ముంబై ఇండియన్స్కు ఒకప్పుడు కెప్టెన్గా ఐదు ట్రోఫీలు అందించిన రోహిత్ శర్మ, ప్రస్తుతం కేవలం ఓ ఆటగాడిగా మాత్రమే కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఐపీఎల్ 2024 సీజన్ ముందు గుజరాత్ టైటాన్స్ నుంచి ముంబై ఇండియన్స్లోకి వచ్చిన హార్దిక్ పాండ్యాకు ముంబై మేనేజ్మెంట్ కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించడంతో, రోహిత్ను పక్కన పెట్టడం కొంత వివాదాస్పదమైంది. అయితే ఈ సీజన్లోకి వచ్చేసరికి ముంబై ఫ్యాన్స్ కూడా పాండ్యాను కెప్టెన్గా అంగీకరించారు. ఈ నేపథ్యంలో, రోహిత్ శర్మ తన భవిష్యత్ ప్రణాళికల గురించి, జట్టులో జరిగిన మార్పుల గురించి తాజాగా మాట్లాడారు.
టీమ్లో మారిన పరిస్థితులు
టీమ్లోకి నేను వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు పరిస్థితులు స్పష్టంగా మారిపోయాయి. గతంలో నేను మిడిల్ ఆర్డర్లో బ్యాటింగ్ చేసేవాడిని, ఇప్పుడు ఓపెనర్గా ఆడుతున్నాను. గతంలో నేను కెప్టెన్ని, ఇప్పుడు కాదు. నాతో కలిసి ఆడిన వారు కొందరు ఇప్పుడు కోచ్లుగా మారారు. ఎన్ని మారిన మైండ్సెట్ అలానే ఉంది. ఈ టీమ్ కోసం నేను చేయాలనుకుంటున్నది మారలేదు. మ్యాచ్లు గెలవడం, ముంబైకి ట్రోఫీ అందించడం ఇదే నాకు ముఖ్యం. ఎంఐలో ట్రెంట్ బౌల్ట్ లాంటి ఎక్స్పీరియన్డ్స్ ప్లేయర్లు ఉన్నారు. న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ సాంట్నర్ ఉన్నాడు, ఎక్స్పీరియన్స్, క్లాస్ రెండు అతని వద్ద ఉన్నాయి. విల్ జాక్స్, రీస్ టోప్లీ వంటి ఆటగాళ్ళలో టీమ్ వైవిధ్యం కనిపిస్తోంది.
యంగ్ టాలెంటెడ్
టీమ్లో చాలామంది యంగ్ ఇండియన్ టాలెంటెడ్ ప్లేయర్లు ఉన్నారు.ర్యాన్ రికెల్టన్ లాంటి యంగ్ టాలెంటెడ్ ప్లేయర్ ఉన్నాడు. ఇలా టీమ్లోని ప్రతి ఆటగాడు ఏదో ఒక విధంగా జట్టుకు ఉపయోగపడుతున్నారు. వారితో కలిసి మరింత క్రికెట్ ఆడేందుకు ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నాను. ప్రస్తుతం నా టార్గెట్ ఒక్కటే టాటా ఐపిఎల్ ట్రోఫీని గెలుచుకోవడం, ముంబై ఇండియన్స్కు కీర్తిని తిరిగి తీసుకురావడం ముఖ్యం అంటూ రోహిత్ శర్మ పేర్కొన్నాడు. కాగా ఈ సీజన్లో ముంబై ఇండియన్స్ తమ తొలి మూడు మ్యాచ్ల్లో ఒక్కటి మాత్రమే గెలిచింది. ఇలాంటి స్టార్ట్ ముంబైకి కొత్తేమి కాదు. పలు సీజన్స్లో వరుస ఓటములు ఎదురైన తర్వాత కూడా ముంబై ఇండియన్స్ ట్రోఫీని కైవసం చేసుకుంది.
రోహిత్ గతంలో ముంబై ఇండియన్స్కు ఎన్నో విజయాలు అందించాడు, ఐదు టైటిళ్లు అందించడంలో కీలక పాత్ర పోషించాడు. కానీ, ప్రస్తుతం ఫామ్ కోల్పోవడం, కెప్టెన్సీ కోల్పోవడం, ఆ తర్వాత కూడా తక్కువ పరుగులతో జట్టుకు లబ్ధి చేకూర్చలేకపోవడం, అభిమానుల్లో అసంతృప్తి నెలకొంది.రోహిత్ శర్మ ఫామ్ గురించి చర్చించుకుంటున్నా, ఐ పిఎల్ 2025 సీజన్లో ముంబై ఇండియన్స్ జట్టు మాత్రం తమ మూడో మ్యాచ్లో అద్భుత ప్రదర్శన ఇచ్చింది. కేకేఆర్ 16.2 ఓవర్లలో 116 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ముంబై బౌలర్లు గట్టి దెబ్బ కొట్టారు. ముఖ్యంగా అశ్విని కుమార్ 4 వికెట్లు, దీపక్ చాహర్ 2 వికెట్లు తీసి కోల్కతా బ్యాటింగ్ లైనప్ను తుడిచిపెట్టేశారు.