IND vs PAK: ఆదివారం కొలంబో వేదికగా జరిగిన భారత్–పాకిస్తాన్ హై వోల్టేజ్ క్రికెట్ మ్యాచ్ మరోసారి అభిమానులను ఉర్రూతలూగించింది. మైదానంలో టీమిండియా ఘన విజయం సాధించగా, డిజిటల్ ప్లాట్ఫార్మ్లోనూ అదే స్థాయి హవా కొనసాగింది. ఈ మ్యాచ్ జియో సినిమా యాప్లో రికార్డు స్థాయిలో 45.4 కోట్ల వ్యూస్ నమోదు కావడం విశేషం. దీంతో ప్రస్తుత వరల్డ్ కప్లోనే అత్యధికంగా వీక్షించిన మ్యాచ్గా భారత్–పాక్ పోరు నిలిచింది.అమెరికాతో జరిగిన మ్యాచ్కు 26 కోట్లు, నమీబియాతో జరిగిన మ్యాచ్కు 24 కోట్ల వ్యూస్ వచ్చాయి. టీమిండియా ఆడుతుంటే వ్యూస్ ఆటోమెటిక్గా నమోదవుతాయని జియో సినిమా ప్రతినిధులు తెలిపారు.
Read Also: Shoaib Akhtar: నేను అలా అనలేదు

Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: