క్రికెట్ ప్రేమికులు ఎన్నో క్షణాల నుండి ఎదురుచూస్తున్న దాయాదుల పోరుకు సమయం ఆసన్నమైంది. రేపు, దుబాయ్ వేదికగా భారత్, పాక్ జట్ల ముఖాముఖీ అవ్వబోతున్నాయి. క్రికెట్ ప్రపంచంలో అత్యంత ఆసక్తికరమైన పోరు భారత్ vs పాక్ మ్యాచ్కు రంగం సిద్ధమైంది. రేపు దుబాయ్ వేదికగా ఈ క్రికెట్ సమరం జరగనుంది. రెండు దేశాల అభిమానులు ఈ మ్యాచ్ను ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

భారత జట్టు తన మొదటి మ్యాచ్లో బంగ్లాదేశ్పై ఘన విజయం సాధించి మంచి ఫామ్లో ఉంది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ మూడు విభాగాల్లోనూ టీమిండియా సమష్టిగా రాణిస్తోంది. రోహిత్ శర్మ సారథ్యంలోని జట్టులో ప్రతి ఆటగాడు తన పాత్రను విజయవంతంగా నిర్వర్తిస్తున్నాడు. ముఖ్యంగా విరాట్ కోహ్లీ, జస్ప్రిత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా లాంటి ఆటగాళ్లు కీలకంగా మారనున్నారు.
ఇక పాక్ జట్టు విషయానికి వస్తే, తమ తొలి మ్యాచ్లో ఓటమిని చవిచూసింది. బ్యాటింగ్, బౌలింగ్ లోపాలతో టీమ్ స్ట్రగుల్ అవుతోంది. కెప్టెన్ బాబర్ అజామ్పై విపరీతమైన ఒత్తిడి ఉంది. పాక్ బౌలర్లు అనుకున్న స్థాయిలో రాణించలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో భారత జట్టును నిలువరించడం పాక్కు పెద్ద సవాలుగా మారనుందని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.
భారత్ vs పాక్ – హైఓల్టేజ్ పోరుకు ముస్తాబు
క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న దాయాదుల పోరుకు సమయం ఆసన్నమైంది. రేపు దుబాయ్ వేదికగా భారత్, పాకిస్థాన్ జట్లు తలపడనుండగా, మ్యాచ్పై ఆసక్తి తారాస్థాయికి చేరుకుంది.
భారత్ ఊపులో – పాక్ ఒత్తిడిలో
భారత జట్టు తొలి మ్యాచ్లో బంగ్లాదేశ్పై విజయం సాధించి మంచి ఊపులో ఉంది తొలి మ్యాచ్లోనే ఓటమిపాలైన పాక్ తీవ్ర ఒత్తిడిలో ఉంది. ఈ తరుణంలో టీమిండియాను నిలువరించడం పాక్కు కష్టతరమని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.
పాకిస్థాన్ పరిమిత ఓవర్ల క్రికెట్లో వెనుకబడిందా?
భారత మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ మాట్లాడుతూ, పరిమిత ఓవర్ల క్రికెట్లో పాకిస్థాన్ పూర్తిగా వెనుకబడింది. మోడ్రన్ క్రికెట్కు తగ్గట్లుగా వారి ఆటతీరును మెరుగుపర్చుకోలేకపోతున్నారు. ముఖ్యంగా ఆ జట్టులోని సీనియర్ ఆటగాళ్లు తమ స్థాయికి తగ్గ ప్రదర్శన ఇవ్వడంలో విఫలమవుతున్నారు అని విశ్లేషించారు. మోడర్న్ డే క్రికెట్ ఆడటంలో ఆ దేశ ఆటగాళ్లు విఫలమవుతున్నారు. ఆ జట్టులోని వారి ఆట ఇంకా ఆందోళనకరంగానే ఉంది. కివీస్తో జరిగిన మ్యాచ్లో వారి ఆటతీరును అందరూ చూశారు. భారత్-పాక్ మ్యాచ్లలో భావోద్వేగం, ఒత్తిడి సహజమే. ఇర్ఫాన్ పఠాన్ అభిప్రాయం ప్రకారం, ఈ ఒత్తిడిని ఎవరైతే సమర్థంగా ఎదుర్కొంటారో వారే విజేతలు అవుతారు. స్వదేశంలో ఇంగ్లండ్తో జరిగిన సిరీస్లో టీమిండియా ఒత్తిడిలోనూ అద్భుతంగా రాణించిందని ఆయన గుర్తుచేశారు.
మహ్మద్ షమీ పవర్పుల్ రీ-ఎంట్రీ
గాయం నుంచి కోలుకుని వచ్చిన మహ్మద్ షమీ తొలి మ్యాచ్లోనే ఐదు వికెట్లు తీసి తన సత్తా చాటాడు. గాయం అనంతరం ప్లేయర్లు తిరిగి బలంగా రావడం సులభం కాదు, పేసర్లు గాయం నుంచి కోలుకుని, కమ్బ్యాక్ చేసి రాణించడం అంత సులువు కాదు. కానీ, షమీ అద్భుతమే చేశాడు. కానీ ఐసీసీ ఈవెంట్లలో షమీ ఎప్పుడూ అదరగొడతాడని ఇర్ఫాన్ ప్రశంసించాడు. గాయం తర్వాత కమ్బ్యాక్ చేసిన మహ్మద్ షమీ తొలి మ్యాచ్లోనే ఐదు వికెట్లతో సత్తాచాటాడు.
భారత ఆల్రౌండర్ల
ప్రస్తుతం టీమిండియా నాణ్యమైన ఆల్రౌండర్లు ఉన్నారు. అక్షర్ పటేల్ బాల్తో పాటు బ్యాట్తోనూ రాణిస్తున్నాడు. జడేజా, హార్దిక్ ఎప్పుడూ నిరాశపరచరు. వారి స్థాయికి తగ్గ ఆటతో ఆకట్టుకోవడంలో ఎప్పుడూ ముందుంటారు. ఓపెనర్ శుభ్మన్ గిల్ భీకరమైన ఫామ్లో ఉన్నాడు. అటు కెప్టెన్ రోహిత్ శర్మ తిరిగి ఫామ్ అందుకోవడం జట్టుకు ప్రయోజనం చేకూరుస్తుంది. రోహిత్, విరాట్ కోహ్లీ రన్స్ కొట్టడం మొదలు పెడితే వారిని ఆపడం ఎవరితరమూ కాదు” అని ఇర్ఫాన్ పఠాన్ చెప్పుకొచ్చాడు.
ఓపెనర్లు రోహిత్-గిల్-కోహ్లీ ప్రాముఖ్యత
శుభ్మన్ గిల్ అత్యుత్తమ ఫామ్లో ఉన్నాడు.
రోహిత్ శర్మ తిరిగి ఫామ్లోకి రావడం జట్టుకు ప్లస్ పాయింట్.
విరాట్ కోహ్లీ భారీ పరుగులు సాధిస్తే, అతన్ని ఆపడం పాక్ బౌలర్లకు కష్టమే.
భారత బ్యాటింగ్ లైనప్కు పాక్ బౌలర్లు సవాల్ విసరగలరా?
బుమ్రా-షమీ పేస్ అటాక్తో పాక్ను కట్టడి చేయగలరా?
ఒత్తిడిని సమర్థంగా ఎదుర్కొని ఎవరు విజేతగా నిలుస్తారు?
రేపటి మ్యాచ్కు ప్రపంచ క్రికెట్ అభిమానులందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు!