రాజ్యసభ ఆమోదం పొందిన వక్ఫ్‌ సవరణ బిల్లు నివేదిక

రాజ్యసభ ఆమోదం పొందిన వక్ఫ్‌ సవరణ బిల్లు నివేదిక

వక్ఫ్‌ సవరణ బిల్లు-2024’పై అధ్యయనం చేసిన సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) తన నివేదికను కేంద్ర ప్రభుత్వం రాజ్యసభలో ప్రవేశపెట్టింది. ఈ నివేదికను జేపీసీ చైర్మన్‌గా వ్యవహరించిన జగదంబికా పాల్, బీజేపీ ఎంపీ సంజయ్‌ తదితరులు సభలో ప్రవేశపెట్టారు. ఈ ముసాయిదా బిల్లుపై తమ నివేదికను హిందీ, ఇంగ్లీష్‌ భాషల్లో సభ ముందుకు తీసుకొచ్చారు.

Advertisements
Waqf Bill Lok Sabha Minister Kiren Rijiju 1723108169130 1723113246998

విపక్షాల నిరసన:
రాజ్యసభ ఎంపీ మేధా కులకర్ణి ఈ నివేదికను సభలో ప్రవేశపెట్టారు. దీనిపై విపక్ష పార్టీల ఎంపీలు నిరసన తెలిపారు. వారు తమ డిస్సెంట్ ‌(అసమ్మతి) నోట్‌ను తొలగించినట్లు ఆరోపించారు. బిల్లు ప్రవేశపెట్టడాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ సభ్యుడు కేసీ వేణుగోపాల్ నోటీసు ఇచ్చారు. దేశంలో మతస్వేచ్చాను మోదీ ప్రభుత్వం కాలరాస్తోందని మండిపడ్డారు. అనంతరం విపక్ష సభ్యులు డీఎంకే ఎంపీ కనిమొళి కాంగ్రెస్ సభ్యుడు సుదీప్ బందోపాధ్యాయ ఇండియన్ముయూనియన్ ముస్లిం ఎంపీ బషీర్ బిల్లును వ్యతరేకించారు.ఇది రాజ్యాంగ విరుద్ధం అని చెప్పారు. దీంతో సభలో గందరగోళం నెలకొంది. చైర్మన్‌ జగదీప్‌ ధన్‌ఖర్‌ 20 నిమిషాల పాటు సభను వాయిదా వేశారు.

నివేదికలో ప్రధాన సవరణలు:

ముస్లిం ఓబీసీ సభ్యుల నియామకం: రాష్ట్ర వక్ఫ్‌ బోర్డులలో ముస్లిం ఓబీసీ వర్గానికి చెందిన ఒక సభ్యుడు ఉంటారు.ఇది ముస్లిం సమాజం రాజ్యాంగ హక్కులపై దాడిగా, వక్ఫ్‌ బోర్డుల నిర్వహణలో జోక్యంగా ప్రతిపక్ష సభ్యులు అభివర్ణించారు.
ప్రత్యేక వక్ఫ్‌ బోర్డులు: రాష్ట్ర ప్రభుత్వాలు అఘాఖానీ, బొహ్రా వర్గాలకు ప్రత్యేక వక్ఫ్‌ బోర్డులను ఏర్పాటు చేసే నిబంధనలు కూడా సవరణలలో ఉన్నాయి.
వక్ఫ్‌ అలాల్‌ ఔలాద్ (కుటుంబ వక్ఫ్‌లు): మహిళల వారసత్వ హక్కులను రాష్ట్ర ప్రభుత్వాలు పరిరక్షించే నిబంధనలు.

ముసాయిదా బిల్లు ఆమోదం:
జనవరి 29న ముసాయిదా నివేదికను సంయుక్త పార్లమెంటరీ కమిటీ ఆమోదించింది. 15-11 మెజారిటీతో ఈ నివేదిక ఆమోదించబడింది. కమిటీ ఆమోదించిన సవరణలను బీజేపీ సభ్యులు సూచించిన 14 సవరణలను కమిటీ ఆమోదించింది. అయితే కాంగ్రెస్‌, డీఎంకే, టీఎంసీ, ఆప్‌, శివసేన(యూబీటీ), ఏఐఎంఐఎంతోసహా ప్రతిపక్ష సభ్యులు సూచించిన ప్రతి మార్పును కమిటీ తిరస్కరించింది. ఈ నివేదికపై ప్రతిపక్ష సభ్యులు తమ డిస్సెంట్‌(అసమ్మతి) నోట్‌ను సమర్పించారు. గత ఏడాది ఆగస్టులో లోక్‌సభలో ప్రవేశపెట్టిన ఈ బిల్లు ఉద్దేశం వక్ఫ్‌ ఆస్తుల నిర్వహణలో ఆధునికతను, పారదర్శకతను, జవాబుదారీతనాన్ని తీసుకురావడమని బీజేపీ సభ్యులు వాదించగా, ఇది ముస్లిం సమాజం రాజ్యాంగ హక్కులపై దాడిగా, వక్ఫ్‌ బోర్డుల నిర్వహణలో జోక్యంగా ప్రతిపక్ష సభ్యులు అభివర్ణించారు.

Related Posts
Barath Gourav: 21 నుంచి కాజిపేట జంక్షన్ నుండి భారత్ గౌరవ్ స్పెషల్ ట్రైన్
Barath Gourav: కాజీపేట నుండి భారత్ గౌరవ్ ప్రత్యేక రైలు – ప్రయాణికులకు గుడ్ న్యూస్

భక్తులకు విశేష అవకాశం కల్పించింది దక్షిణ మధ్య రైల్వే. దేశంలోని ప్రధాన పుణ్యక్షేత్రాలను దర్శించేందుకు భక్తులకు ఒక ప్రత్యేక యాత్రను ప్రకటించింది. భారత్ గౌరవ్ స్పెషల్ టూరిస్ట్ Read more

కొత్త కఠిన చట్టాలు నేరాలను ఆపలేవు: డీవై చంద్రచూడ్
కొత్త కఠిన చట్టాలు నేరాలను ఆపలేవు: డీవై చంద్రచూడ్

మహారాష్ట్రలోని పూణే నగరంలో ఇటీవల ఓ 26 ఏళ్ల యువతిపై పోలీస్ స్టేషన్‌కు కూత వేటు దూరంలోనే బస్సులో అత్యాచారం జరగడం.. మహారాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర ఆగ్రహావేశాలకు Read more

మతపరమైన పోస్టు: కాంగ్రెస్ ఎంపీపై కేసు
మతపరమైన పోస్టు కాంగ్రెస్ ఎంపీపై కేసు

గుజరాత్‌లోని జామ్నగర్‌లో జరిగిన సామూహిక వివాహ కార్యక్రమానికి హాజరైన కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ ఇమ్రాన్ ప్రతాప్గఢీపై, రెచ్చగొట్టే పాటతో ఎడిట్ చేసిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ Read more

Maoists : మావోయిస్టులకు మరో భారీ దెబ్బ
Maoists మావోయిస్టులకు మరో గట్టి దెబ్బ

మావోయిస్టులకు మరోసారి భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఇంతకుముందు ఎన్‌కౌంటర్లలో క్యాడర్‌ను కోల్పోయిన మావోయిస్టులు ఇప్పుడు చత్తీస్‌గఢ్ రాష్ట్రంలో మరిన్ని నష్టాలను ఎదుర్కొన్నారు. బీజాపూర్ జిల్లాలో 50 మంది Read more

Advertisements
×