📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం

IPL 2025: ముంబై ఇండియన్స్ పై గుజరాత్ ఘన విజయం

Author Icon By Anusha
Updated: May 7, 2025 • 2:23 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఐపీఎల్ 2025 సీజన్‌లో భాగంగా వరుసగా ఆరు విజయాలతో దూకుడు మీదున్న ముంబై ఇండియన్స్‌ జోరుకు బ్రేక్‌ పడింది.హోరాహోరీగా సాగుతున్నఆ జట్టు జైత్రయాత్రకు గుజరాత్‌ టైటాన్స్‌(జీటీ) కళ్లెం వేసింది. ఈ సీజన్‌లో వరుసగా ఏడో విజయంతో తిరిగి అగ్రస్థానంతో పాటు ప్లేఆఫ్స్‌ బెర్తునూ ఖాయం చేసుకోవాలన్న లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబైని గుజరాత్‌ ఓడించి షాకిచ్చింది. మంగళవారం రాత్రి వాంఖడే వేదికగా హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో ముంబైపై 3 వికెట్ల తేడాతో జీటీ ఉత్కంఠ విజయం సాధించింది. మొదట బ్యాటింగ్‌ చేసిన ముంబై ప్రధాన బ్యాటర్ల వైఫల్యంతో నిర్ణీత ఓవర్లలో 155/8కే పరిమితమైంది. విల్‌ జాక్స్‌ (35 బంతుల్లో 53, 5 ఫోర్లు, 3 సిక్స్‌లు), సూర్యకుమార్‌ యాదవ్‌ (24 బంతుల్లో 35, 5 ఫోర్లు) ఆ జట్టును ఆదుకున్నారు. గుజరాత్‌ బౌలర్లలో సాయి కిషోర్‌ (2/34), గెరాల్డ్‌ కొయెట్జ్‌ (1/10), అర్షద్‌ ఖాన్‌ (1/18), రషీద్‌ ఖాన్‌ (1/21), సిరాజ్‌ (1/29) సమిష్టిగా సత్తాచాటారు. ఆ తర్వాత లక్ష్యఛేదనకు దిగిన గుజరాత్‌ వర్షం అంతరాయం కల్గించే సమయానికి 19 ఓవర్లలో 147/7 స్కోరు చేసింది. కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్‌(43), బట్లర్‌(30) రాణించారు. బుమ్రా (2/19), బౌల్ట్‌(2/22) ఆకట్టుకున్నారు.గుజరాత్‌ విజయానికి 6 బంతుల్లో 15 పరుగులు అవసరం కాగా, కొట్జె(12) ఔటైనా తెవాటియా(11 నాటౌట్‌), అర్షద్‌ఖాన్‌(1 నాటౌట్‌) జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని కట్టబెట్టారు.

ఇంప్యాక్ట్‌

ఈ సీజన్‌లో నిలకడగా రాణిస్తున్న సాయి సుదర్శన్‌ (5)ను బౌల్ట్‌ రెండో ఓవర్లోనే ఔట్‌ చేసి ముంబైకి తొలి బ్రేక్‌ ఇచ్చాడు. ఐపీఎల్‌లో ఈ తమిళనాడు కుర్రాడు సింగిల్‌ డిజిట్‌కు వెనుదిరగడం ఇది మూడోసారి మాత్రమే. బుమ్రా, బౌల్ట్‌ కట్టుదిట్టంగా బంతులేయడంతో టైటాన్స్‌కు పరుగుల రాకే గగనమైంది. పవర్‌ ప్లేలో గుజరాత్‌ చేసిన స్కోరు 29/1 మాత్రమే. కానీ 8వ ఓవర్‌ వేసిన హార్దిక్‌ 11 బంతులు (3 వైడ్స్‌, 2 నోబాల్స్‌) విసిరి 18 పరుగులు సమర్పించుకోవడంతో టైటాన్స్‌ మళ్లీ రేసులోకి వచ్చింది.గిల్‌ ఇచ్చిన క్యాచ్‌ను తిలక్‌ జారవిడిచినా మరుసటి బంతికే బ్యాట్‌ ఎడ్జ్‌కు తాకి రికెల్టన్‌ చేతిలో పడటంతో అతడు నిష్క్రమించాడు. ఇంప్యాక్ట్‌ ప్లేయర్‌గా వచ్చిన రూథర్‌ఫర్డ్‌ ముంబై బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. జాక్స్‌ ఓవర్లో 4, 4, 6తో సమీకరణాలు మారిపోయాయి.కానీ అప్పటికే డీఎల్‌ఎస్‌ కంటే 8 రన్స్‌ అధికంగా ఉన్న గుజరాత్‌ను రూథర్‌ఫర్డ్‌ ఆదుకున్నాడు. అయితే వర్షం అంతరాయం తర్వాత గుజరాత్‌ వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది. బుమ్రా బౌలింగ్‌లో గిల్‌ క్లీన్‌బౌల్డ్‌ కాగా, రూథర్‌ఫర్డ్‌ను బౌల్ట్‌ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. దీంతో రెండు పరుగుల తేడాతో వీరిద్దరు పెవిలియన్‌ చేరారు. ఆ తర్వాత వచ్చిన షారుఖ్‌ఖాన్‌(5), రషీద్‌ఖాన్‌(2) వెంటవెంటనే ఔట్‌ కావడంతో సమీకరణం కాస్తా 12 బంతుల్లో 24 పరుగులకు మారింది. ఈ తరుణంలో మరోమారు భారీ వర్షంతో మ్యాచ్‌కు అంతరాయం కల్గింది.

బలహీనత

సిరాజ్‌ రెండో బంతికే రికెల్టన్‌ ఇచ్చిన క్యాచ్‌ను కవర్స్‌లో సుదర్శన్‌ అందుకోగా లెఫ్టార్స్‌ పేసర్లను ఆడటంలో తంటాలుపడే రోహిత్‌ మరోసారి అదే బలహీనతను చాటుతూ అర్షద్‌ నాలుగో ఓవర్లో మిడాఫ్‌ వద్ద ప్రసిద్ధ్‌ చేతికి చిక్కాడు. ఎదుర్కున్న రెండో బంతికే సుదర్శన్‌ క్యాచ్‌ మిస్‌ చేయడంతో బతికిపోయిన జాక్స్‌కు సూర్య జతకలవడంతో ముంబై స్కోరువేగం పుంజుకుంది. సిరాజ్‌ మూడో ఓవర్లో జాక్స్‌ 6,4 కొట్టగా ప్రసిద్ధ్‌ 5వ ఓవర్లో సూర్య మూడు బౌండరీలు రాబట్టాడు. అర్షద్‌ ఆరో ఓవర్లో జాక్స్‌ కూడా మూడు ఫోర్లు బాదాడు. ఈ ద్వయం దూకుడుతో పది ఓవర్లకు ముంబై 89/2తో పటిష్టంగానే నిలిచింది. సాయి కిషోర్‌ 11వ ఓవర్లో లాంగాఫ్‌ మీదుగా సిక్స్‌ కొట్టిన జాక్స్‌ అర్ధ శతకాన్ని పూర్తిచేశాడు. కానీ ఇదే ఓవర్లో సూర్య భారీ షాట్‌ ఆడబోయి లాంగాఫ్‌లో షారుక్‌కు క్యాచ్‌ ఇవ్వడంతో 71 పరుగుల మూడో వికెట్‌ భాగస్వామ్యానికి తెరపడింది.రషీద్‌, జాక్స్‌ను బోల్తా కొట్టించగా మరుసటి ఓవర్లో సాయి హార్దిక్‌ను ఔట్‌ చేయడంతో ముంబై ఐదో వికెట్‌ కోల్పోయింది. బౌలింగ్‌ మార్పుగా వచ్చిన కొయెట్జ్‌ తిలక్‌ (7)ను పెవిలియన్‌కు పంపాడు. 

Read Also: Operation Sindoor: ఆపరేషన్ సిందూర్‌ పై స్పందించిన భారత క్రికెటర్లు

#CricketThriller #GTvsMI #ThrillingFinish #WankhedeStadium Ap News in Telugu Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.