Mike Hesson on Salman Ali Agha bottle incident: టీ20 ప్రపంచకప్లో వరుస మ్యాచులతో బిజీగా ఉన్న పాకిస్థాన్ జట్టులో అంతర్గత గొడవలు ఉన్నాయంటూ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా నమీబియాతో మ్యాచ్ సందర్భంగా కెప్టెన్ సల్మాన్ అలీ అఘా, హెడ్ కోచ్ మైక్ హెస్సన్ మధ్య ఏదో జరిగిందన్న వార్తలు గుప్పుమన్నాయి. ఈ పుకార్లకు ఫుల్స్టాప్ పెడుతూ కోచ్ మైక్ హెస్సన్ తాజాగా మీడియా వేదికగా అసలు విషయం వెల్లడించారు.
Read Also: Bangladesh t20 world : టీ20 వరల్డ్ కప్ బహిష్కరణ వివాదం, కోచ్ సలావుద్దీన్ ఫైర్
వైరల్ వీడియో వెనుక అసలు నిజం: బాటిల్ విసిరింది ఎందుకు?
నమీబియాతో జరిగిన మ్యాచ్లో సల్మాన్ అలీ అఘా కోపంతో వాటర్ బాటిల్ను నేలకు విసిరిన వీడియో నెట్టింట వైరల్ అయ్యింది. దీనిపై హెస్సన్ స్పందిస్తూ.. “ఆ వీడియోను నేను కూడా చూశాను, కానీ ప్రజలు దానిని తప్పుగా అర్థం చేసుకున్నారు. సల్మాన్ ఆ బాటిల్ను నాపై కోపంతో విసరలేదు. తక్కువ పరుగులకే ఔటైనందుకు తన ఆటపై తనకే కలిగిన అసహనంతో ఆ పని చేశాడు” అని వివరించారు.

సూపర్-8లో భాగంగా పాకిస్థాన్ నేడు కొలంబో వేదికగా న్యూజిలాండ్తో కీలక మ్యాచ్ ఆడనుంది. టీ20 ప్రపంచకప్ చరిత్రలో ఈ రెండు జట్ల మధ్య జరిగిన 7 మ్యాచ్ల్లో పాక్ 5 విజయాలు సాధించగా, కివీస్ రెండింటిలో గెలిచింది. 2016 నుంచి ప్రపంచకప్లో పాక్పై న్యూజిలాండ్ గెలవలేకపోయింది.అయితే, న్యూజిలాండ్ బ్యాటర్ మార్క్ చాంప్మన్ రూపంలో పాకిస్థాన్కు గట్టి ముప్పు పొంచి ఉంది. పాక్పై అతడికి అద్భుతమైన రికార్డు ఉంది. ఇప్పటివరకు 25 టీ20ల్లో 41.43 సగటుతో ఒక సెంచరీ, నాలుగు అర్ధ సెంచరీలతో 663 పరుగులు చేశాడు. సూపర్-8 గ్రూప్-2లో సెమీఫైనల్ ఆశలు సజీవంగా ఉంచుకోవాలంటే ఈ మ్యాచ్లో గెలుపు ఇరు జట్లకు అత్యంత కీలకం. కాగా, ఈ మ్యాచ్కు వర్షం ముప్పు ఉండటం అభిమానులను ఆందోళనకు గురిచేస్తోంది.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: