హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ విరాట్ కోహ్లీ లాంటి క్రికెటర్లకు భారత్లో కొదువలేదని పేర్కొన్నారు. వెన్నుతట్టి ప్రోత్సహించాలే కానీ కోహ్లీ వంటి క్రికెటర్లు వెలుగులోకి వస్తారని అన్నారు. మీడియాతో సరదాగా మాట్లాడిన అసద్ తన కాలేజీ రోజుల్లో క్రికెట్ పై ఆసక్తికర అంశాలు పంచుకున్నారు. ‘90వ దశకం తొలినాళ్లలో ఇంటర్ యూనివర్సిటీ టోర్నీలో భాగంగా ఉస్మానియా యూనివర్సిటీ(Osmania University), బెంగళూరు యూనివర్సిటీ మధ్య మ్యాచ్ జరిగింది.అందులో మాజీ క్రికెటర్ వెంకటేశ్ ప్రసాద్ విఫలమైన చోట నేను మీడియం పేసర్గా 79 పరుగులిచ్చి 6 వికెట్లు తీశాను. కానీ ఆ మ్యాచ్లో ఓయూ ఓడిపోయింది. ఆ తర్వాత సౌత్జోన్, అండర్-25, విజ్జి ట్రోఫీ లాంటి టోర్నీలు ఆడాను. 1994లో లా చదివేందుకు లండన్ వెళ్లడంతో క్రికెట్ కెరీర్కు అర్ధాంతరంగా ముగిసింది.భారత క్రికెట్లో పరిస్థితులు చాలా మారాయి.పేద కుటుంబం నుంచి వచ్చిన సిరాజ్ ఇప్పుడు స్టార్ క్రికెటర్(Star cricketer)గా ఎదిగాడు. ప్రతిభకు తగ్గట్లు బీసీసీఐ క్రికెటర్లను ప్రోత్సహించడం మంచి పరిణామం. సరైన ప్రోత్సాహం అందిస్తే కోహ్లీ లాంటి క్రికెటర్లు చాలా మంది వెలుగులోకి వస్తారు.ముఖ్యంగా కోహ్లీ కవర్డ్రైవ్ షాట్ క్లాసిక్’ అని అన్నారు.

మ్యాచ్
ఇకపోతే,టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించడంతో యావత్ క్రికెట్ ప్రపంచం షాక్కు గురైంది.ప్రపంచంలోనే అత్యంత ఫిట్టెస్ట్ క్రికెటర్ అయిన విరాట్ కోహ్లీ మరో 2-3 ఏళ్లు ఆడుతాడని అంతా అనుకున్నారు. కానీ అతను సడెన్గా రిటైర్మెంట్ ప్రకటించి అందర్నీ షాక్కు గురి చేశాడు. విరాట్ కోహ్లీ(Virat Kohli) తన 14 ఏళ్ల టెస్ట్ కెరీర్లో 123 టెస్ట్లు ఆడి 46.85 సగటుతో 9,230 పరుగులు చేశాడు. ఇందులో 30 సెంచరీలు ఉన్నాయి.సుదీర్ఘ ఫార్మాట్లో కోహ్లీ సక్సెస్ఫుల్ టీమిండియా కెప్టెన్. అతని సారథ్యంలో 68 మ్యాచ్లు ఆడిన టీమిండియా 40 మ్యాచ్లు గెలిచింది. 2016-19 మధ్య కాలంలో కోహ్లీ పరుగుల మోత మోగించాడు. ఈ మూడేళ్లలో అతను 43 టెస్ట్ల్లో 66.79 సగటుతో 4,208 రన్స్ చేశాడు. ఆడిన 69 ఇన్నింగ్స్లో 16 శతకాలతో పాటు 10 హాఫ్ సెంచరీలు నమోదు చేశాడు. ఈ కాలంలోనే కోహ్లీ వరల్డ్ నెంబర్ వన్ బ్యాటర్గా కొనసాగాడు.
Read Also: Sports: కోహ్లీ వల్లే టెస్ట్ క్రికెట్కు క్రేజ్: రవి శాస్త్రి