ఐపీఎల్ 2025 సీజన్లో బుధవారం (ఏప్రిల్ 16) జరిగిన ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరిగింది.తొలి సూపర్ ఓవర్ పోరులో రాజస్థాన్పై ఢిల్లీ ఉత్కంఠ విజయం సాధించింది. ఢిల్లీ నిర్దేశించిన 189 పరుగుల లక్ష్యఛేదనలో రాజస్థాన్ 20 ఓవర్లలో 188/4 స్కోరు చేసింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్(37 బంతుల్లో 51, 3ఫోర్లు, 4సిక్స్లు), నితీశ్రానా(28 బంతుల్లో 51, 6ఫోర్లు, 2సిక్స్లు) అర్ధసెంచరీలతో విజృంభించారు. వీరిద్దరు ఢిల్లీ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ భారీ షాట్లతో విరుచుకుపడ్డారు. ఆఖర్లో ధృవ్ జురెల్(17 బంతుల్లో 26, 2సిక్స్లు), హెట్మైర్(9 బంతుల్లో 15 నాటౌట్, ఫోర్) జట్టును గెలిపించేందుకు చేసిన ప్రయత్నం నెరవేరలేదు. స్టార్క్, అక్షర్, కుల్దీప్ ఒక్కో వికెట్ తీశారు. మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ అభిషేక్ పొరెల్ (37 బంతుల్లో 49, 5 ఫోర్లు, 1 సిక్స్), కేఎల్ రాహుల్ (32 బంతుల్లో 38, 2 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించడంతో 20 ఓవర్లలో 188/5 స్కోరు చేసింది. ఆర్చర్(2/32)కు రెండు వికెట్లు దక్కాయి.సూపర్ ఓవర్లో అద్భుతంగా బౌలింగ్ చేసి ఢిల్లీ విజయంలో కీలక పాత్ర పోషించాడు మిచెల్ స్టార్క్.
భారీ సిక్స్
రాయల్స్ ఇన్నింగ్స్ సైతం వేగంగానే ప్రారంభమైంది. శాంసన్ (19 బంతుల్లో 31 రిటైర్డ్ హర్ట్, 2 ఫోర్లు, 3 సిక్సర్లు), జైస్వాల్ దూకుడుగా ఆడారు. ఈ ఇద్దరూ ఇంప్యాక్ట్ ప్లేయర్గా వచ్చిన ముకేశ్ కుమార్ను లక్ష్యంగా చేసుకుని భారీ షాట్లు ఆడారు. ముకేశ్ రెండో ఓవర్లో ఇద్దరూ తలా ఓ సిక్సర్ కొట్టారు. స్టార్క్ 3వ ఓవర్లో జైసాల్.. 4, 6, 4తో 19 రన్స్ రాబట్టాడు. పేసర్లతో లాభం లేదని అక్షర్ స్పిన్నర్ విప్రాజ్కు బంతినివ్వగా శాంసన్ ఓ ఫోర్, సిక్సర్తో అతడికి స్వాగతం పలికాడు. కానీ అదే ఓవర్లో కట్ షాట్ ఆడే క్రమంలో పక్కటెముకలు పట్టేయడంతో అతడు రిటైర్డ్ హర్ట్గా వెనుదిరిగాడు. శాంసన్ స్థానంలో వచ్చిన పరాగ్ (8) నిరాశపరిచాడు. 34 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తిచేసిన జైస్వాల్ను కుల్దీప్ ఔట్ చేశాడు. అప్పటికే క్రీజులో కుదురుకున్న రానా అక్షర్పటేల్ను లక్ష్యంగా చేసుకుంటూ 15వ ఓవర్లో ఓ భారీ సిక్స్కు తోడు రెండు ఫోర్లతో అరుసుకున్నాడు. అయితే రానా నిష్క్రమణతో రాయల్స్ ఇన్నింగ్స్ గాడి తప్పింది. స్టార్క్ వేసిన ఆఖరి ఓవర్లో విజయానికి 9 పరుగులు అవసరం కాగా జురెల్ వికెట్ కోల్పోయిన రాజస్థాన్ 8 పరుగులకే పరిమితమైంది. దీంతో మ్యాచ్ సూపర్ ఓవర్కు దారితీసింది.

గెలవడం
ఢిల్లీ క్యాపిటల్స్ విజయం పై స్పందించిన అక్షర్ పటేల్, ఓటమి తప్పదనుకున్న మ్యాచ్లో గెలవడం సంతోషంగా ఉందని చెప్పాడు.’అంతా బాగుంది. ముగింపు అదిరింది. మాకు దక్కిన ఆరంభం పవర్ ప్లేలో మేం ధారళంగా పరుగులివ్వడంతో మేం కాస్త దూకుడుగా బ్యాటింగ్ చేయాల్సిందని నేను భావించా. కానీ టైమ్ ఔట్లో కేఎల్ రాహుల్, పోరెల్ పిచ్ బ్యాటింగ్కు కఠినంగా ఉందని చెప్పారు. 12, 13వ ఓవర్లో మాకు మూమెంటమ్ లభించింది. చివరికి మేం మంచి లక్ష్యాన్ని ప్రత్యర్థి ముందు ఉంచాం. వికెట్ కాస్త స్టిక్కీగా ఉంది. కొత్త బ్యాటర్లకు వేగంగా పరుగులు చేయడం కష్టమైంది.రాజస్థాన్ పవర్ ప్లేలో వేగంగా పరుగులు చేసింది. దాంతో మాలో కాస్త ఆందోళన నెలకొంది. మేం వెంటనే టైమ్ ఔట్ తీసుకున్నాం. మా వాళ్లకు ఒక్కటే చెప్పా. ఈ లక్ష్యాన్ని చేధించడం వారికి అంత సులువు కాదు. బౌండరీలు కొట్టడం చాలా కష్టం. కాబట్టి మనం మనమీద నమ్మకం ఉంచి వికెట్ తీసే ప్రయత్నం చేయాలి. నేను చెప్పినట్లుగానే సెట్ బ్యాటర్లు ఔటైన తర్వాత మాకు కొన్ని వికెట్లు దక్కాయి. కొత్త బ్యాటర్లు కంగారు పడ్డారు. వేగంగా పరుగులు చేయాలనే ఆలోచనతో మూల్యం చెల్లించుకున్నారని తెలిపారు.
Read Also: IPL 2025: ఇలాంటి మ్యాచ్లు ఐపీఎల్లో అవసరం లేదు :రికీ పాంటింగ్