తొలిసారి ఐపీఎల్ టైటిల్ను గెలుచుకోవాలని కోరుకుంటున్నాయి. ఈ సీజన్లో రెండు జట్ల మధ్య ప్రదర్శన అద్భుతంగా ఉంది.రెండు జట్లూ టైటిల్ గెలవడానికి ఫేవరెట్లుగా ఉన్నాయి. ఇది పంజాబ్ జట్టు రెండో ఫైనల్ కాగా ఆర్సీబీకి నాలుగో ఫైనల్. ఈ కీలక మ్యాచ్కు ముందు శ్రీలంక దిగ్గజం తిలకరత్నే దిల్షాన్ కీలక ప్రకటన చేశాడు. ఫైనల్ మ్యాచ్లో తానుఆర్సీబీ జట్టుకు మద్దతు ఇస్తున్నాడు. దిల్షాన్(Dilshan) ఏఎన్ఐతో మాట్లాడుతూ “ఐపీఎల్ ప్రారంభానికి ముందు ఈ ఏడాది ఆర్సీబీ గెలవాలని కొన్ని మీడియా సంస్థలకు చెప్పాను. వారు టోర్నమెంట్ అంతటా చాలా బాగా రాణించారని భావిస్తున్నాను. ఈ సారు వారు గెలవగలరని ఆశిస్తున్నాను. విరాట్ కోహ్లీ, ఆర్సీబీ జట్టుకు నా శుభాకాంక్షలు” అని తిలకరత్నే దిల్షాన్ పేర్కొన్నాడు. దిల్షాన్ 2011 నుంచి 2013 వరకు ఐపీఎల్లో ఆర్సీబీకి ప్రాతినిధ్యం వహించాడనే సంగతి తెలిసిందే. దిల్షాన్ ఐపీఎల్ కెరీర్ గురించి చెప్పాలంటే అతను 52 మ్యాచ్లలో 1153 పరుగులు చేశాడు.

బ్యాటింగ్
దక్షిణాఫ్రికా అనుభవజ్ఞుడైన క్రికెటర్ హెర్షెల్ గిబ్స్(Herschel Gibbs) కూడా ఫైనల్లో ఆర్సీబీకి మద్దతు ఇస్తున్నాడు. ది లెజెండ్-జెడ్ టీ10 లీగ్ సందర్భంగా గిబ్స్ ఏఎన్ఐతో మాట్లాడుతూ “పంజాబ్ కింగ్స్ ముందుగా బ్యాటింగ్ చేస్తే ఆర్సీబీ ఆ స్కోరును ఛేదిస్తుంది. నేను ఆర్సీబీకి మద్దతు ఇస్తున్నాను. ఇది గొప్ప మ్యాచ్ అవుతుందని అనుకుంటున్నాను.ఆర్సీబీ(RCB) కనీసం ఒక టైటిల్ గెలవడం చూడాలని అనుకుంటున్నాను, అంటూ గిబ్స్ పేర్కొన్నాడు. హెర్షెల్ గిబ్స్ 2008 నుంచి 2012 వరకు ఐపీఎల్లో 36 మ్యాచ్లు ఆడి 886 పరుగులు చేశాడు.