📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం

IPL 2025: ముంబై ఇండియన్స్‌ విజయం పై స్పందించిన హార్దిక్ పాండ్యా

Author Icon By Anusha
Updated: April 24, 2025 • 12:28 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఐపీఎల్ 2025లో భాగంగా ,ఉప్పల్‌ వేదికగా సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ ఆతిథ్య జట్టును 7వికెట్ల తేడాతో ఓడించింది. తద్వారా ఈ సీజన్‌లో ఐదో విజయాన్ని నమోదుచేసి ప్లేఆఫ్స్‌ రేసులో మరో ముందడుగు వేసింది. హెన్రిచ్‌ క్లాసెన్‌ (44 బంతుల్లో 71, 9 ఫోర్లు, 2 సిక్సర్లు), అభినవ్‌ మనోహర్‌ (43) ఆదుకోవడంతో మొదట బ్యాటింగ్‌ చేసిన ఎస్‌ఆర్‌హెచ్‌.. నిర్ణీత ఓవర్లలో 143/8 స్కోరు చేసింది. ట్రెంట్‌ బౌల్ట్‌ (4/26), దీపక్‌ చాహర్‌ (2/12) ఎస్‌ఆర్‌హెచ్‌ను కోలుకోలేని దెబ్బతీశారు. ఛేదనను ముంబై 15.4 ఓవర్లలోనే పూర్తిచేసింది.రోహిత్ శర్మ(46 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్స్‌లతో 70) హాఫ్ సెంచరీతో రాణించగా సూర్యకుమార్ యాదవ్(19 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 40 నాటౌట్) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. సన్‌రైజర్స్ బౌలర్లలో ఉనాద్కత్, మలింగా, జీషన్ అన్సారీ చెరో వికెట్ తీసారు.

సూర్యకుమార్‌

సన్‌రైజర్స్‌ తడబడ్డ పిచ్‌పై ముంబై లక్ష్యాన్ని సాఫీగా దంచేసింది. బౌండరీతో చేధన ప్రారంభించిన రికెల్టన్‌ (11) త్వరగానే పెవిలియన్‌ చేరినా చెన్నై మ్యాచ్‌తో ఫామ్‌లోకి వచ్చిన ముంబైచా రాజా (రోహిత్‌).. అదే జోరును కొనసాగించాడు. కమిన్స్‌ 3వ ఓవర్లో 6, 4 బాదిన హిట్‌మ్యాన్‌ బౌలింగ్‌లోనూ 4, 6 దంచాడు. మరో ఎండ్‌లో విల్‌ జాక్స్‌ (22) రోహిత్‌కు అండగా నిలవడంతో ముంబై స్వల్ప లక్ష్యాన్ని వేగంగా కరిగించింది. కమిన్స్‌ బౌలింగ్లో బౌండరీతో 35 బంతుల్లో రోహిత్‌ ఫిఫ్టీ పూర్తయింది. పదో ఓవర్లో అన్సారీ.. జాక్స్‌ను ఔట్‌ చేసినా ఆ ప్రభావం ముంబైపై పడలేదు. సూర్యకుమార్‌ (40) సాయంతో రోహిత్‌ ముంబై విజయాన్ని ఖాయం చేశాడు. విజయానికి 13 పరుగుల దూరంలో రోహిత్‌ ఔటైనా సూర్య, తిలక్‌ లాంఛనాన్ని పూర్తిచేశారు.

ఆధిపత్యం

ఈ మ్యాచ్ అనంతరం తమ విజయంపై స్పందించిన హార్దిక్ పాండ్యా సంతోషం వ్యక్తం చేశాడు. ‘ఈ విజయం సాధించినందుకు చాలా సంతోషంగా ఉంది. సరైన సమయంలో మా కుర్రాళ్లు మూమెంటమ్ అందుకున్నందుకు ఆనందంగా ఉంది. జట్టులోని ప్రతీ ఒక్కరు క్లిక్ అయితే మా జట్టు ఆధిపత్యం కొనసాగుతుందని నాకు ముందే తెలుసు. దీపక్ చాహర్, ట్రెంట్ బౌల్ట్ అద్భుత బౌలింగ్‌తో మంచి ఆరంభం అందిస్తే.. రోహిత్ శర్మ, సూర్య సూపర్ బ్యాటింగ్‌తో విజయలాంఛనాన్ని పూర్తి చేశారు.ఓవరాల్‌గా ఇదో అద్భుతమైన విజయం. పరిస్థితుల నేపథ్యంలోనే దీపక్ చాహర్‌తో వరుసగా నాలుగు ఓవర్లు బౌలింగ్ చేయించాను. ముందస్తు ప్రణాళికలే కాకుండా పరిస్థితులకు తగ్గట్లు వ్యూహాలు రచించాలని కెప్టెన్‌గా తెలుసుకున్నా. పవర్ ప్లేలో దీపక్ అద్భుతంగా బౌలింగ్ చేసినప్పుడు అతని ఆఖరి ఓవర్‌ను చివరి వరకు ఎందుకు ఆపాలి? ప్రతీ విభాగంలో మరింత మెరుగవ్వాలి. ఏది ఏమైనా మా ప్రదర్శన సంతృప్తినిచ్చింది.’అని హార్దిక్ పాండ్యా చెప్పుకొచ్చాడు.

Read Also: Gautam Gambhir : గౌతమ్ గంభీర్‌ను చంపేస్తామంటూ బెదిరింపులు

#CricketCelebration # #HardikPandya #rohitsharma #SuryakumarYadav #TeamVictory Ap News in Telugu Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.