ఆస్ట్రేలియాతో జరగబోయే వన్డే సిరీస్ (ODI series) కోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) (BCCI) శనివారం టీమిండియాను ప్రకటించింది. ఈసారి జట్టు ఎంపికలో యువ ఆటగాళ్లకు పెద్ద పీట వేశారు. భవిష్యత్లో భారత క్రికెట్ దిశను దృష్టిలో ఉంచుకుని ఈ జట్టును ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.
IND vs WI: విండీస్పై టీమిండియా ఘన విజయం
సీనియర్ ఆటగాళ్లకు విశ్రాంతి ఇచ్చి, కొత్త తరం ఆటగాళ్లకు అవకాశం కల్పించడం ద్వారా బోర్డు భవిష్యత్తు ప్రణాళికలను స్పష్టంగా చూపించింది.కాగా, ఇప్పటికే టెస్టులు, టీ20 (T20) లకు రిటైర్మెంట్ ప్రకటించిన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలకు వన్డే జట్టులో స్థానం కల్పించారు. వైస్ కెప్టెన్ గా శ్రేయాస్ అయ్యర్ (Shreyas Iyer) ను నియమించారు.

ఆల్ రౌండర్ కోటాలో తీసుకున్నట్టు తెలుస్తోంది
ఆంధ్రా క్రికెట్ స్టార్ నితీశ్ కుమార్ రెడ్డి (Nitish Kumar Reddy) తొలిసారిగా భారత వన్డే జట్టుకు ఎంపికయ్యాడు. అతడిని ఆల్ రౌండర్ కోటాలో తీసుకున్నట్టు తెలుస్తోంది. హార్దిక్ పాండ్యాకు ఈ జట్టులో చోటు దక్కలేదు. ఈ మేరకు నేడు చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ (Ajit Agarkar) నేతృత్వంలో సమావేశమైన టీమిండియా (Team India) సీనియర్ సెలెక్షన్ కమిటీ జట్టును ఎంపిక చేసింది.
ఆసీస్ తో 3 వన్డేల సిరీస్ ఈ నెల 19 నుంచి జరగనుంది.జట్టు:శుభ్ మన్ గిల్ (కెప్టెన్), శ్రేయాస్ అయ్యర్ (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), నితీశ్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, అర్షదీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ.
Read hindi news: hindi.vaartha.com
Read Also: