రాష్ట్రవ్యాప్తంగా కొత్త రేషన్ కార్డుల దరఖాస్తు ప్రక్రియకు విపరీతమైన స్పందన కనిపిస్తోంది. మీ సేవా కేంద్రాల వద్ద ప్రజలు గంటల తరబడి క్యూలలో నిలబడుతున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకూ దరఖాస్తు చేసుకునేందుకు భారీగా జనాలు తరలివస్తున్నారు. అయితే ఈ రేషన్ కార్డుల జారీ జనవరి 26 న ప్రారంభించిన విషయం తెల్సిందే. సోమవారం నుంచి బుధవారం వరకు 2.6 లక్షల దరఖాస్తులు అయితే బుధవారం ఒక్కరోజే 1 లక్షకు పైగా అప్లికేషన్లు వచ్చినట్లు తెలిపారు.

రేషన్ కార్డుల దరఖాస్తు పై తాజా సూచనలు:
రాష్ట్ర ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియలో కీలక నిర్ణయాలు తీసుకుంది. కులగణన లేదా ప్రజా పాలనలో ఇప్పటికే అప్లికేషన్ సమర్పించినవారు మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. ఇప్పటికే దాదాపు 18 లక్షల మంది తమ రేషన్ కార్డు అప్డేట్ కోసం దరఖాస్తులు చేసుకున్నట్లు సమాచారం. ఇక అదనంగా లక్ష మందికి రేషన్ ఇవ్వడం వల్ల ప్రభుత్వంపై ఏడాదికి రూ.31 కోట్ల భారం పడుతుందని పౌర సరఫరాల శాఖ అంచనా వేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 41 లక్షల కొత్త రేషన్ కార్డులు ఇవ్వనున్నట్లు పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇటీవల తెలిపారు.
రేషన్ కార్డులో కొత్త మార్పులు:
కుటుంబ సభ్యుల పేర్ల చేర్చే అవకాశం పుట్టింటి కార్డులో దూరమైన మహిళల పేర్లు అత్తింటి కార్డులో చేరడం మరియు పిల్లల పేర్లు కూడా చేర్చుతుంది. ఇప్పటికే 18 లక్షల మంది రేషన్ కార్డు అప్డేట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు.
రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకునే ప్రజలు సర్వర్లు పనిచేయకపోవడంతో నెగిటివ్ స్పందన వ్యక్తం చేస్తున్నారు. కొత్త రేషన్ కార్డులు రావాయా లేదా అన్న సందేహంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ప్రజలు డిగ్రీ వరకు వెతకడం వలన సర్వర్లు ఆలస్యంగా స్పందిస్తుండవచ్చు, అయితే రేషన్ కార్డుల కోసం నిరుత్సాహపడకండి. అదనపు అప్లికేషన్లు అవసరం లేదు, కాబట్టి దరఖాస్తు చేసిన వారు తమ రసీదును కాపాడుకుని, ఆందోళన చెందకుండా దరఖాస్తు ప్రాసెస్ను కొనసాగించవచ్చు. దీనిపై పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇటీవల చేసిన ప్రకటన ప్రకారం, రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డుల పంపిణీ ప్రాసెస్ వేగంగా కొనసాగుతోంది. లబ్ధిదారులు తప్పనిసరిగా తన వివరాలను సరిగ్గా నమోదు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.