📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

IPL 2025: యశస్వి జైశ్వాల్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన పాక్ మాజీ క్రికెటర్ బాసిత్ అలీ

Author Icon By Anusha
Updated: April 11, 2025 • 11:43 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఐపీఎల్ 2025 సీజన్‌లో యువ భారత ఓపెనర్ యశస్వి జైశ్వాల్ తన ఫామ్ కోల్పోవడం అభిమానులను తీవ్రంగా నిరాశపరిచింది. గత రెండు సీజన్లలో అత్యుత్తమ ప్రదర్శనతో మెరిసిన యశస్వి, ఈ సారి మాత్రం తక్కువ స్కోర్లతోనే సరిపెట్టుకుంటున్నాడు, ప్రస్తుతం తను చూపాల్సిన స్థాయిలో ప్రదర్శన ఇవ్వలేక పోతున్నాడు. రాజస్థాన్ రాయల్స్ తరపున ఐపీఎల్ 2025లో తొలి మూడు మ్యాచ్‌ల్లో వరుసగా 1, 29, 4 పరుగులు చేసి నిరాశపరిచిన యశస్వి, నాలుగో మ్యాచ్‌లో 67 పరుగులతో కాస్త పునరాగమనం చేశాడనిపించినా, ఐదో మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ పై మళ్లీ కేవలం 6 పరుగులకే ఔట్ కావడం అతని ఆటతీరు పట్ల సందేహాలు కలిగిస్తోంది.

బాసిత్  స్పందన

టీమిండియా సీనియర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు ఇటీవల అంతర్జాతీయ టీ20ల నుండి రిటైర్మెంట్ ప్రకటించిన విషయం గురించి కూడా బాసిత్ స్పందించారు. “వీరు టీ20 వరల్డ్ కప్ 2024 గెలిచాక రిటైర్ అవ్వడం సరైన నిర్ణయం. భారత్‌లో ఇప్పటికే చాలా మంది ప్రతిభావంతులైన యువ క్రికెటర్లు ఉన్నారు. వారి కోసం ఈ స్థలాలు ఖాళీ అవడం అవసరం. అయితే కోహ్లీ అంత త్వరగా రిటైర్మెంట్ ప్రకటిస్తాడని నేను ఊహించలేదు. అయినా, అది సరైన నిర్ణయమే” అని అన్నారు.

యశస్విపై వ్యాఖ్యలు

అలీ యశస్విపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. “అతడి కడుపు నిండిపోయింది. ఇప్పుడు క్రికెట్‌పై అతనికి ఆసక్తి లేకపోయేలా కనిపిస్తోంది. ఇది నా ఓపెన్ మెసేజ్. ఇప్పుడే అతను మారాలి. లేదంటే, పృథ్వీ షా పరిస్థితి అతనికీ ఎదురవుతుంది. క్రికెట్‌ను ప్రేమించు. ప్యాషన్‌తో ఆడు” అంటూ బాసిత్ గట్టి హెచ్చరికలు చేశారు. ఈ మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

రాజస్థాన్ రాయల్స్ ప్రస్తుత పరిస్థితి కూడా అంతగా మెరుగుగా లేదు. ఇప్పటి వరకు ఐదు మ్యాచ్‌లు ఆడి కేవలం రెండింటిలో మాత్రమే విజయం సాధించింది. ఫలితంగా నాలుగు పాయింట్లతో పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో కొనసాగుతోంది. జట్టులో ఓపెనర్ యశస్వి జైశ్వాల్ ఫామ్ లో లేకపోవడం, టాపార్డర్ విఫలం కావడం జట్టు ఫలితాలపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. అతను తిరిగి ఫామ్‌లోకి రావాలంటే తన ఆటపై, తన దృక్పథంపై మళ్లీ ఆలోచించాల్సిన అవసరం ఉందని క్రికెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఇప్పటికైనా అతను మారకపోతే, ప్రతిభ ఉండీ వెలుగులోకి రాని మరో యువ టాలెంట్‌గా మిగిలిపోతాడని క్రికెట్ వర్గాల్లో చర్చ నడుస్తుంది.

Read Also: RCB : సొంత గ్రౌండులో ఆర్సీబీ చెత్త రికార్డు

#BasitAli #CricketControversy #IPL2025 #IPLNews #PrithviShaw #RajasthanRoyals #YashasviJaiswal Ap News in Telugu Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.