సొంతగడ్డపై భారత క్రికెట్ జట్టుకు మరో చేదు అనుభవం ఎదురైంది. ఈ సారి వన్డే (ODI) ల్లో ఘోర పరాజయాన్ని చవిచూసింది. గతేడాది టెస్ట్ సిరీస్ను క్లీన్ స్వీప్ చేసి దిమ్మతిరిగే షాకిచ్చిన న్యూజిలాండ్.. ఈ సారి వన్డే సిరీస్లో దెబ్బకొట్టింది. మూడు వన్డేల సిరీస్ను 2-1తో కైవసం చేసుకొని సరికొత్త చరిత్రను లిఖించింది. భారత గడ్డపై తొలి వన్డే సిరీస్ను గెలుచుకొని 38 ఏళ్ల నిరీక్షణకు తెరదించింది.
Read Also: India vs New Zealand : 3వ వన్డేలో కీలక మార్పు, అర్ష్దీప్ ఎంట్రీ ఎందుకో?
గంభీర్ పై విమర్శల వర్షం
ఈ ఓటమిపై సోషల్ మీడియా వేదికగా అభిమానులు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ముఖ్యంగా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ను లక్ష్యంగా చేసుకుని పోస్టులు పెడుతున్నారు. “అనుభవం లేని కివీస్ జట్టు, బలమైన భారత జట్టును ఓడించడం గంభీర్ హయాంలోనే సాధ్యం” అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు.
మరోవైపు, మాజీ క్రికెటర్ వసీం జాఫర్ స్పందిస్తూ.. యువ కివీస్ జట్టు అద్భుతంగా ఆడిందని ప్రశంసించారు. కుల్దీప్ యాదవ్ ప్రదర్శన, సంజూ శాంసన్ స్థానంలో శుభ్మన్ గిల్ను ఎంపిక చేయడం వంటి అంశాలపై కూడా సెలెక్టర్లపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: