📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం

Sports: విడాకులు తీసుకున్న మేరీకోమ్

Author Icon By Anusha
Updated: May 1, 2025 • 12:32 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

స్టార్ బాక్సర్ మేరీ కోమ్ బుధవారం ఏప్రిల్ 30న విడాకులు ప్రకటించారు. ఆమె తన భర్త కరుంగ్ ఓన్లర్ నుంచి విడాకులు తీసుకుంటున్నట్లు అధికారికంగా ప్రకటించారు. వారిద్దరూ 2005 సంవత్సరంలో వివాహం చేసుకున్నారు. కొన్ని రోజుల క్రితమే మేరీ కోమ్ విడాకుల వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు ఆమె అధికారికంగా సోషల్ మీడియాలో ప్రకటించారు. విడాకులకు ముందు మేరీ కోమ్‌కు హితేష్ చౌదరితో సంబంధం ఉందని పుకార్లు వచ్చాయి. హితేష్ చౌదరి ప్రస్తుతం మేరీ కోమ్ ఫౌండేషన్ ఛైర్మన్ గా ఉన్నాడు. ఇప్పుడు మేరీ కోమ్ ఈ విషయాలన్నింటిపై తన మౌనాన్ని వీడి లేఖను పంచుకోవడం ద్వారా స్పందించింది. గత రెండు సంవత్సరాలు వ్యక్తి గత జీవితం చాలా కష్టంగా గడిచిందని మేరీ కోమ్ అన్నారు. మేరీ కోమ్‌ బాక్సింగ్‌ ఫౌండేషన్‌ చైర్మన్‌ అయిన హితేష్‌తో తనది వ్యాపార సంబంధమేనని స్పష్టంజేసింది. కాగామేరీ వ్యక్తిగత జీవితంపై కొన్నాళ్లుగా మీడియాలో వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆమె న్యాయ బృందం స్పందించింది. ఈమేరకు సుదీర్ఘమైన ప్రకటన విడుదలజేసింది. తప్పుడు సమాచారం వ్యాప్తి చేయకుండా కోమ్‌ వ్యక్తిగత గోప్యతను గౌరవించాలని ఆ ప్రకటనలో కోరారు. కాగా వారిద్దరూ కలిసి దిగిన ఫొటోలను మేరీ, హితేష్‌ తమ సోషల్‌ మీడియా ఖాతా నుంచి తొలగించారు.

మేరీ

మేరీ, కరుంగ్‌ 2005లో పెళ్లి చేసుకున్నారు. వీరికి కవలలు సహా ముగ్గురు కుమారులున్నారు. తర్వాత బాలికను దత్తత తీసుకున్నారు. కాగా 2022లో జరిగిన మణిపూర్‌ లోకసభ ఎన్నికల్లో మేరీ భర్త పోటీచేసి ఓడిపోయాడు. ఆ ఎన్నికకు 2-3 కోట్ల రూపాయలు ఖర్చయిందట. దీని తర్వాత మేరీ పిల్లల్ని తీసుకుని ఫరీదాబాద్‌ వెళ్లిపోగా, భర్త ఢిల్లీలోనే ఉంటున్నాడు.

పతకాలతో

మేరీ కోమ్ భారత్‌లో అత్యంత విజయవంతమైన మహిళా బాక్సర్‌ అనే విషయం అందరికీ తెలిసిందే. మేరీ కోమ్ 2012 లండన్ ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించడం ద్వారా చరిత్ర సృష్టించారు. ఇది కాకుండా మేరీ కోమ్ ఇప్పటివరకు ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో 6 బంగారు పతకాలతో సహా మొత్తం 8 పతకాలను గెలుచుకున్నారు. ప్రత్యేకత ఏమిటంటే ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో 6 బంగారు పతకాలు సాధించిన ప్రపంచంలోనే ఏకైక మహిళా బాక్సర్ ఆమె.

Read Also: IPL 2025: సీఎస్కే ఓటమి పై ధోని ఏమన్నారంటే!

#BreakingNews #IndianBoxing #MaryKom #MaryKomDivorce #SportsNews Ap News in Telugu Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.