ఐపీఎల్ Vs పీఎస్ఎల్: అన్ని రంగాల్లోనూ భారీస్థాయిలో తేడా!
ప్రపంచంలో క్రికెట్ అభిమానులందరికీ ఎంతో అభిమానం ఉన్న లీగ్ ఐపీఎల్. ఒక్క ఇండియాలోనే కాదు, అంతర్జాతీయ స్థాయిలోనూ అత్యంత ప్రజాదరణ పొందిన టీ20 లీగ్గా ఐపీఎల్కి ఉన్న గౌరవం అసాధారణం. ఇక దీనికి పోటీగా పాకిస్తాన్ ప్రారంభించిన పీఎస్ఎల్ (పాకిస్తాన్ సూపర్ లీగ్) మాత్రం ఇప్పటివరకు ఆశించిన స్థాయిలో ప్రేక్షకాదరణను పొందలేకపోయింది. 2024లో ఏప్రిల్ 11న ప్రారంభమైన ఈ సీజన్ కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో చర్చకు రాలేదు. అయితే పాక్ ఆటగాళ్లు మరియు అభిమానులు మాత్రం తమ లీగ్ను ఐపీఎల్తో తరచూ పోల్చుకుంటూ తమదే గొప్పదని చెబుతుండడం గమనార్హం. కానీ వాస్తవాలు చూస్తే పీఎస్ఎల్ అన్ని రంగాల్లోనూ ఐపీఎల్కు చాలా దూరంలో ఉంది. ఇప్పుడోసారి వీటి మధ్య స్పష్టమైన తేడాలను వివరిద్దాం.

వ్యూవర్షిప్ – నాలుగు రెట్లు తేడా
ఒక టోర్నీ విజయాన్ని అంచనా వేసే ప్రధాన ప్రమాణం వ్యూవర్షిప్. ఈ కోణంలో ఐపీఎల్దే అగ్రస్థానం. 2024లో పీఎస్ఎల్కు కేవలం 150 మిలియన్ డిజిటల్ వ్యూస్ వచ్చినట్లు సమాచారం. ఇదే సమయంలో ఐపీఎల్ మాత్రం ఏకంగా 620 మిలియన్ డిజిటల్ వ్యూస్తో శిఖరాలను తాకింది. అంటే ఐపీఎల్ వ్యూయర్షిప్ పీఎస్ఎల్ కంటే సుమారు నాలుగు రెట్లు ఎక్కువ. ఇది ఐపీఎల్ పాపులారిటీకి నిదర్శనం.
మీడియా & డిజిటల్ రైట్స్ – వందల కోట్ల వ్యత్యాసం
ఇంకా మీడియా హక్కులు, డిజిటల్ బ్రాడ్కాస్టింగ్ రైట్స్ వంటి అంశాల్లోనూ ఐపీఎల్దే మేటి. ఐపీఎల్ మీడియా హక్కులు దాదాపు $6.2 బిలియన్ డాలర్లకు అమ్ముడయ్యాయి. ఇది పేస్ఎల్తో పోలిస్తే పది పట్టు ఎక్కువ! పీఎస్ఎల్ మీడియా హక్కులు కేవలం $36 మిలియన్ డాలర్లే. ఇది చూస్తే స్పాన్సర్ల ఆసక్తి ఏ లీగ్పై ఎక్కువగా ఉందో స్పష్టంగా అర్థమవుతుంది.
ప్రైజ్మనీ – ఐపీఎల్కు సాటి లేదు
క్రికెట్లో అభిమానులను ఎక్కువగా ఆకట్టుకునే అంశం ప్రైజ్మనీ. ఐపీఎల్ విజేతకు దాదాపు రూ. 20.8 కోట్లు ($2.4 మిలియన్) లభిస్తుండగా, రన్నరప్ జట్టుకు రూ.13 కోట్లు ($1.56 మిలియన్) లభిస్తాయి. మూడో, నాలుగో స్థానాల్లో నిలిచిన జట్లకు వరుసగా రూ.7 కోట్లు, రూ.6.5 కోట్లు లభిస్తాయి. పీఎస్ఎల్ విజేతకు మాత్రం కేవలం $500,000 (రూ. 4.5 కోట్లు) మాత్రమే లభిస్తుంది. రన్నరప్ జట్టుకు $200,000 (రూ.1.7 కోట్లు) మాత్రమే అందుతుంది. అంటే ఐపీఎల్కి పీఎస్ఎల్ నాలుగున్నర రెట్లు తక్కువ స్థాయిలో ఉంది.
WPL కంటేనూ తక్కువ ప్రైజ్మనీ!
పీఎస్ఎల్ స్థాయి ఎంత తక్కువగా ఉందంటే, మన దేశ మహిళల ప్రీమియర్ లీగ్ (WPL) కూడా పీఎస్ఎల్ను మించి ఉంది. 2025 WPL విజేత ముంబయి ఇండియన్స్ జట్టు రూ.6 కోట్లు, రన్నరప్ దిల్లీ క్యాపిటల్స్ రూ.3 కోట్లు ప్రైజ్మనీగా పొందాయి. ఇది పీఎస్ఎల్ రన్నరప్కు లభించే మొత్తాన్ని మించిపోవడం విశేషం. మహిళల లీగ్గానే కాకుండా, స్థాయిలోనూ, ఆసక్తిలోనూ మన WPL పీఎస్ఎల్ కంటే ముందే ఉంది.
పీఎస్ఎల్ ఐపీఎల్తో పోటీ కాదు
ఒకసారి మొత్తం విశ్లేషిస్తే, పీఎస్ఎల్ ఐపీఎల్కు ఏ కోణంలోనూ పోటీ కాదని స్పష్టమవుతుంది. వ్యూవర్షిప్, మీడియా రైట్స్, ప్రైజ్మనీ, ఆటగాళ్ల గ్లోబల్ రికగ్నిషన్ వంటి అన్ని అంశాల్లోనూ ఐపీఎల్దే పైచేయి. క్రికెట్కి పెద్ద పండుగలాంటిది ఐపీఎల్. పీఎస్ఎల్ మాత్రం ఇప్పటికీ చిన్న స్థాయిలోనే ఉంది.
read also: IPL 2025: నేడు తలపడనున్న సన్రైజర్స్,ఢిల్లీ క్యాపిటల్స్