📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఐపీఎల్‌ సీజన్లో పొగాకు, ఆల్కాహాల్‌పై నిషేధం విధించండి

Author Icon By Vanipushpa
Updated: March 10, 2025 • 3:14 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆదివారం దుబాయ్‌ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో రోహిత్‌ సేన అద్భుత విజయం సాధించి.. మూడో సారి ఛాంపియన్స్‌ ట్రోఫీని ముద్దాడింది. గతంలో 2000వ సంవత్సరంలో సౌరవ్‌ గంగూలీ కెప్టెన్సీలోని టీమిండియా, శ్రీలంకతో కలిసి ఉమ్మడి విజేతగా నిలిచింది. ఆ తర్వాత 2013లో ధోని కెప్టెన్సీలో భారత జట్టు ఛాంపియన్‌గా నిలిచింది. ఇప్పుడు రోహిత్‌ శర్మ కెప్టెన్సీలో ముచ్చటగా మూడోసారి కప్పు కొట్టింది. ఇక ఛాంపియన్స్‌ ట్రోఫీ ముగియడంతో ఇక క్రికెట్‌ అభిమానుల దృష్టి ఐపీఎల్‌ వైపు మళ్లనుంది. ఈ నెల 22 నుంచి ఐపీఎల్‌ 2025 సీజన్‌ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. భారత క్రికెట్‌ అభిమానులంతా కోరుకున్నట్లు టీమిండియా ఛాంపియన్స్‌ ట్రోఫీ 2025ను కైవసం చేసుకుంది.


మద్యం బ్రాండ్‌లకు ప్రచారం వద్దు
ఈ క్రమంలో కేంద్ర ఆరోగ్య శాఖ ఐపీఎల్‌ కమిటీతో పాటు బీసీసీఐకి ఒక కీలక లేఖ రాసింది. వచ్చే ఐపీఎల్‌ సీజన్లో పొగాకు(టొబాకో), ఆల్కాహాల్‌ ఉత్పత్తులను ఐపీఎల్‌ మ్యాచ్‌ల సందర్భంగా ప్రచారం కల్పించడంపై నిషేధం విధించాలంటూ కోరింది. ఆటగాళ్లు, కామెంటేటర్లు, ఐపీఎల్‌ టీమ్స్‌.. పొగాకు, మద్యం బ్రాండ్‌లకు ప్రచారం కల్పించడం, వాటిని స్పాన్సర్లుగా చేర్చుకోవడం వంటివి బంద్‌ చేయాలని కోరింది. ఈ విషయమై మినిస్ట్రీ ఆఫ్‌ హెల్త్‌ అండ్‌ ఫ్యామిలీ వెల్ఫేర్‌ డైరెక్టర్‌ జనరల్‌ అతుల్‌ గోయల్‌, బీసీసీఐకి, అలాగే ఐపీఎల్‌ ఛైర్మన్‌ అరున్‌ సింగ్‌ ధుమల్‌లకు లేక రాశారు. దేశంలో చాలా మంది టొబాకో, మద్యం వల్ల ప్రాణాలు కోల్పోతున్నారని ఈ లేఖలో అతుల్‌ గోయల్‌ పేర్కొన్నారు. ప్రాణాంతక వ్యాధులైన క్యాన్సర్‌లో గుండె సంబంధ, క్యాన్సర్, దీర్ఘకాలిక ఊపిరితిత్తుల వ్యాధి, మధుమేహం, రక్తపోటు వంటి ఎన్‌సీడీ (నాన్-కమ్యూనికబుల్ డిసీజెస్‌) పెరుగుల స్థాయిని కూడా లేఖలో ప్రస్తావించారు.
చట్టాలకు అనుగుణంగా..
మన దేశంలో వార్షిక మరణాలలో 70 శాతం ఎక్కువ మరణాలు వీటి కారణంగానే సంభవిస్తున్నాయని ఆయన వెల్లడించారు. పొగాకు, మద్యం వాడకం ఎన్‌సీడీలకు కీలకమైన ప్రమాద కారకాలు. ప్రపంచవ్యాప్తంగా పొగాకు సంబంధిత మరణాలలో భారతదేశం రెండవ స్థానంలో ఉంది, ప్రతి సంవత్సరం దాదాపు 14 లక్షల మరణాలు సంభవిస్తున్నాయి. భారతదేశంలో ఆల్కహాల్ ఎక్కువగా ఉపయోగించే సైకోయాక్టివ్ పదార్థంగా మిగిలిపోయింది అని గోయెల్ పేర్కొన్నారు. ప్రస్తుత ఆరోగ్య విధానాలు, చట్టాలకు అనుగుణంగా పొగాకు, మద్యం ప్రకటనలను ఐపీఎల్‌ కమిటీ కచ్చితంగా నియంత్రించాలని కోరారు. మరి దీనిపై ఐపీఎల్‌ కమిటీ, బీసీసీఐ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. టీమిండియా మరోసారి ఛాంపియన్స్ ట్రోఫీని కైవసం చేసుకోవడం భారత క్రికెట్ చరిత్రలో మైలురాయి. ఇక ఐపీఎల్ 2025 కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే కేంద్ర ఆరోగ్య శాఖ కొత్త నిషేధంతో ఐపీఎల్ స్పాన్సర్‌షిప్ పై ప్రభావం పడే అవకాశం ఉంది. బీసీసీఐ, ఐపీఎల్ కమిటీ దీనిపై ఎలా స్పందిస్తాయో చూడాలి.

#telugu News Ap News in Telugu Ban tobacco and alcohol Breaking News in Telugu Google News in Telugu IPL season Latest News in Telugu Paper Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.