ప్రముఖ హాస్యనటుడు రాకేశ్ పూజారి (34) గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. ఈ విషాద సంఘటన సోమవారం తెల్లవారుజామున జరిగింది. Rakesh Poojari కమెడియన్గా అభిమానుల మనసు గెలుచుకున్న రాకేశ్, ‘కామెడీ ఖిలాడిగ’ సీజన్ 3లో విజేతగా నిలిచి ఎంతో గుర్తింపు పొందారు. ఆ విజయంతో ఆయన కెరీర్కు మళ్లీ కొత్త ఊపొచ్చింది.కన్నడతో పాటు తుళు చిత్రాల్లోనూ నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. తాజాగా, ఆయన “కాంతార 2” సినిమా షూటింగ్ను పూర్తి చేశారు. ఆ సినిమాలో రాకేశ్ పాత్ర ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉండబోతుందని టీమ్ చెబుతోంది.

సినీ ప్రముఖుల శోకం
రాకేశ్ మృతి వార్త తెలిసిన వెంటనే “కాంతార 2” హీరో రిషబ్ శెట్టి తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆయనతో పాటు నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ కూడా కుటుంబానికి సానుభూతి తెలిపారు. సోషల్ మీడియాలో భావోద్వేగంతో పోస్ట్ పెట్టారు.”మిత్రమా… మళ్లీ జన్మించు,” అని భావోద్వేగంగా రాసారు.
“కాంతారలో నీ పాత్ర గుర్తుకొస్తే నీ చిరునవ్వే ముందుగా గుర్తుకు వస్తుంది. నీ లోటు ఎప్పటికీ నింపలేము,” అంటూ రాకేశ్ పట్ల ఆయనగల ప్రేమను వ్యక్తం చేశారు.రాకేశ్ హాస్యానికి ప్రత్యేక శైలి ఉండేది. ఆయన ముక్కు సూటిగా ఉండేది, టైమింగ్ అద్భుతంగా ఉండేది. వేదికపై ఆయన కనిపిస్తే ప్రేక్షకులు నవ్వుల పూవులే. చిన్నపాటి పాత్రల్లోనూ తనదైన ముద్ర వేసే తీరుతో ఎంతో మంది అభిమానుల మనసు దోచుకున్నారు.ఆయన మరణం ఒక్కసారి నమ్మశక్యం కాదు అనిపించేంత బాధాకరం. ప్రేక్షకుల్లో, సినీ ఇండస్ట్రీలో ఆయనకు ఉన్న స్థానం ప్రత్యేకమైనది. కేవలం నటుడిగా కాదు, మంచి వ్యక్తిగా గుర్తింపు తెచ్చుకున్నారు.
భవిష్యత్తులోనూ గుర్తుండే వ్యక్తిత్వం
“కాంతార 2” చిత్రంతో ఆయన చివరి సందడి చేశారు. ఆ సినిమాకు ఇది తుదిపూట కావడమే కాదు, ఆయనకు జీవితం చివరిపుట. ప్రేక్షకుల గుండెల్లో చిరకాలం నిలిచిపోయే పాత్రతో ఆఖరి నటన చేశారు.రాకేశ్ అభిమానుల కోసం నటించాడు. నిజాయితీగా పని చేశాడు. అతడి హాస్యం, అభినయం ఇకపై మిస్ అవుతాం.
Read Also : Nagarjuna : ఆర్టీఏ కార్యాలయంలో నాగార్జున సందడి