📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం

RCB: తొక్కిసలాటకు ఆర్సీబీయే కారణం: క్యాట్‌

Author Icon By Anusha
Updated: July 2, 2025 • 4:11 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025లో తొలిసారి ట్రోఫీ సాధించిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) అభిమానుల్లో (RCB fans)ఉత్సాహాన్ని రెట్టింపు చేసింది. జూన్ 4న బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం బయట విజయోత్సవ వేడుకలు నిర్వహించేందుకు ఆర్సీబీ యాజమాన్యం పిలుపునిచ్చింది. అయితే, ఈ వేడుకలకు ముందు తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడంతో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. తొక్కిసలాటలో 11 మంది అమాయకుల ప్రాణాలు కోల్పోయారు.ఈ ఘటనపై విచారణ చేపట్టిన సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యూనల్ (CAT) స్పష్టమైన వ్యాఖ్యలు చేసింది. ముందు జాగ్రత్త చర్యలు తీసుకోకుండా, విజయోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించడం ద్వారా ఆర్సీబీ యాజమాన్యమే ఈ దుర్ఘటనకు ప్రథమ దోషిగా నిలిచిందని ట్రిబ్యూనల్ అభిప్రాయపడింది.

ఘటనకు దారితీసిన ఉత్సాహం

జూన్ 4న జరిగిన విజయోత్సవానికి వేలాది మంది అభిమానులు హాజరయ్యారు. టికెట్ల వ్యవస్థ లేకుండానే ఉచిత ప్రవేశం (Free entry) అందిస్తామని ప్రకటించడంతో ఒక్కసారిగా స్టేడియం గేట్ల వద్ద జనసంద్రము ఏర్పడింది. అభిమానులు తమ అభిమాన క్రికెటర్లను ఓసారి చూడాలనే ఉత్సాహంతో ముందుకు ఎగబడటంతో తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు, అనేక మంది గాయపడ్డారు. దీనిపై క్యాట్‌ స్పందిస్తూ ‘ప్రాథమికంగా చూస్తే ఇంత భారీ స్థాయిలో అభిమానులు తరలిరావడానికి ఆర్‌సీబీ (RCB) యాజమాన్యమే కారణం. ఆ జట్టు సోషల్‌ మీడియా ఖాతాలో విక్టరీ పరేడ్‌ పోస్ట్‌ పెట్టిన 12 గంటల్లోపే అభిమానులు చిన్నస్వామికి పోటెత్తారు.

RCB: తొక్కిసలాటకు ఆర్సీబీయే కారణం: క్యాట్‌

అనుమతులు తీసుకోలేదు

ఆర్‌సీబీ ముందుగా పోలీసుల నుంచి పరేడ్‌కు అవసరమైన అనుమతులు తీసుకోలేదు. 35 వేల సామర్థ్యం గల స్టేడియానికి సుమారు 2 నుంచి 3 లక్షల మంది దాకా తరలిరావడంతో పోలీసులు వారిని అదుపుచేయలేకపోయారు. సమయాభావం వల్ల పోలీసులు (Police) సైతం అవసరమైన బలగాలను సమకూర్చుకోలేకపోయారు. పోలీసులేమీ దేవుళ్లు కాదు కదా, వాళ్లూ మానవ మాత్రులే. భారీగా వచ్చిన జనాలను అదుపుచేయడానికి వారిదగ్గర అల్లావుద్దీన్‌ ద్వీపం వంటిదేమీ లేదు. పోలీసులు పూర్తి సన్నద్దం అయ్యేందుకు సమయం ఇచ్చుంటే బాగుండేది’ అని వెల్లడించింది. దీనిపై ఆర్‌సీబీ మేనేజ్‌మెంట్‌ ఇంకా స్పందించలేదు.

Read Also: IND vs ENG: టాస్ గెలిచిన ఇంగ్లండ్..భారత్ ఫస్ట్ బ్యాటింగ్

#BangaloreNews #CATVerdict #ChinnaswamyStadium #CrowdControlFailure #FanSafety #IPL2025 #IPLFinal #PublicSafety #RCBLiability** #RCBManagement #RCBVictory #StadiumStampede #StampedeIncident #TragicIncident #VictoryCelebrations Ap News in Telugu Breaking News in Telugu Google News in Telugu Here are English hashtags with relevant keywords separated by commas based on your content: **#RCB Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.