భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ ఇప్పుడు ముగింపు దశకు చేరుకుంది.ఇప్పుడు శనివారం జరగబోయే చివరి టీ20 మ్యాచ్లో కూడా విజయం సాధించి, సిరీస్ను 4-1 తేడాతో ఘనంగా ముగించాలని భారత జట్టు లక్ష్యంగా పెట్టుకుంది. మరోవైపు న్యూజిలాండ్ మాత్రం చివరి మ్యాచ్లో గెలిచి పరువు కాపాడుకోవాలని భావిస్తోంది.అయితే, అందరి దృష్టీ మాత్రం కేరళ కుర్రాడు, హోం గ్రౌండ్లో బరిలోకి దిగుతున్న సంజూ శాంసన్ (Sanju Samson) పైనే కేంద్రీకృతమై ఉంది. ఈ సిరీస్లో ఇప్పటివరకు దారుణంగా విఫలమైన సంజూకి, తనను తాను నిరూపించుకోవడానికి ఇది సువర్ణావకాశం.
Read Also: Thiruvananthapuram: పద్మనాభస్వామి ఆలయాన్ని సందర్శించిన భారత క్రికెటర్లు
ఈ మ్యాచ్ సంజూ కెరీర్కు అత్యంత కీలకం
తిరువనంతపురంలోని గ్రీన్ఫీల్డ్ స్టేడియం ఈ ఆసక్తికర పోరుకు వేదిక కానుంది.శుభ్మన్ గిల్పై వేటు వేయడంతో ఓపెనర్గా ప్రమోషన్ పొందిన సంజూ శాంసన్ (Sanju Samson) , ఈ సిరీస్లో వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోలేకపోయాడు. ఆడిన నాలుగు ఇన్నింగ్స్లలో కలిపి కేవలం 40 పరుగులు మాత్రమే చేసి తీవ్రంగా నిరాశపరిచాడు. సొంత ప్రేక్షకుల మధ్య ఆడుతున్న ఈ మ్యాచ్లోనైనా భారీ స్కోరు సాధించి,
తనపై వస్తున్న విమర్శలకు సమాధానం చెప్పాలని అతను పట్టుదలగా ఉన్నాడు. మరోవైపు, ఫిబ్రవరి 7 నుంచి టీ20 ప్రపంచకప్ ప్రారంభం కానున్న నేపథ్యంలో, ఈ మ్యాచ్లో రాణించడం సంజూ కెరీర్కు అత్యంత కీలకం కానుంది. తుది జట్టులో తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవాలంటే ఈ మ్యాచ్లో అతను తప్పక రాణించాల్సి ఉంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: