ఐపీఎల్ 2025 సీజన్లో భాగంగా, రాజస్థాన్ రాయల్స్కు ఈ సీజన్ చాలా దారుణంగా ఉంది. ఆ జట్టు ఇప్పటికే ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించింది. ఇప్పుడు రాజస్థాన్కు మరో బిగ్ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ ప్లేయర్ నితీష్ రాణా టోర్నమెంట్ నుంచి నిష్క్రమించాడు. నిజానికి నితీష్(Nitish Rana) రాణా గాయం కారణంగా టోర్నమెంట్కు దూరమయ్యాడు. నితీష్ రాణా స్థానంలో దక్షిణాఫ్రికాకు చెందిన బలమైన ఆటగాడిని జట్టులో చేర్చారు.నితీష్ రాణా టోర్నమెంట్ నుంచి తప్పుకున్న తర్వాత రాజస్థాన్ రాయల్స్ 19 ఏళ్ల దక్షిణాఫ్రికా ఎడమచేతి వాటం ఆటగాడు లువాన్-డ్రే ప్రిటోరియస్ను జట్టులోకి చేర్చుకుంది. రాజస్థాన్ రాయల్స్ జట్టులో ఇప్పటికే ఎడమచేతి వాటం బ్యాటర్ యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ ఉన్నారు. ఇద్దరు లెఫ్టార్మ్ బ్యాటర్లు ఉండగానే,మరో ఎడమచేతి వాటం బ్యాటర్ ను రాజస్థాన్ రాయల్స్ జట్టులో చేర్చుకుంది.
అత్యధిక
లువాన్ ఇప్పటికే దక్షిణాఫ్రికా ప్రీమియర్ టీ20 క్రికెట్ లీగ్ అయిన SA20లో పార్ల్ రాయల్స్ జట్టులో భాగంగా ఉన్నాడు. SA20 2025లో ప్రిటోరియస్( Pretorius) క్రికెట్ అభిమానులలో చాలా ఖ్యాతిని సంపాందించాడు. తన మొదటి ఎలైట్ ఫ్రాంచైజ్ టోర్నమెంట్ ఆడిన ఈ యువకుడు 166.81 స్ట్రైక్ రేట్తో 397 పరుగులు సాధించాడు. ఈ టోర్నమెంట్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు.ఈ టోర్నమెంట్లో రాజస్థాన్ రాయల్స్ జట్టు ఆటగాళ్ల గాయాలతో ఇబ్బంది పడుతోంది. కెప్టెన్ సంజు శాంసన్ కూడా గాయం కారణంగా మ్యాచ్లు ఆడలేకపోయాడు. ఇది కాకుండా రాజస్థాన్ రాయల్స్ జట్టు స్టార్ ఫాస్ట్ బౌలర్ సందీప్ శర్మ కూడా గాయం కారణంగా టోర్నమెంట్కు దూరంగా ఉన్నాడు.
Read Also :world Test Championship : వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్కు కౌంట్డౌన్ ప్రారంభం