हिन्दी | Epaper
షెఫాలీ వర్మ అరుదైన రికార్డు నేటి నుంచి విజయ్ హజారే ట్రోఫీ ప్రారంభం నేడు విశాఖలో ఉమెన్స్ రెండో టీ20 శ్రీలంకపై టీమిండియా ఘనవిజయం నేడు T20 ప్రపంచ కప్ టీం ప్రకటన టీ20 సిరీస్ టీమిండియాదే నేడే 5వ T20 IND vs SA: 4వ T20 రద్దు! సౌతాఫ్రికాతో నేడు నాలుగో టీ20 మార్చి 26 నుంచి మెగా టోర్నీ! షెఫాలీ వర్మ అరుదైన రికార్డు నేటి నుంచి విజయ్ హజారే ట్రోఫీ ప్రారంభం నేడు విశాఖలో ఉమెన్స్ రెండో టీ20 శ్రీలంకపై టీమిండియా ఘనవిజయం నేడు T20 ప్రపంచ కప్ టీం ప్రకటన టీ20 సిరీస్ టీమిండియాదే నేడే 5వ T20 IND vs SA: 4వ T20 రద్దు! సౌతాఫ్రికాతో నేడు నాలుగో టీ20 మార్చి 26 నుంచి మెగా టోర్నీ! షెఫాలీ వర్మ అరుదైన రికార్డు నేటి నుంచి విజయ్ హజారే ట్రోఫీ ప్రారంభం నేడు విశాఖలో ఉమెన్స్ రెండో టీ20 శ్రీలంకపై టీమిండియా ఘనవిజయం నేడు T20 ప్రపంచ కప్ టీం ప్రకటన టీ20 సిరీస్ టీమిండియాదే నేడే 5వ T20 IND vs SA: 4వ T20 రద్దు! సౌతాఫ్రికాతో నేడు నాలుగో టీ20 మార్చి 26 నుంచి మెగా టోర్నీ! షెఫాలీ వర్మ అరుదైన రికార్డు నేటి నుంచి విజయ్ హజారే ట్రోఫీ ప్రారంభం నేడు విశాఖలో ఉమెన్స్ రెండో టీ20 శ్రీలంకపై టీమిండియా ఘనవిజయం నేడు T20 ప్రపంచ కప్ టీం ప్రకటన టీ20 సిరీస్ టీమిండియాదే నేడే 5వ T20 IND vs SA: 4వ T20 రద్దు! సౌతాఫ్రికాతో నేడు నాలుగో టీ20 మార్చి 26 నుంచి మెగా టోర్నీ!

Latest News: Michael Atherton: ఐసీసీ టోర్నీల విధానంపై ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ తీవ్ర విమర్శలు

Anusha
Latest News: Michael Atherton: ఐసీసీ టోర్నీల విధానంపై ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ తీవ్ర విమర్శలు

అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) (ICC) టోర్నమెంట్‌ల డ్రా విధానంపై ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ అథర్టన్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రతి ఐసీసీ మేజర్ ఈవెంట్‌లో భారత్, పాకిస్థాన్ జట్లను ఒకే గ్రూపులో ఉంచడం కేవలం వాణిజ్య ప్రయోజనాల కోసం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈ విధానం ఆట యొక్క నిష్పక్షపాతతను దెబ్బతీస్తోందని, ఇకపై డ్రా ప్రక్రియలో పూర్తిస్థాయి పారదర్శకత ఉండాలని అథర్టన్ (Michael Atherton) డిమాండ్ చేశారు.

IND W vs PAK: పాకిస్థాన్ పై భారత్ ఘన విజయం

ఇటీవల ముగిసిన 2025 ఆసియా కప్‌ (2025 Asia Cup) లో ఇరు దేశాల మధ్య నెలకొన్న రాజకీయ ఉద్రిక్తతలు ఆటపై ప్రభావం చూపిన నేపథ్యంలో అథర్టన్ ఈ వ్యాఖ్యలు చేశాడు. “ఐసీసీ ఈవెంట్లలో చాలా ఏళ్లుగా భారత్, పాకిస్థాన్‌లను ఒకే గ్రూపులో చూడటం పరిపాటిగా మారింది. దీని వెనుక ఉన్న కారణాలను ఐసీసీ ఎప్పుడూ స్పష్టంగా వివరించలేదు.

కేవలం ఈ రెండు జట్ల మధ్య కనీసం ఒక మ్యాచ్ అయినా జరిగేలా చూడటానికే ఇలా చేస్తున్నారని స్పష్టంగా అర్థమవుతోంది” అని ఆయన అన్నారు.భారత్-పాక్ మ్యాచ్‌ (India-Pakistan match) కు ఉన్న ఆర్థిక విలువ చాలా పెద్దదని, అందుకే ఐసీసీ ప్రసార హక్కులు భారీ ధరకు అమ్ముడవుతున్నాయని అథర్టన్ తన కాలమ్‌లో పేర్కొన్నాడు.

Michael Atherton
Michael Atherton

ఒకప్పుడు దౌత్య సంబంధాలకు వారధిగా ఉన్న క్రికెట్

2023-27 సైకిల్‌కు గాను ప్రసార హక్కుల విలువ సుమారు 3 బిలియన్ డాలర్లుగా ఉందని గుర్తుచేశాడు. “ఒకప్పుడు దౌత్య సంబంధాలకు వారధిగా ఉన్న క్రికెట్, ఇప్పుడు రాజకీయ ఉద్రిక్తతలకు, ప్రచారాలకు ప్రతీకగా మారింది.

కేవలం డబ్బు కోసం ఒక క్రీడాసంస్థ తమ టోర్నమెంట్ ఫిక్చర్‌లను మార్చుకోవడంలో అర్థం లేదు” అని ఆయన అభిప్రాయపడ్డాడు. ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) (ACC) కూడా ఈ మ్యాచ్‌ల ద్వారా వచ్చే ఆదాయంపైనే ఎక్కువగా ఆధారపడి ఉందని,

ఆసియా కప్ ఫార్మాట్‌ను ఒకే నెలలో మూడుసార్లు ఈ జట్లు తలపడేలా రూపొందించారని ఆయన విమర్శించారు. రాబోయే ప్రసార హక్కుల సైకిల్ నుంచైనా ఐసీసీ డ్రా ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని, ఒకవేళ డ్రాలో ఈ రెండు జట్లు ఎదురుపడకపోయినా ఫర్వాలేదని అథర్టన్ స్పష్టం చేశారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870