📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం

Piyush Chawla: అన్ని ఫార్మాట్ల నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన పీయూష్ చావ్లా

Author Icon By Anusha
Updated: June 6, 2025 • 5:20 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

భారత క్రికెట్ జట్టు లెగ్ స్పిన్నర్, రెండు ప్రపంచ కప్‌ల గెలుపులో పాలుపంచుకున్న పీయూష్ చావ్లా (36) తన సుదీర్ఘ క్రికెట్ ప్రస్థానానికి ముగింపు పలికాడు. శుక్రవారం ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఈ విషయాన్ని ప్రకటించారు. 2007 టీ20 ప్రపంచ కప్, 2011 వన్డే ప్రపంచ కప్ గెలిచిన భారత జట్టులో పీయూష్ చావ్లా భాగంగా ఉన్నాడు. పీయూష్ చావ్లా 2012లో భారత్ తరఫున చివరి మ్యాచ్ ఆడాడు. అయిత్ 2007 టీ20 ప్రపంచ కప్‌లో పీయూష్ చావ్లా(Piyush Chawla)కు ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం రాలేదు. ఆటకు వీడ్కోలు చెప్పిన సందర్భంగా పీయూష్ చావ్లా తన కుటుంబానికి, అభిమానులకు, సహచర ఆటగాళ్లకు, కోచ్‌లు, బీసీసీఐకి కృతజ్ఞతలు చెప్పాడు. తనను నమ్మిన ఐపీఎల్ ఫ్రాంచైజీలు పంజాబ్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్, చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్‌లకు కృతజ్ఞతలు తెలిపాడు. ఐపీఎల్ తన కెరీర్‌లో ఒక ప్రత్యేక అధ్యాయమని తాను దానిలో ఆడుతున్న ప్రతి క్షణాన్ని ఎంతో ఆనందించానన్నారు.

మొదటి మ్యాచ్

2006లో పీయూష్ చావ్లా అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. పీయూష్ 2006లో మొహాలీలో ఇంగ్లాండ్‌తో టెస్ట్ మ్యాచ్‌గా తన మొదటి మ్యాచ్ ఆడాడు. తర్వాత 2007లో బంగ్లాదేశ్‌తో వన్డే అరంగేట్రం చేశాడు. 2010లో దక్షిణాఫ్రికాతో టీ20 అరంగేట్రం చేశాడు. పీయూష్ డిసెంబర్ 2012లో ఇంగ్లాండ్‌తో భారత్ తరఫున చివరి టెస్ట్ మ్యాచ్, 2011లో నెదర్లాండ్స్‌తో జరిగిన చివరి వన్డే, 2012లో వాంఖడే స్టేడియం(Wankhede Stadiumలో ఇంగ్లాండ్ జట్టుతో చివరి టీ20 మ్యాచ్ ఆడాడు. దీని తర్వాత పీయూష్ చావ్లా టీమిండియాలో ఎప్పుడూ స్థానం సాధించలేకపోయాడు. అయితే పీయూష్ చావ్లా ఐపీఎల్‌లో ఆడటం కొనసాగించాడు. ఈ లీగ్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లలో ఒకడు.

ముంబై ఇండియన్స్

భారత్ తరఫున పీయూష్ చావ్లా మూడు టెస్టులు, 25 వన్డేలు, 7 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. పీయూష్ చావ్లా టెస్టుల్లో 7 వికెట్ల, వన్డేల్లో 32 వికెట్లు, టీ20ల్లో 4 వికెట్లు తీసుకున్నాడు. ఐపీఎల్‌లో 192 మ్యాచ్‌ల్లో 192 వికెట్లు పడగొట్టాడు. గత సంవత్సరం ముంబై ఇండియన్స్ జట్టులో పీయూష్ చావ్లా భాగంగా ఉన్నాడు. అయితే మెగా వేలానికి ముందే అతడిని విడుదల చేశారు. వేలంలో పీయూష్ చావ్లాను ఎవరూ కొనుగోలు చేయలేదు. దీని తర్వాత పీయూష్ చావ్లా ఐపీఎల్‌లో వ్యాఖ్యాతగా కూడా వ్యవహరించాడు.

Read Also: CV Anand: ఆర్‌సీబీ విజయం.. హైదరాబాద్‌ సెలెబ్రేషన్స్‌పై సీవీ ఆనంద్ ఫైర్

#CricketLegend #IndianCricket #PiyushChawla #RetirementAnnouncement #TeamIndia Ap News in Telugu Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.