భారత క్రికెట్ చరిత్రలో అత్యంత విజయవంతమైన కెప్టెన్లలో ఒకరైన మహేంద్ర సింగ్ ధోనీ (MS Dhoni) మళ్లీ ఒకసారి వార్తల్లో నిలిచారు. అయితే ఈసారి కారణం క్రికెట్ కాదు, ఆయన దాఖలు చేసిన పరువు నష్టం దావా కేసు. రూ.100 కోట్ల విలువైన ఈ దావా కేసులో మద్రాసు హైకోర్టు (Madras High Court) తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది.
Read Also: Kohli Rohit Retirement: రోహిత్–కోహ్లీ రిటైర్మెంట్ రూమర్స్కి క్లారిటీ
ఈ కేసులో రిటైర్డ్ ఐపీఎస్ అధికారి జి. సంపత్ కుమార్ దాఖలు చేసిన అప్పీల్పై విచారణ పూర్తి చేసిన న్యాయస్థానం, మంగళవారం తన తీర్పును రిజర్వులో ఉంచింది. దీంతో ఈ వివాదంలో త్వరలోనే ఒక కొలిక్కి వచ్చే అవకాశం కనిపిస్తోంది.2014లో ఐపీఎల్ బెట్టింగ్, స్పాట్ ఫిక్సింగ్ కుంభకోణంలో తన పేరును అనవసరంగా ప్రస్తావించారని ఆరోపిస్తూ ధోనీ (MS Dhoni) మద్రాసు హైకోర్టును ఆశ్రయించాడు.
అప్పటి ఐపీఎస్ (IPS) అధికారి సంపత్ కుమార్ పైనా, జీ మీడియా కార్పొరేషన్, జర్నలిస్ట్ సుధీర్ చౌదరి, న్యూస్ నేషన్ నెట్వర్క్లపైనా రూ.100 కోట్ల పరువు నష్టం దావా వేశాడు. అయితే, ఈ దావాను కొట్టివేయాలని కోరుతూ సంపత్ కుమార్ 2021లో ఒక పిటిషన్ దాఖలు చేశారు.
విచారణ ప్రారంభమయ్యే ముందు ఈ పిటిషన్
దావా వేసిన ఏడేళ్ల తర్వాత, విచారణ ప్రారంభమయ్యే ముందు ఈ పిటిషన్ వేయడాన్ని తప్పుబట్టిన సింగిల్ జడ్జి జస్టిస్ ఎన్. శేషసాయి, 2021 డిసెంబర్ 9న దానిని కొట్టివేశారు. న్యాయ ప్రక్రియను ఆలస్యం చేసేందుకే ఇలాంటి పిటిషన్లు దాఖలు చేస్తున్నారని ఆనాడు న్యాయమూర్తి వ్యాఖ్యానించారు.
శాఖాపరమైన విచారణలో తనకు క్లీన్చిట్ లభించిందన్న వాదన, కేసు విచారణలో ఒక రక్షణగా ఉపయోగపడుతుందే తప్ప, దావాను పూర్తిగా కొట్టివేయడానికి అది కారణం కాదని స్పష్టం చేశారు.
అయితే, సింగిల్ జడ్జి (Single Judge) ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ సంపత్ కుమార్ తాజాగా డివిజన్ బెంచ్ను ఆశ్రయించారు. ఈ ఏడాది ఆగస్టు 11న ఈ కేసు విచారణ ప్రారంభం కావడంతో, ఆయన ఈ అప్పీల్ను దాఖలు చేశారు. మంగళవారం జస్టిస్ ఎస్.ఎం. సుబ్రమణియం, జస్టిస్ ఎం. జోతిరామన్లతో కూడిన ధర్మాసనం ఇరుపక్షాల వాదనలను విన్నది.
ధోనీ తరఫున సీనియర్ న్యాయవాది పి.ఆర్. రామన్, సంపత్ కుమార్ తరఫున న్యాయవాది ఆర్.సి. పాల్ కనగరాజ్ తమ వాదనలు వినిపించారు. వాదనలు ముగియడంతో, ధర్మాసనం ఈ అప్పీల్పై తుది తీర్పును రిజర్వు చేస్తున్నట్లు ప్రకటించింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read Also: