📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం

IPL 2025: ఐపీఎల్ లో చరిత్ర సృష్టించిన గుజరాత్ టైటాన్స్

Author Icon By Anusha
Updated: May 7, 2025 • 4:45 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఐపీఎల్ 2025 సీజన్‌లో భాగంగా వాంఖడే వేదికగా హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో ముంబైపై 3 వికెట్ల తేడాతో జీటీ ఉత్కంఠ విజయం సాధించింది. మొదట బ్యాటింగ్‌ చేసిన ముంబై ప్రధాన బ్యాటర్ల వైఫల్యంతో నిర్ణీత ఓవర్లలో 155/8కే పరిమితమైంది. విల్‌ జాక్స్‌ (35 బంతుల్లో 53, 5 ఫోర్లు, 3 సిక్స్‌లు), సూర్యకుమార్‌ యాదవ్‌ (24 బంతుల్లో 35, 5 ఫోర్లు) ఆ జట్టును ఆదుకున్నారు. గుజరాత్‌ బౌలర్లలో సాయి కిషోర్‌ (2/34), గెరాల్డ్‌ కొయెట్జ్‌ (1/10), అర్షద్‌ ఖాన్‌ (1/18), రషీద్‌ ఖాన్‌ (1/21), సిరాజ్‌ (1/29) సమిష్టిగా సత్తాచాటారు. ఆ తర్వాత లక్ష్యఛేదనకు దిగిన గుజరాత్‌ వర్షం అంతరాయం కల్గించే సమయానికి 19 ఓవర్లలో 147/7 స్కోరు చేసింది. కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్‌(43), బట్లర్‌(30) రాణించారు. బుమ్రా (2/19), బౌల్ట్‌(2/22) ఆకట్టుకున్నారు.గుజరాత్‌ విజయానికి 6 బంతుల్లో 15 పరుగులు అవసరం కాగా, కొట్జె(12) ఔటైనా తెవాటియా(11 నాటౌట్‌), అర్షద్‌ఖాన్‌(1 నాటౌట్‌) జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని కట్టబెట్టారు.

ప్రత్యేక

ఈ ఐపీఎల్ సీజన్‌లో గుజరాత్ టైటాన్స్ జట్టు ఆర్సీబీ, సీఎస్కే, ముంబై ఇండియన్స్ జట్లు కూడా ఇప్పటివరకు చేయలేని ఘనతను సాధించింది.గుజరాత్ టైటాన్స్ జట్టు మంచి దూకుడుగా కనిపిస్తోంది. ఇప్పటివరకు ఆడిన 11 మ్యాచ్‌ల్లో గుజరాత్ 8 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. గుజరాత్ జట్టులోని టాప్-3 బ్యాటర్లు కూడా ప్రతి మ్యాచ్‌లోనూ పరుగులు సాధిస్తున్నారు.గుజరాత్ టైటాన్స్ ప్రత్యేక ఘనత సాధించింది. గుజరాత్‌కు చెందిన ముగ్గురు బ్యాటర్లు ఒకే ఐపీఎల్ సీజన్‌లో 500 కంటే ఎక్కువ పరుగులు చేసిన రికార్డును కలిగి ఉన్నారు. ఇప్పటివరకు ఐపీఎల్ చరిత్రలో ఒకే సీజన్‌లో ముగ్గురు ఆటగాళ్లు 500 కంటే ఎక్కువ పరుగులు సాధించడం ఎప్పుడూ చూడలేదు.

అత్యధిక

ఈ ముగ్గురు ఆటగాళ్లలో సాయి సుదర్శన్, కెప్టెన్ శుభ్‌మన్ గిల్, జోస్ బట్లర్ ఉన్నారు. సాయి సుదర్శన్ ఇప్పటివరకు 509 పరుగులు, శుభ్‌మన్ గిల్ 508 పరుగులు, జోస్ బట్లర్ 500 పరుగులు సాధించారు. ఈ సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన టాప్-5 బ్యాటర్లలో ముగ్గురు గుజరాత్ టైటాన్స్‌కు చెందిన వారే కావడం గమనార్హం.శుభ్‌మన్ గిల్ ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 46 బంతుల్లో 43 పరుగులు చేశాడు. దీని కారణంగా శుభ్‌మన్ గిల్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా ఎంపికయ్యాడు. గిల్ కాకుండా జోస్ బట్లర్ 30 పరుగులు చేశాడు.

Read Also :India Pakistan War: ఆపరేషన్ సిందూర్.. ఐపీఎల్ కొనసాగేనా?

#IPL2025 #MIvsGT #PlayerOfTheMatch #ShubmanGill #ShubmanGillInnings Ap News in Telugu Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.