ఐపీఎల్ 2025లో భాగంగా, గురువారం రాజస్థాన్ రాయల్స్తో హోరాహోరీగా జరిగిన హైస్కోరింగ్ థ్రిల్లర్లో బెంగళూరు ప్రత్యర్థిని 11 పరుగుల తేడాతో ఓడించింది. ఈ సీజన్లో ప్రత్యర్థులను వారి సొంతగడ్డపై మట్టికరిపిస్తున్న బెంగళూరు చిన్నస్వామిలో హ్యాట్రిక్ ఓటముల తర్వాత తొలి విజయాన్ని నమోదు చేసింది.206 పరుగుల భారీ ఛేదనలో రాజస్థాన్ 194/9 వద్దే ఆగిపోయింది. యశస్వి జైస్వాల్ (19 బంతుల్లో 49, 7 ఫోర్లు, 3 సిక్సర్లు), ధ్రువ్ జురెల్ (34 బంతుల్లో 47, 3 ఫోర్లు, 3 సిక్సర్లు) పోరాడినా ఆఖర్లో తడబడ్డ రాజస్థాన్కు మరో అపజయం తప్పలేదు. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన బెంగళూరు విరాట్ కోహ్లీ (42 బంతుల్లో 70, 8 ఫోర్లు, 2 సిక్సర్లు), దేవ్దత్ పడిక్కల్ (27 బంతుల్లో 50, 4 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ధ శతకాలతో చెలరేగడంతో ఆ జట్టు నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 205/5 పరుగుల భారీ స్కోరు సాధించింది.
బౌలర్లపై
సొంతగడ్డపై ఆడిన గత మూడు మ్యాచ్లతో పోలిస్తే ఈ మ్యాచ్లో బెంగళూరు బ్యాటింగ్ మెరుగైంది. దూకుడు మీదున్న ఓపెనింగ్ ద్వయం ఫిల్ సాల్ట్ (26), కోహ్లీ ఆరంభం నుంచే రాజస్థాన్ బౌలర్లపై ఎదురుదాడికి దిగింది. తొలి వికెట్కు ఈ ఇద్దరూ 6.4 ఓవర్లలోనే 61 పరుగులు జోడించి బెంగళూరుకు శుభారంభం అందించారు. ఆర్చర్ మొదటి ఓవర్లో కోహ్లీ బౌండరీతో పరుగుల వేటకు శ్రీకారం చుట్టి అతడే వేసిన మూడో ఓవర్లోనూ ఫైన్లెగ్, స్కేర్ లెగ్ దిశగా ఫోర్లు కొట్టాడు.తుషార్ 5వ ఓవర్లో సాల్ట్ రెండు బౌండరీలు రాబట్టాడు. పవర్ ప్లే తర్వాత బంతినందుకున్న హసరంగ తన తొలి ఓవర్లోనే సాల్ట్ను ఔట్ చేయడంతో బెంగళూరు తొలి వికెట్ కోల్పోయింది. సాల్ట్ నిష్క్రమించినా అతడి స్థానంలో వచ్చిన పడిక్కల్తో కలిసి కోహ్లీ బెంగళూరు ఇన్నింగ్స్ను నడిపించాడు. సందీప్ 12వ ఓవర్లో రెండు ఫోర్లతో కోహ్లీ ఈ సీజన్లో ఐదో అర్ధ శతకాన్ని నమోదు చేశాడు.తుషార్ 15వ ఓవర్లో పడిక్కల్ రెండు భారీ సిక్సర్లతో ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు. ఇదే ఓవర్లో కోహ్లీ కూడా ఓ సిక్సర్ బాదడంతో బెంగళూరు ఖాతాలో 22 పరుగులు చేరాయి. ఆర్చర్ 16వ ఓవర్లో కోహ్లీ నితీశ్కు క్యాచ్ ఇవ్వడంతో 95 పరుగుల రెండో వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. సందీప్ ఒకటే ఓవర్లో పడిక్కల్, పటీదార్ (1)ను ఔట్ చేసినా ఆఖర్లో టిమ్ డేవిడ్ (23), జితేశ్ శర్మ (20 నాటౌట్) మెరుపులతో బెంగళూరు స్కోరు 200 పరుగులు దాటింది.

రాజస్థాన్
9 ఓవర్లకే వంద పరుగుల మార్కును దాటిన రాజస్థాన్ స్పిన్నర్ల రాకతో తడబడింది. పది బంతుల్లోనే రెండు ఫోర్లు, రెండు సిక్సర్లతో జోరు మీద కపిపించిన సారథి రియాన్ పరాగ్ (22)ను కృనాల్ పదో ఓవర్లో ఫస్ట్బాల్కే బోల్తా కొట్టించాడు. సుయాశ్ వికెట్లేమీ తీయకపోయినా పరుగులను కట్టడి చేశాడు. కృనాల్ 14వ ఓవర్లో నితీశ్నూ ఔట్ చేయడంతో రాజస్థాన్ కష్టాల్లో పడింది.
Read Also: RCB : హోంగ్రౌండులో RCB విక్టరీ