📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

టీ20 టీమిండియాదే టీ20ల్లో రికార్డు సృష్టించిన ఆల్ రౌండర్ నేడు శ్రీలంకతో, భారత మహిళల జట్టు 5వ T20 టీ20ల్లో హర్మన్, షెఫాలీ రికార్డులు తిరువనంతపురంలో నేడు 3వ T20 షెఫాలీ వర్మ అరుదైన రికార్డు నేటి నుంచి విజయ్ హజారే ట్రోఫీ ప్రారంభం నేడు విశాఖలో ఉమెన్స్ రెండో టీ20 శ్రీలంకపై టీమిండియా ఘనవిజయం నేడు T20 ప్రపంచ కప్ టీం ప్రకటన టీ20 టీమిండియాదే టీ20ల్లో రికార్డు సృష్టించిన ఆల్ రౌండర్ నేడు శ్రీలంకతో, భారత మహిళల జట్టు 5వ T20 టీ20ల్లో హర్మన్, షెఫాలీ రికార్డులు తిరువనంతపురంలో నేడు 3వ T20 షెఫాలీ వర్మ అరుదైన రికార్డు నేటి నుంచి విజయ్ హజారే ట్రోఫీ ప్రారంభం నేడు విశాఖలో ఉమెన్స్ రెండో టీ20 శ్రీలంకపై టీమిండియా ఘనవిజయం నేడు T20 ప్రపంచ కప్ టీం ప్రకటన

Ambati Rayudu: ట్రోలింగ్​పై స్పందించిన అంబటి రాయుడు

Author Icon By Anusha
Updated: April 10, 2025 • 4:40 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తాను చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో ఫుల్ ట్రోల్స్ వచ్చాయి. తాజాగా తనపై వచ్చిన విమర్శలకు రాయుడు స్పందించాడు. తాను ఎప్పటికీ ధోనీ అభిమానినే అని చెప్పాడు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ షేర్ చేశాడు.నేను తల (ధోనీ) ఫ్యాన్. ఎప్పటికీ తలా అభిమానినే. ఎవరేమి అనుకున్నా పర్వాలేదు. దాంట్లో వన్ పర్సెంట్ కూడా మార్పు ఉండదు. నాపై నెగిటివిటీ కోసం పీఆర్​లపై డబ్బులు వృథాగా ఖర్చు చేయకండి. ఏదైనా ఛారిటీకి విరాళంగా ఇస్తే, పేద ప్రజలకైనా ఉపయోగం ఉంటుంది’ అని రాయుడు ట్వీట్​లో రాసుకొచ్చాడు.

రాయుడు – నవజ్యోత్ సింగ్ సిధ్దూ సంభాషణ

రీసెంట్ గా జరిగిన మ్యాచులో పంజాబ్ కింగ్స్‌పై చెన్నై సూపర్ కింగ్స్ ఓటమి చెందింది. అప్పుడు కామెంటరీ బాక్స్‌లో ఉన్న అంబటి రాయుడు – నవజ్యోత్ సింగ్ సిధ్దూ మధ్య జరిగిన ఓ సంభాషణ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ మ్యాచులో ధోనీ 16వ ఓవర్ చివర్లో బ్యాటింగ్‌కు వచ్చినప్పుడు, గ్యాలరీ మొత్తం “ధోనీ ధోనీ” అంటూ మార్మోగింది. అప్పుడు సిధ్దూ మాట్లాడుతూ “ధోనీ మెట్లపై నుంచి వేగంగా దిగుతున్నాడు. అతడిలో ఉన్న కసి ఆ దూకుడుగా దిగడంలోనే కనిపిస్తోంది ” అని అన్నాడు. అప్పుడు రాయుడు వెంటనే “ధోనీ బ్యాట్‌తో కాదు, ఖడ్గంతో దిగుతున్నాడు. ఇవాళ రాత్రి ఊచకోతే.” అంటూ బదులిచ్చాడు. మళ్లీ “ధోనీ క్రికెట్ ఆడటానికి కాదు, యుద్ధనికి వస్తున్నట్టుగా ఉంది” అని కూడా అన్నాడు. ఇంకా మహీ గురించి పలు వ్యాఖ్యలు కూడా చేశాడు. అయితే ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో మరో రకంగా ప్రచారమయ్యాయి. అంబటి రాయుడు సెటైరికల్ గా మాట్లాడినట్లు పలువురు అభిప్రాయపడ్డారు.అయితే ఇటీవల కాలంలో రాయుడు తన వ్యాఖ్యలతో కాంట్రవర్సీల్లో చిక్కుకుంటున్నాడు. కామెంటరీ చేస్తూ ఎల్లప్పుడూ ధోనీ గురించే మాట్లాడడం, ధోనీని జపించడం వల్ల నెటిజన్లకు రాయుడు టార్గెట్ అవుతున్నాడని టాక్.

కెరీర్‌కు గుడ్‌ బై

అంబటి రాయుడు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మోస్ట్ అండర్ రేటెడ్ బ్యాటర్‌గా పేరొందిన అంబటి రాయుడు ఐపీఎల్‌లో తన సత్తా చాటాడు. ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఎన్నో మ్యాచ్‌లను ఒంటిచేత్తో గెలిపించాడు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఆరు ఐపీఎల్ ట్రోఫీలను గెలిచిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు.ఐపీఎల్ 2023లో సీఎస్కే టైటిల్ అందుకున్న తర్వాత రాయుడు తన క్రికెట్ కెరీర్‌కు గుడ్‌ బై చెప్పాడు.రిటైర్మెంట్ తర్వాత అంబటి రాయుడు క్రికెట్‌లో ట్రోల్ మెటీరియల్‌గా మారాడు. ఐపీఎల్ 2025లో కామెంటేటర్‌ అవతారమెత్తిన అంబటి రాయుడు ధోనీ నామస్మరణలో మునిగిపోయాడు. జట్టుతో సంబంధం లేకుండా ధోనీ జపంతోనే కామెంట్రీ మొత్తాన్ని నడిపిస్తుండటంతో నెటిజన్లు మీమ్స్, ట్రోల్స్‌తో రాయుడిని టార్గె్ట్ చేశారు.

Read Also: IPL 2025: ఐపీఎల్ ప్లేఆఫ్స్ చేరుకోవడానికి ఎన్ని పాయింట్లు అవసరమో తెలుసా?

#AmbatiRayudu #CricketCommentary #IPL2025 #MSDhoni #RayuduResponds #SocialMediaBuzz Ap News in Telugu Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.