📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం

GT vs MI: గుజరాత్‌పై ముంబై గెలుపు

Author Icon By Anusha
Updated: May 31, 2025 • 1:01 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఐపీఎల్ 2025 సీజన్‌లో భాగంగా, శుక్రవారం జరిగిన ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో ముంబై 20 పరుగుల తేడాతో గుజరాత్‌పై ఉత్కంఠ విజయం సాధించింది.తొలుత రోహిత్‌శర్మ(50 బంతుల్లో 81, 9ఫోర్లు, 4సిక్స్‌లు) అర్ధసెంచరీతో కదంతొక్కగా, బెయిర్‌స్టో(47), సూర్యకుమార్‌(33), తిలక్‌శర్మ(25) రాణించడంతో ముంబై 20 ఓవర్లలో 228/5 స్కోరు చేసింది. ప్రసిద్ధ్‌ కృష్ణ(2/53), సాయికిషోర్‌(2/42) రెండేసి వికెట్లు తీశారు.సాయి సుదర్శన్‌(49 బంతుల్లో 80, 10ఫోర్లు, సిక్స్‌) ఒంటరిపోరాటం చేయగా, సుందర్‌(48) ఆకట్టుకున్నాడు. బౌల్ట్‌ (2/56) రెండు వికెట్లు తీయగా, బుమ్రా, గ్లీసన్‌, సాంట్నర్‌, అశ్వని ఒక్కో వికెట్‌ తీశారు.

కట్టుదిట్టం

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 228 పరుగుల భారీ స్కోర్ చేసింది. అనంతరం గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 208 పరుగులే చేసి ఓటమిపాలైంది. సాయి సుదర్శన్(49 బంతుల్లో 10 ఫోర్లు, సిక్స్‌తో 80), వాషింగ్టన్ సుందర్(24 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లతో 48) పోరాడినా ఫలితం లేకపోయింది. కీలక సమయంలో జస్‌ప్రీత్ బుమ్రా(1/27) కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేసి గుజరాత్ టైటాన్స్‌(Gujarat Titans) ఓటమిని శాసించాడు.ఆఖరి ఓవర్‌లో గుజరాత్ టైటాన్స్ విజయానికి 24 పరుగులు అవసరమయ్యాయి. క్రీజులో సరైన బ్యాటర్లు లేకపోవడం ముంబై బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో గుజరాత్ టైటాన్స్‌కు ఓటమి తప్పలేదు. అయితే ఈ 24 పరుగుల్లో 22 రన్స్‌ను హార్దిక్ పాండ్యా తమ ఆఖరి ఓవర్‌లో సాధించడం గమనార్హం.గెరాల్డ్ కోయిట్జీ వేసిన ఆఖరి ఓవర్‌లో హార్దిక్ పాండ్యా మూడు భారీ సిక్స్‌లతో ఈ పరుగులు రాబట్టాడు. ఈ ఓవర్‌ను కోయిట్జీ కట్టుదిట్టంగా వేసి 12 పరుగులకే పరిమితం చేసి ఉంటే ఫలితం మరోలా ఉండేది.

GT vs MI: గుజరాత్‌పై ముంబై గెలుపు

వ్యక్తిగత స్కోర్

బుమ్రా వల్ల ముంబై ఇండియన్స్(Mumbai Indians) గెలిచినా గెరాల్డ్ కోయిట్జీ చెత్త ప్రదర్శన కారణంగా ఈ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ ఓటమిపాలైంది. పేలవ బౌలింగే కాకుండా 4 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద రోహిత్ శర్మ ఇచ్చిన సునాయస క్యాచ్‌ను కూడా కోయిట్జీ వదిలేసాడు. ఈ అవకాశం అందుకున్న రోహిత్ శర్మ ఏకంగా 81 పరుగులు చేశాడు. కోయిట్జీ ఈ క్యాచ్ పట్టినా ఆఖరి ఓవర్‌ను కట్టుదిట్టంగా బౌలింగ్ చేసినా గుజరాత్ టైటాన్స్ సునాయసంగా విజయం సాధించేది.

Read Also: Gukesh: నార్వే చెస్‌ టోర్నీలో గుకేశ్‌ ఘన విజయం

#Eliminator #GujaratTitans #IPL2025 #MIvsGT #mumbaiindians Ap News in Telugu Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.