Rajnath Singh: రాజ్‌నాథ్ సింగ్ జమ్మూ కాశ్మీర్ పర్యటన

Read Time:  1 min
Rajnath Singh: రాజ్‌నాథ్ సింగ్ జమ్మూ కాశ్మీర్ పర్యటన
FONT SIZE
GET APP

కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ (Rajnath Singh) శ్రీనగర్ చేరుకున్నారు. గురువారం(మే 15) ఆయన బాదామి బాగ్ కంటోన్మెంట్ కు వెళతారు. జమ్ము కశ్మీర్‌లో తాజా పరిస్థితి ఏంటి? ఇక ముందు చేపటాల్సిన చర్యల గురించి సిబ్బందికి దిశానిర్దేశం చేసేందుకు జమ్ము కశ్మీర్‌లో పర్యటిస్తున్నారు. ఇటీవల పాకిస్తాన్‌లో భారత సైన్యం నిర్వహించిన ప్రధాన ఉగ్రవాద నిరోధక ఆపరేషన్ ఆపరేషన్ సిందూర్ తర్వాత రాజ్‌నాథ్ సింగ్ కాశ్మీర్ లోయకు చేసిన మొదటి పర్యటన ఇది.మే 15న కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ (Rajnath Singh) శ్రీనగర్ చేరుకున్నారు. బాదామీ బాగ్ కంటోన్మెంట్ ప్రాంతాన్ని సందర్శించారు. ఉగ్రవాదంపై మిలిటరీ చీఫ్‌లతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

Rajnath Singh: రాజ్‌నాథ్ సింగ్ జమ్మూ కాశ్మీర్ పర్యటన
Rajnath Singh: రాజ్‌నాథ్ సింగ్ జమ్మూ కాశ్మీర్ పర్యటన

ఆపరేషన్ సిందూర్ అనంతరం తొలి పర్యటన
భారత్-పాకిస్తాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నడుమ రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్జమ్ముకశ్మీర్ పర్యటన చాలా ముఖ్యమైనదిగా పరిగణిస్తున్నారు. శ్రీనగర్ పర్యటన సందర్భంగా, రక్షణ మంత్రి ఈ ప్రాంతంలోని భద్రతా పరిస్థితిని సమీక్షిస్తారు. 15 కార్ప్స్ ప్రధాన కార్యాలయంలో సీనియర్ సైనిక అధికారులతో చర్చలు జరుపుతారు. శ్రీనగర్‌లో తన కార్యక్రమాన్ని ముగించుకున్న తర్వాత, రాజ్‌నాథ్ సింగ్ గురువారం సాయంత్రం న్యూఢిల్లీకి బయలుదేరుతారు.
పాక్ ఆధారిత ఉగ్రవాదులపై దృష్టి
జమ్మూ కాశ్మీర్‌లోని కొన్ని సరిహద్దు ప్రాంతాల్లోని పాఠశాలలు మే 15న తిరిగి తెరవడం జరుగుతుందని జమ్మూలోని పాఠశాల విద్యా డైరెక్టరేట్ బుధవారం ప్రకటించింది. ఈ వార్త విద్యార్థులు, తల్లిదండ్రులకు ఉపశమనం కలిగించే విషయం. భారతదేశం-పాకిస్తాన్ ఉద్రిక్తతల మధ్య, జమ్మూలోని సాంబా, కథువా, రాజౌరి, పూంచ్ జిల్లాల్లోని అనేక ప్రాంతాలలో మే 15 వరకు పాఠశాలలు, విద్యాసంస్థలు మూతపడ్డాయి. తాజా మామూలు పరిస్థితులు నెలకొనడంతో తిరిగి ప్రారంభిస్తున్నట్లు విద్య శాఖ తెలిపింది. అదేవిధంగా, రాజౌరి, పీరీ, కలకోటే, తన్మండి, మొగ్లా, కొట్రంక, ఖవాస్, లోయర్ హతల్, దర్హాల్ ప్రాంతాల్లో కూడా పాఠశాలలు చాలా రోజుల తర్వాత తెరుచుకున్నాయి. పూంచ్‌లోని సురాన్‌కోట్, బుఫ్లియాజ్‌లలో కూడా, పరిస్థితి మెరుగుపడిన తర్వాత మే 15 నుండి విద్యార్థులు పాఠశాలలకు వెళ్లగలిగారు.

Read Also: Puran Kumar Sha: భారత జవాన్ పాకిస్థాన్ చెరలో చిత్రహింసలు

Shobha Rani

రచయిత గురించి

Shobha Rani

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.