India women cricket victory : భారత మహిళల క్రికెట్ జట్టు చరిత్రాత్మక విజయం సాధించింది. ఆస్ట్రేలియా గడ్డపై దాదాపు పదేళ్ల నిరీక్షణకు తెరదించుతూ టీ20 సిరీస్ను సొంతం చేసుకుంది. అడిలైడ్ ఓవల్లో జరిగిన నిర్ణయాత్మక మూడో మ్యాచ్లో 17 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాను ఓడించి 2-1తో సిరీస్ను కైవసం చేసుకుంది.
టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 176 పరుగులు చేసింది. వైస్ కెప్టెన్ స్మృతి మంధాన 55 బంతుల్లో 82 పరుగులు చేసి జట్టుకు అద్భుత ఆరంభం ఇచ్చింది. జెమిమా రోడ్రిగ్స్ 46 బంతుల్లో 59 పరుగులు చేసి ఆమెకు తోడ్పడింది. వీరిద్దరూ రెండో వికెట్కు 121 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పి భారీ స్కోరు సాధించడంలో కీలక పాత్ర పోషించారు. అడిలైడ్ ఓవల్లో మహిళల టీ20ల్లో ఇదే అత్యధిక స్కోరుగా నమోదైంది.
Read Also: Nara Bhuvaneswari: ప్రతి పాడి రైతుకు సాధికారత కల్పించడమే హెరిటేజ్ లక్ష్యం

177 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా ఆరంభం నుంచే ఒత్తిడికి లోనైంది. ఆష్లీ గార్డ్నర్ 57 పరుగులతో పోరాడినప్పటికీ జట్టును గెలుపు దిశగా నడిపించలేకపోయింది. భారత బౌలర్లు శ్రేయంక పాటిల్ (3/22), శ్రీ చరణి (3/32) అద్భుత ప్రదర్శనతో ఆసీస్ బ్యాటింగ్ను కట్టడి చేశారు. నిర్ణీత 20 ఓవర్లలో ఆస్ట్రేలియా 9 వికెట్లకు 159 పరుగులకే పరిమితమైంది.
ఆస్ట్రేలియా గడ్డపై భారత మహిళల జట్టుకు 2016 తర్వాత ఇదే తొలి టీ20 సిరీస్ విజయం. మరోవైపు, స్వదేశంలో ఆస్ట్రేలియా 2017 తర్వాత సిరీస్ కోల్పోవడం ఇదే మొదటిసారి. అద్భుత ఇన్నింగ్స్ ఆడిన స్మృతి మంధానకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఈ విజయంపై కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ ఆనందం వ్యక్తం చేస్తూ జట్టు సమిష్టి కృషిని ప్రశంసించింది.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: